మరో మెగా ఈవెంట్..పవన్ వస్తేనే..!
on Jan 16, 2017
ఎన్నో సస్పెన్స్ ల మధ్య ఈ సంక్రాంతి పండుగకు విడుదలైన చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ సినిమా నిజంగా అభిమానులకు మంచి పండుగనే తీసుకొచ్చింది. ఇప్పటికీ భారీ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని సినిమా యూనిట్ కూడా అనుకొని ఉండకపోవచ్చు. యూనిట్ కాదు.. మెగాస్టార్ చిరంజీవినే ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేకపోయారట. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఏదీ ఏమైతేనేం మొత్తానికి సినిమా మంచి విజయాన్ని సాధించి.. మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ జోష్ లోనే మెగా ఫ్యామిలీ మరో ఈవెంట్ నిర్వహించేందుకు సిద్దమైనట్టు టాలీవుడ్ టాక్. సినిమాను ఇంత సక్సెస్ చేసినందుకు ఓ 'థ్యాంక్స్ మీట్'ని ఏర్పాటు చేయాలని 'ఖైదీ' టీమ్ భావిస్తోందట. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏపీలో నిర్వహించగా... ఈ ఈవెంట్ని ఇక్కడే హైదరాబాద్లోనే నిర్వహించాలని.. అప్పుడే తెరవెనుక కసరత్తులు కూడా ప్రారంభమయినట్లు తెలుస్తోంది.
ఇక ఎప్పటిలాగే చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ పర్యవేక్షణలోనే దీనికి రూపకల్పన జరుగుతోందట. మరో ఇంట్రస్టింగ్ మ్యాటరేంటంటే... ఈవెంట్కి తమ్ముడు పవన్కళ్యాణ్ని తీసుకురావాలని చిరంజీవి ఆలోచిస్తున్నారట. మరి ఈ ఈవెంట్ కైనా పవన్ వస్తాడో రాడో అన్నదో మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాదు పవన్కళ్యాణ్ ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడమ్మీదనే ఈ కార్యక్రమం ఫైనల్ అయ్యే అవకాశం వుందట. మరి చూద్దాం పవన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో..
Also Read