మంచు లక్ష్మి సమ్థింగ్ స్పెషల్!
on Feb 25, 2015
మంచువారి అమ్మాయి లక్ష్మి.. ఇప్పుడు దొంగాట అడుతోంది. అదేనండీ... దొంగాట అనే సినిమాలో నటిస్తోంది. నిర్మాత కూడా ఆమే. అడవి శేష్ హీరో. అయితే ఓ పాటలో లక్ష్మి ఐదుగురు హీరోలతో ఆడిపాడబోతోంది. ఆ హీరోలు ఎవరనుకొంటున్నారు..?? నాగార్జున, రవితేజ, నాని, శింబు, రానా. ఓ పాటలో ఈ ఐదుగురు హీరోలూ కనిపిస్తారట. వాళ్లతో లక్ష్మి డాన్స్ చేస్తుందట. ఈ సినిమా మొత్తానికి ఈ పాట స్పెషలాఫ్ ఎట్రాక్షన్ గా నిలవబోతోందని తెలుస్తోంది. అంతే కాదు.. ఈ పాటలో తాప్సి కూడా కనిపించనున్నదని సమాచారమ్. ఒకే సినిమాలో ఇంతమంది గెస్ట్లా?? మంచు లక్ష్మి ఏం చేసినా సమ్థింగ్ స్పెషల్గా ఉండాలి కదా.??? అందుకే ఈ ప్రయత్నం చేస్తోంది. మరి ఈ ఐదుగురు హీరోల పాట ఏ స్థాయిలో ఉంటుందో...?? వెయిట్ అండ్ సీ.