ఓ ఇంటివాడు అవుతున్న యువ రచయిత
on Jul 14, 2020
యువ రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ ఇంట ఈ నెలాఖరున పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ నెల 29న ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)లో మౌనిక మేడలో ప్రసన్న కుమార్ బెజవాడ మూడు ముడులు వేయనున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. పైగా, ఇద్దరిదీ ఓకే ఊరు... మచిలీపట్నం. ఇరువురు బంధువులే. "మౌనిక సింపుల్, స్వీట్, ఇన్నోసెంట్ అమ్మాయి" అని ముసిముసి నవ్వులు నవ్వుతూ పెళ్లి విషయం చెప్పారు ప్రసన్న.
ఇండస్ట్రీ నుండి దిల్ రాజు, సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన, రాజ్ తరుణ్, నందినీ రెడ్డి, జబర్దస్త్ గ్యాంగ్ పెళ్ళికి హాజరు కానున్నట్టు సమాచారం.
'సినిమా చూపిస్త మావా'తో రచయితగా ప్రసన్నకుమార్ బెజవాడ వెలుగులోకి వచ్చాడు. దానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. వీళ్ళిద్దరిదీ హిట్ కాంబినేషన్. 'నేను లోకల్', 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాలకు కలిసి పని చేశారు. రవితేజతో సినిమా చేయబోతున్నారు.