ఐబీ ఆఫీసర్.. వజ్రాల దొంగ..
on Apr 5, 2021
రి-ఎంట్రీలో విభిన్న పాత్రలతో ముందుకు సాగుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న రాబోతున్న తన రి-ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్`లో లాయర్ వేషంలో దర్శనమివ్వనున్నారాయన. ఈ సినిమా కోసమే తన కెరీర్ లో ఫస్ట్ టైమ్.. ప్లీడర్ పాత్రలో నటించడం విశేషం. అలాగే సెప్టెంబర్ లో విడుదల కానున్న `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. `గబ్బర్ సింగ్`లాంటి చిత్రాల్లో పవన్ ఖాకీ ధరించినప్పటికీ.. ఇది పూర్తిగా కొత్త తరహా పాత్రే.
ఇక 2022 సంక్రాంతికి రానున్న పిరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు`లో వజ్రాల దొంగగా రాబిన్ హుడ్ తరహా పాత్రలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో సందడి చేయనున్నారు. అదే విధంగా.. `గబ్బర్ సింగ్` తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించనున్న సినిమాలోనూ ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ఆఫీసర్ గా కనిపిస్తారని టాక్. అంతేకాదు.. తండ్రీకొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారని వినికిడి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో పవన్ - హరీశ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందట.
మరి.. వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న పవన్.. కొత్త చిత్రాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.