LATEST NEWS
  తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5 మధ్యాహ్నం 3 గంటలకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో నిర్వహించానున్నారు. రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి,  వానాకాలం పంటలపై కేబినేట్‌లో చర్చ జరగనున్నాది. దరఖాస్తుల పూర్తి పరిశీలన తర్వాతే రాజీవ్‌ యువ వికాసం అర్హులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో చర్చించిన తర్వాతే రాజీవ్‌ యువ వికాసంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.  ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడదని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎంకు ఇప్పటికే నివేదిక అందింది. నివేదికను సీఎం, మంత్రులకు భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్‌లో చర్చించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి సీఎం, మంత్రులు అభినందనలు తెలిపారు. మే 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.  
ఎట్ట‌కేల‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడి విచార‌ణ చేయ‌డానికి సిట్ కి దారులు బార్లా తెరుచుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ అంటే గ‌త 14 నెల‌లుగా అమెరికాలో ఉన్న ప్ర‌భాక‌ర్ రావు వ్య‌వ‌హారం, ఎన్నో మ‌లుపుల మీద మ‌లుపులు తిరిగి,  ఆయ‌న ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ వ‌చ్చే  వ‌ర‌కూ సాగింది. త‌న‌కు ముంద‌స్తు బెయిలు ఇస్తేనే హైద‌రాబాద్ వ‌స్తానంటూ ఆయ‌న హైకోర్టుకెక్కారు. హైకోర్టు స‌మ్మ‌తించ‌లేదు. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు.. అక్క‌డ ఊర‌ట ల‌భించింది. మేము చెప్పే వ‌ర‌కూ ఆయ‌న్ను అరెస్టు చేయ‌వ‌ద్దంటూ సుప్రీం కోర్టు  తీర్పునివ్వ‌డంతో.. ఆయ‌న హైద‌రాబాద్ రిట‌ర్న్ అయ్యారు. సీట్ ఆయనను గురువారం (జూన్ 5)న విచారించనుంది.  అయితే గ‌తంలో ప్ర‌భాక‌ర్ రావు పాస్ పోర్టును  కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఆయ‌న పాస్ పోర్టును పున‌రుద్ద‌రించాల‌ని సుప్రీం ఆదేశించ‌డంతో ఆయ‌న అమెరిక‌న్ ఎంబ‌సీని క‌ల‌సి త‌న సింగిల్ విజిట్ పాస్ పోర్టును తీసుకుని హైద‌రాబాద్ వ‌స్తున్నారు. తానేమీ త‌ప్పు చేయ‌లేదు. అన్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లంటారు ప్ర‌భాక‌ర్ రావు. అలాంటి ప్ర‌భాక‌ర్ రావు గురువారం (జూన్ 5) జ‌రిగే విచార‌ణ‌లో నిజాలు చెబుతారా? ఇప్పటికే ఎస్ఐబీ చీఫ్ ప్ర‌ణీత్ రావు.. ఆయ‌న కింద ప‌ని చేసిన రాధాకిష‌న్ రావు, భుజం గ‌రావు, వేణుగోపాల రావు, భూప‌తి..  వీరంతా అరెస్ట‌య్యారు. క‌ న్ఫెష‌న్ లో..  నిజాలు ఒప్పుకున్నారు. త‌మ ఉన్న‌తాధికారి చెప్ప‌డం వ‌ల్ల మాత్ర‌మే తామిలా చేశామ‌ని అన్నారు. ఆ ఉన్న‌తాధికారి మ‌రెవ‌రో కాదు ప్ర‌భాక‌ర్ రావే. మ‌రి ప్ర‌భాక‌ర్ రావు ఈ నింద‌ను ఎవ‌రిపై కి నెడతారంటే..  