రియా డ్రగ్స్ కేసులో ప్రభాస్ హీరోయిన్కీ సమన్లు?
on Sep 21, 2020
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయిన తర్వాత హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ సైతం డ్రగ్స్ తీసుకున్నారని చెప్పినట్టు ముంబయ్ నేషనల్ మీడియా పేర్కొంది. కానీ, ఎక్కడా శ్రద్ధా కపూర్ పేరు రాలేదు. ప్రభాస్ సరసన ‘సాహో’లో నటించిన ఆమెకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమన్లు జారీ చేయనుందని వచ్చిన వార్తలతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
హిందీ సినిమా ఇండస్ట్రీలో రియా చక్రవర్తి డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియడం లేదు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకూ పలువురు హీరోయిన్ల పేర్లను రియా చక్రవర్తి చెప్పిందట. రకుల్, సారా పేర్లు వచ్చినప్పటికీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ధృవీకరించలేదు. శ్రద్ధా కపూర్తో పాటు వాళ్లిద్దరికీ ఈ వారం విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేస్తారని సమాచారం. ఈ కేసు దర్యాప్తును ఎన్సీబీ వేగవంతం చేసింది. ఆల్రెడీ అరెస్ట్ అయిన రియా చక్రవర్తి సహా ఆమె సోదరుడు షోవిక్, మరికొందరికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. సెలబ్రిటీ మేనేజర్లు శృతీ మోడీ, జయ సహాకు సోమవారం సమన్లు జారీ చేశారట.