రవ్వ - సేమ్యా ఇడ్లీ

 

 

 

కావలసిన పదార్ధాలు :
బొంబాయిరవ్వ - ఒక కప్పు
సేమ్యా - అర కప్పు
పెరుగు - మూడు కప్పులు
ఉప్పు - తగినంత
నూనె - ఒక స్పూను
అవాలు - ఒక స్పూను
పచ్చి మిర్చి - రెండు

 

తయారీ విధానం:
ముందుగా బొంబాయిరవ్వ,  సేమ్యాలని విడివిడిగా రంగు మారేదాకా వేయించాలి. ఇప్పుడు పెరుగులో రవ్వ, సేమ్యా, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వత నూనె వేడిచేసి అవాలు వేసి చిటపటలాడుతుండగా రవ్వ, సేమ్యా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఒక్క పదినిమిషాలు పక్కన ఉంచితే రవ్వ నానుతుంది. మాములు ఇడ్లీలు మాదిరిగా ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసి రవ్వ, సేమ్యా ఇడ్లీలు వేసుకోవాలి. మిశ్రమం గట్టిగా అనిపిస్తే కొంచం నీరు కలపొచ్చు ఇడ్లీల పిండిలా జారుగా ఉండాలి. ఈ మిశ్రమం కూడా రుచికి, క్యారట్ కోరి వేసుకోవచ్చు. మిశ్రమాన్ని ఓ పదిహేను నిమిషాలు ఆవిరిపై ఉడికిస్తే రుచిగా ఉండే రవ్వ, సేమ్యా ఇడ్లీ సిద్ధం. 

 

 

-రమ