బిగ్ బాస్... శ్రీముఖికి విశ్రాంతి!
on Nov 7, 2019
మూడున్నర నెలలు... అక్షరాల 105 రోజులు... అయిన వాళ్లకు దూరంగా... ఇంట్లో తాను ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా... బాహ్య ప్రపంచానికి దూరంగా... 15 మంది సభ్యులతో బందీగా... 'బిగ్ బాస్ 3' రియాల్టీ షోలో శ్రీముఖికి గడిపింది. అందులో ఆమె విజేతగా నిలుస్తుందని కొందరు భావించారు. కానీ, రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. ఈ ఓటమి తనలో నిరాశను నింపలేదని శ్రీముఖి చెబుతోంది. 'నువ్వు కోట్లాదిమంది మనసులు గెలుచుకున్నావు' అని చిరంజీవి గారు చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని శ్రీముఖి తెలిపింది. బిగ్ బాస్ ఇంటిలో బెస్ట్ ఫర్ ఫార్మర్ గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నానని షో నుండి బయటకు వచ్చాక అర్థమైందని ఆమె అంటోంది.
'బిగ్ బాస్ 3' విజేత శ్రీముఖి కాకపోయినా... విజేత కంటే ఎక్కువ మొత్తం ఆమెకు వచ్చిందని తెలుస్తోంది. రోజుకు లక్ష రూపాయల చొప్పున 105 రోజులు షో లో ఉన్నందుకు... ఆమెకు కోటికిపైగా ముట్టిందట. లెక్కలు పక్కనపెడితే... ఇన్ని రోజులు ఆ ఇంటిలో బందీగా ఉండి బయటకు వచ్చిన శ్రీముఖి ఇప్పుడు ఏం చేయబోతుందో తెలుసా? కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళుతోంది. మాల్దీవులకు ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసింది. ఆల్రెడీ అక్కడకు చేరుకుంది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని.... తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ రెగ్యులర్ గా చేసే టీవీ షోలు చేయాలని అనుకుంటోంది.
Also Read