అఫీషియల్: మహేష్తో కీర్తీ సురేష్
on Oct 17, 2020
సూపర్స్టార్ మహేష్బాబు సరసన కథానాయికగా నటించే అవకాశం కీర్తీ సురేష్ని వరించిందనేది పాత మాటే. ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటించనున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులో మహేష్కి జోడీగా కీర్తీ నటించనున్నారు. ఈ రోజు కీర్తీ సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 'సర్కారు వారి పాట' బృందం ఈ విషయం చెప్పింది.
అమెరికా నేపథ్యంలో బ్యాంకు మోసాలు, వైట్ కాలర్ క్రిమినల్స్ కథాంశంతో 'సర్కారు వారి పాట' సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్నారు. నిజం చెప్పాలంటే ఈ నెలలో అమెరికా వెళ్లి చిత్రీకరణ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, వీసా సమస్యల వలన అమెరికా ప్రయాణాన్ని వచ్చే ఏడాది జనవరి వాయిదా వేశారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read