శ్రుతి రి-ఎంట్రీ.. పొంగల్ డబుల్ ధమాకా..
on Nov 25, 2020
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా రాణించిన శ్రుతి హాసన్.. గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలు తగ్గించుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తూ వార్తల్లో నిలుస్తోంది.తెలుగులో క్రాక్, వకీల్ సాబ్.. తమిళంలో లాభమ్.. హిందీలో రెండు ప్రాజెక్ట్స్.. ఇలా చేతినిండా సినిమాలతో శ్రుతి ఇప్పుడు మళ్ళీ బిజీ బీగా మారిపోయింది.
కాగా.. రి-ఎంట్రీ బాట పట్టాక శ్రుతి తెలుగులో చేసిన తొలి చిత్రం క్రాక్, తమిళంలో ఒప్పుకున్న మొదటి సినిమా లాభమ్ నిర్మాణం పరంగా తుది దశకు చేరుకున్నాయి. అంతేకాదు.. ఈ రెండు సినిమాలు కూడా 2021 పొంగల్ కే సందడి చేయనున్నాయి. మాస్ మహారాజా రవితేజకి జోడీగా శ్రుతి నటించిన కాప్ స్టోరీ క్రాక్ 2021 సంక్రాంతికి రానుండగా.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతికి జంటగా నటించిన పొలిటికల్ డ్రామా లాభమ్ కూడా అదే సీజన్ లో సందడి చేయనుందని సమాచారం. మరి.. పొంగల్ కి డబుల్ ధమాకా రి-ఎంట్రీ ఇస్తున్న శ్రుతికి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.