ధనుష్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్
on Nov 25, 2020
కోలీవుడ్ స్టార్ ధనుష్ పాన్ ఇండియా బాట పట్టనున్నారు. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసి.. ఇటీవలే మూడో చిత్రాన్ని పట్టాలెక్కించిన ధనుష్.. ఆయా చిత్రాలను కేవలం హిందీలోనే చేశారు. ఇక తమిళ అనువాదాలతో తెలుగువారికీ దగ్గరైన వైనం కూడా ఈ టాలెంటెడ్ స్టార్ సొంతం. ఈ నేపథ్యంలో.. తన ఇమేజ్ కి తగ్గట్టు ఓ పాన్ ఇండియా మూవీ చేసేందుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రాట్చసన్ ఫేమ్ రామ్ కుమారన్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సత్య జ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది. నటుడిగా ధనుష్ కి 42వ చిత్రమైన ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో పట్టాలెక్కనుంది.
ప్రస్తుతం ధనుష్ బాలీవుడ్ లో ఆత్రంగీ రే చేస్తున్నారు. అలాగే.. తమిళంలో మాళవికా మోహనన్ తో జట్టుకట్టి కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. మరి.. ధనుష్ కి ఈ పాన్ ఇండియా వెంచర్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Also Read