దిల్ రాజు బాటలో ప్రభాస్, శర్వానంద్
on Oct 4, 2017
దిల్ రాజు టాలీవుడ్ అగ్ర నిర్మాతగా అందరి మన్ననలు అందుకున్నాడు. సూపర్ హిట్ సినిమాలు తీయడమే కాకుండా పలువురు రచయితలు, దర్శకులకి అవకాశాలివ్వడం ద్వారా వారికి జీవితాన్నిస్తున్నాడు. ఒక నిర్మాణ సంస్థ నుండి ఒక సంవత్సరానికి ఎన్ని సినిమాలు వస్తాయి? మహా అయితే, ఒకటి లేదా రెండు. కానీ, దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా 2017 లో ఇప్పటికే నాలుగు సినిమాలు నిర్మించి, మరో రెండు సినిమాల్ని పట్టాలకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తర్వాత ఈ తరంలో అంతటి గొప్ప సంస్థ ఏది అంటే యువీ క్రియేషన్స్ అని చెప్పొచ్చు. ప్రభాస్ వెనకుండి నడిపిస్తున్న ఈ నిర్మాణ సంస్థకి ప్రమోద్, వంశీ కృష్ణా రెడ్డి అధినేతలు. యువ హీరో శర్వానంద్ కూడా ఇందులో భాగస్వామి. ఈ ఇద్దరి మధ్య ఇంత సఖ్యత ఉండడానికి గల ప్రధాన కారణం కూడా అదే. మిర్చి, రన్ రాజా రన్, భళా భలే మగాడివోయ్, ఎక్ష్ప్రెస్స్ రాజా, మహానుభావుడు లాంటి విజయవంతమయిన చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ ఈ ఏడు మరో మూడు సినిమాలు నిర్మిస్తుంది.
దిల్ రాజు లాగా యూవీ సంస్థ వాళ్ళు కూడా కథకి ప్రాధాన్యం ఇస్తూ కొత్తవాళ్ళకి, అంతకు ముందు ఫ్లాపులు ఇచ్చిన దర్శకులకి కూడా అవకాశాలు ఇస్తున్నారు. అనుష్క తో భాగమతి తీస్తున్న అశోక్ గత చిత్రం చిత్రాంగద పెద్ద డిజాస్టర్ అన్న విషయం మనకు తెలిసిందే. జిల్ లాంటి ఫ్లాప్ తీసిన తర్వాత రాధా కృష్ణకి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం ఇస్తున్నారు. లక్ష్మణ్ కార్య అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాని తీస్తున్నారు. ఈ సినిమాలే కాకుండా మంచి కథతో వచ్చే వారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారని ప్రచారం. రాజు గారి లాగా ప్రభాస్ సారధ్యంలో నడుస్తున్న యూవీ క్రియేషన్స్ కూడా అగ్ర నిర్మాణ సంస్థగా ఎదగాలని కోరుకుందాం!
Also Read