చైనాలో కలవనున్న చిరంజీవి, రజినీకాంత్... విషయం ఏంటంటే...
on May 30, 2017
80 ల్లో సినిమాల్లో నటించిన సౌత్ ఆక్టర్స్ అందరూ ప్రతి సంవత్సరం కలిసి వేడుకలు చేసుకోవడం ఆనవాయితీ. 2009 నుండి ఒక్కో సంవత్సరం ఈ రీయూనియన్ క్లబ్ లో ఉన్న ఒక్కో నటి కానీ, నటుడు కానీ హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు లిస్సీ, సుహాసిని, చిరంజీవి, రజినీకాంత్, మోహన్లాల్ మరియు అంబరీష్ లు హోస్ట్ చేసారు. ఈసారి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు... ఎవరెవరు వస్తారు అన్న విషయం తెలియదు కానీ... జూన్ మొదటి వారంలో చైనాలో జరిగేట్టు ప్లాన్ చేసారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి చేదు అనుభవం ఎదుర్కొన్న చిరంజీవి, త్వరలో పాలిటిక్స్ లో తన అదృష్టం పరీక్షించుకోనున్న రజినీకాంత్ మాత్రం ఖచ్చితంగా వస్తారని తెలుస్తుంది.
వీళ్లిద్దరు రాజకీయాల గురించి చర్చించుకునే అవకాశం లేకపోలేదు. అయితే, తమ స్టార్డం, స్థాయిని పక్కకి పెట్టి ప్రతి ఒక్కరు యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లాగ సంబరాలు చేసుకోవడం విశేషం. అసలు ఈ 80 రీయూనియన్ క్లబ్ మొదలు పెట్టడం అనే ఆలోచన చేసి, దానిని కార్యరూపం దాల్చేలా చేసింది మాత్రం లిస్సీ మరియు సుహాసిని. ఏటికెటికీ సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. షూటింగులకు డుమ్మా కొడుతున్నారు కానీ... ప్రతి సంవత్సరం అన్ని బాధలు, టెన్సన్స్ పక్కకి పెట్టి చేసుకొనే ఈ కొన్ని రోజుల సంబరానికి మాత్రం అందరూ తప్పనిసరిగా హాజరవుతున్నారు.
Also Read