రకుల్... బ్యాక్ టు హైదరాబాద్
on Jul 14, 2020
లాక్డౌన్కి ముందు రకుల్ ముంబై వెళ్ళింది. తమ్ముడు అమన్ ప్రీత్తో కలిసి అక్కడ ఉంది. ఆల్మోస్ట్ లాక్డౌన్ రెండు నెలలు ఇద్దరూ వండుకుని తిన్నారు. తరవాత ఢిల్లీలోని పేరెంట్స్ దగ్గరకు వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. ఈ రోజు బై రోడ్ రకుల్, అమన్ భాగ్యనగరం చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలో గల తన సొంత ఫ్లాట్ కి వచ్చేశారు.
మరో హీరోయిన్ శృతి హాసన్ కూడా కొన్ని రోజుల క్రితం ముంబై నుండి హైదరాబాద్ వచ్చారు. ప్రజెంట్ షూటింగ్స్ ఏమీ జరగడం లేదు. మరి, హీరోయిన్లు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటే సరైన సమాధానం దొరకడం లేదు. ముంబైలో కరోనా మహమ్మారి రోజు రోజుకి తన ప్రతాపం తీవ్రస్థాయిలో చూపిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నారేమో అని గుసగుస.
తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేసిన సమయంలో హైదరాబాద్ లో రకుల్ ఫ్లాట్ కొనుక్కున్నారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు. హిందీ సినిమాలు చేసేటప్పుడు ముంబై వెళ్ళి వస్తుంటారు. ఇప్పుడు షూటింగ్స్, వర్క్స్ లేవు గనుక ఇక్కడికి వచ్చి ఉంటారు.