చైనాలో డిజాస్టర్ దిశగా '2.0'
on Sep 8, 2019
డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన '2.0' సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద అమోఘమైన ఓపెనింగ్స్ను సాధించిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఈ రూ. 540 కోట్ల భారీ బడ్జెట్ మూవీ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్లలో రిలీజయింది. కాగా ఇప్పుడు సెప్టెంబర్ 6న ఈ సినిమా చైనాలో విడుదలై తొలి రోజు మంచి ఓపెనింగ్స్ను సాధించినా, రెండో రోజు సగానికి పైగా కలెక్షన్లు పడిపోయాయి.
నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చెప్పిన దాని ప్రకారం '2.0' మూవీ చైనాలో ఏకంగా 48,000 3డి స్క్రీన్లలో రిలీజయింది. ట్రేడ్ విశ్లేషకుడు రమేశ్ బాలా వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రెండు రోజులకు 2.01 మిలయన్ డాలర్లను (సుమారు రూ. 14.4 కోట్లు) వసూలు చేసింది. అందులో రెండో రోజు వాటా కేవలం 0.61 మిలియన్ డాలర్లు మాత్రమే. మిగతాది మొదడి రోజు సాధించినదే.
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం '2.0' చైనా రిలీజ్ డిజాస్టర్గా మారనుందనే సంకేతాలనిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. బ్రేకీవెన్ కావాలంటే ఇంకో 6 మిలియన్ డాలర్లను అది వసూలు చెయ్యాల్సి ఉంటుందనీ, కానీ అది అసాధ్యమనీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.