మరొక్క సారి ఒకే వేదికపై నందమూరి నటసింహాలు!!
on Feb 25, 2019
కళ్యాన్ రామ్ నటిస్తోన్న లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ `118`. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా నటించారు. ఫేమస్ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ సినిమా ద్వారా డైరక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ స్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమా మార్చి 1న గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి నందమూరి నట సింహాలు బాలకృష్ణ, ఎన్టీఆర్ లు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. బాలకృష్ణ, కళ్యాన్ రామ్ ,ఎన్టీఆర్ ఇటీవల `ఎన్టీఆర్ కథానాయకుడు` బయోపిక్ లో ప్రీ రిలీజ్ తో పాటు అరవింద సమేత థ్యాంక్స్ మీట్ లో కనిపించి నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. మరొక్క సారి ఈ ముగ్గురూ 118 కోసం ఒకే వేదికపై కలవబోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు హైదరాబాద్ లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసారు.