చెప్పింది సరే... ఇచ్చేవారేరి...?
on Aug 19, 2017
ఉట్టికి ఎరలేనమ్మ... స్వర్గానికి ఎగురుతానందట.. అలా ఉంది ప్రస్తుతం తాప్సీ వ్యవహారం చూస్తుంటే. ఈ భామ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్నో ఏళ్లు గడిచినా... సరిగా బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. గ్లామర్ పరంగా మాత్రమే తెలుగు ప్రేక్షకులను అలరించగలిగింది. ఆ తరువాత పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. దాంతో కోలీవుడ్ కు.. అక్కడి నుండి బాలీవుడ్ మకాం మార్చింది ఈ భామ. అయితే బాలీవుడ్ భామకు అవకాశాలు వచ్చి.. అవి హిట్ అయ్యాయి. దీంతో అమ్మడు కళ్లు నెత్తికెక్కి టాలీవుడ్ పై విమర్శలు గుప్పించింది. ఇప్పుడు అవన్నీ మరిచిపోయినట్టు పాపం. అందుకే మళ్లీ టాలీవుడ్ లోనే ఉంటా అంటూ కబుర్లు చెప్పుకొస్తుంది. ప్రస్తుతం తాప్సీ నటించిన 'ఆనందో బ్రహ్మ' సినిమా విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ ఆనందంలో ఉన్న తాప్సీ.... సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇక పై గ్యాప్ తీసుకోకుండా వరుసగా తెలుగు సినిమాలు చేస్తానని చెప్పింది. విచిత్రం ఏంటంటే.. తానే గ్యాప్ తీసుకున్నట్టుగా ఆమె మాట్లాడటం. అసలు ఆమెకు సినిమాలు ఇచ్చేదే తక్కువ మళ్లీ తానే గ్యాప్ తీసుకున్నట్టు వరుసగా సినిమాలు చేస్తాననడం...మరి తాప్సీ వరుసగా సినిమాలు చేస్తా అన్నది సరే కానీ.. మరి ఆమెకు ఇచ్చేవారేరి...?