మిగిలింది గ‌త పాల‌క వ‌ర్గం. అంటే బీఆర్ఎస్ అధినాయకుడైన కేసీఆర్. మ‌రి ప్ర‌భాక‌ర్ రావు..  కేసీఆర్ త‌దిత‌రుల పేర్లు బ‌య‌ట పెడ‌తారా? అన్న స‌స్పెన్స్ న‌డుస్తోంది. ప్ర‌భాక‌ర్ రావు అనే ఈ వెల‌మ రిటైర్డ్ ఐపీఎస్  తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసింది నాటి బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో. ఆయ‌న కింద  సిరిసిల్ల డీఎస్పీగా ఉన్న ప్ర‌ణీత రావును ఎస్ఐబీ చీఫ్ గా నియ‌మించారు. ప్ర‌ణీత్ కింద రాధాకిష‌న్ వంటి అధికారులు గ్రౌండ్ లెవ‌ల్లో వ‌ర్క్  చేసేలా ఒక ఆర్డ‌ర్ సెట్ చేశారు. ప్ర‌భుత్వం మారాక ప్ర‌ణీత్ త‌న  ఆఫీసులో ఈ ఫోన్ ట్యాపింగ్ మెటీరియ‌ల్ మొత్తం ధ్వంసం చేసేయ‌త్నం చేయ‌డంతో మొద‌లైందీ కేసు. 2023 డిసెంబ‌ర్ 4 న ఆయ‌నీ ప‌నులు చేయ‌గా.. 2024 మార్చిలో పంజాగుట్ట‌లో కేసు న‌మో ద‌య్యింది. అలా ఈ కేసు బ‌య‌ట ప‌డింది.   వీరంతా క‌ల‌సి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయాల్సిందేంటంటే.. ఆనాటి ప్ర‌త్య‌ర్ది వ‌ర్గాల వారైన రాజ‌కీయ సినీ వ్యాపార  ప్ర‌ముఖులు మాట్లాడే మాట‌ల‌ను విన‌డం. ఆ స‌మాచారం ద్వారా వారి ఆర్ధిక మూలాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం. అలా రేవంత్ రెడ్డి ఇంటి ముందు 200 మీ. ప‌రిధిలో.. తిరుగుతూ ఆయ‌న మాట్లాడిన ప్ర‌తి  మాట‌నూ విన్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ ప‌రిక‌రాల‌ను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ పేరిట తెప్పించారు. బేసిగ్గా వీటిని.. తీవ్ర‌వాదుల‌ను అరిక‌ట్ట‌డానికి మాత్ర‌మే వాడుతారు భార‌త్ లో. అలాంటి ట్యాపింగ్ మిష‌న్ల‌ను మ‌రెక్క‌డా వాడ్డానికి వీల్లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రసాదించిన గోప్య‌త హ‌క్కును హ‌రిస్తుంది. ఈ హ‌క్కును కాల‌రాసే అధికారం ఎవ‌రికీ లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్ లో ఎవ‌రి మీదా ఈ త‌ర‌హా కేసు పెట్ట‌లేదు. అయితే 1988లో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి రామ‌కృష్ణ హెగ్డే ఈ ఆరోప‌ణ‌ల  కార‌ణంగా త‌న ప‌ద‌వి నుంచి దిగిపోవ‌ల్సి వ‌చ్చింది.  ఇప్పుడీ కేసు లో ఏవ‌న్ గా ఉన్న ప్ర‌భాక‌ర్ రావు త‌న‌పై స్థాయిలో ఉన్న ఆనాటి సీఎం ప్ర‌భుత్వాధినేత కేసీఆర్ చెప్ప‌డం వ‌ల్లే ఇలా చేశాన‌ని చెబితే.. కేసు అటు ట‌ర్న్ తీసుకుంటుంది. దీంతో  ఇటు కాళేశ్వ‌రం దెబ్బ అటు  ఫోన్ ట్యాపింగ్ దెబ్బ ఒకే సారి గులాబీ బాస్ గూబగుయ్యిమ‌నిపించ‌డం ఖాయం.  మ‌రి ఆ దిశ‌గా ప్ర‌భాక‌ర్ రావు చెప్పే అవ‌కాశ‌ముందా? లేక త‌న ఐపీఎస్ బుర్రంతా వాడి త‌ప్పించుకుంటారా? ఈ ప‌ద‌నాలుగు నెల‌ల పాటు ఆయ‌న అమెరికాలో క్యాన్స‌ర్ చికిత్స చేయించుకునే నెపంతో వెళ్లి అక్క‌డ‌ ఏం ప్లాన్ చేసి ఉంటారు? అన్న‌ది తేలాల్సి ఉంది.
ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3)  సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది. ఈ సారి ఫైనల్స్ లో ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచినా, అటు పంజాబ్ కింగ్స్ విజయం సాధించినా.. చరిత్రే. ఎందుకంటే.. ఇప్పటి వరకూ 17 సార్లు   జరిగిన ఐపీఎల్ లో ఈ రెండు జట్లూ విజేతగా నిలిచింది లేదు. అందుకే ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా తొలి సారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న జట్టుగా నిలుస్తుంది.  అదంతా పక్కన పెడితే.. ఐపీఎల్ జట్లన్నిటిలోనూ అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న జట్లు బెంగళూరు మాత్రమే. అందులోనూ ఆ జట్టు కీలక ఆటగాడు కింగ్ కోహ్లీ జెర్సీ నంబర్ 18.. అలాగే ఇప్పుడు జరుగుతున్నది కూడా 18వ ఎడిషన్ కావడంతో ఈ సారి బెంగళూరు జట్టు ట్రోఫీ ముద్దాడటం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దేశంలోనే అత్యంత పెద్ద ఫ్యాన్ బేస్‌ ఉన్న ఆర్సీబీ ఐపీఎల్‌లో 18 సీజన్లలో ఏకంగా పది సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నప్పటికీ, టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది.  దీంతో ఫ్యాన్స్ ఈ సారి ఎలాగైనా ఆర్సీబీయే కప్ సాధిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇందు కోసం పూజలు చేస్తున్నారు. 'ఈ సాల కప్ నమ్దే!' అంటూ ఉత్సాహంతో రెచ్చిపోతున్నారు. ఆర్సీబీ ఫ్యాన్ బేస్ లో దిగ్గజ మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. లిటిల్ మాస్టర్, లెజండరీ సునీల్ గావస్కర్ ఈ సారి ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిస్తే.. దేశంలో ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని స్థాయిలో సంబరాలు అదే సెలిబ్రేషన్స్ చూస్తామని వ్యాఖ్యానించారు. మరో దిగ్గజ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అయితే.. తాను పంజాబ్ కింగ్స్ కే సపోర్ట్ చేస్తానని ట్వీట్ చేశాడు. అలా ట్వీట్ చేసి ఊరుకోలేదు.. తాను మద్దతు పలికిన జట్టు గెలవదు అంటూ ముక్తాయించాడు. అంటే తాను ఎంత గట్టిగా ఆర్సీబీ విజయాన్ని కోరుకుంటున్నానన్నది సెహ్వాగ్ అలా వ్యక్తం చేశాడు. ఇక పొలిటీషియన్స్ లో కూడా ఆర్సీబీకి బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అయితే ఏకంగా ఆర్సీబీ జెర్సీ ధరించి ఈ సాల కప్ నమ్దే అంటూ వీడియో రిలీజ్ చేశారు.  ఇది ఒక మ్యాచ్ మాత్రమే కాదు. మన క్షణం. మన కప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్‌సీబీ..  కర్ణాటక ప్ర‌జ‌లందరూ మీకే మద్దతు ఇస్తూ మీ వెంటనే ఉన్నారంటూ డీకే శివకుమార్ పేర్కొన్నారు.  చూద్దాం మరి అశేష అభిమానుల కలను ఆర్సీబీ ఈ సారి నెరవేరుస్తుందేమో. 
    కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ తన సినిమా థగ్ లైఫ్ జూన్ 05 న కర్ణాటకలో విడుదల కావడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి ఏ ఆధారాలతో కన్నడ తమిళ భాష నుండి పుట్టిందని వ్యాఖ్యలు చేశారని, ఒక్క క్షమాపణ చెబితే విషయం సద్దుమణుగుతుందని కర్ణాటక హైకోర్టు పేర్కొన్నాది.  మీరేమైనా చరిత్రకారుడా ? ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు ? అంటూ కమల్ హాసన్‌ను కోర్టు  ప్రశ్నించింది. దీంతో కమల్ హాసన్‌పై కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తమ రాష్ట్ర భాషను అవమానించినందుకు కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సినిమా విడుదలను నిషేధించాలని ప్రకటించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని కన్నడిగులు డిమాండ్ చేశారు, కానీ అతను తాను తప్పు మాట్లాడలేదని, క్షమాపణ అవసరం లేదని స్పష్టం చేశారు.
కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక  మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ ಅಂదాಲ పోటీల్లో ద్వితీయ స్థానం కైవశం చేసుకున్నారు. ఉద్యోగం వీడి భర్తతో అమెరికాకు వెళ్లినా తన ప్రతిభతో ఇంకా రాణి స్తూనే ఉన్నారు. ఇందుకు గత నెల 26వ తేదీన అమెరికాల్లోని మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ ಅಂదాಲ పోటీల్లో ద్వితీయ స్థానం కైవశం చేసుకోవడమే ఉదాహరణ.  గుడివాడకు చెందిన అట్లూరి కృష్ణప్రసాద్, శైలజ దంపంతుల కుమార్తె  మౌనిక బెంగళూరులో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 2013లో ఏపీపీఎస్సీలో ఉద్యోగం సంపాదించి వరంగల్ లో ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వహించారు.  అనంతరం ఆపరేషన్ భగీరథలో ఇంజినీర్ గా పనిచేసిన ఆమెకు చెన్నైకు చెందిన పరు చూరి జితేంద్ర కుమార్ 2014లో వివాహం అయ్యింది. వివాహానంతరం ఉద్యోగం మానేసిన మౌనిక భర్తతో  కలిసి 2017లో అమెరికా వెళ్లారు.  అక్కడ సేల్స్ ఫోర్సు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం, సేవా లక్షణాలు మెండుగా ఉన్న మౌనిక మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో పాల్గొని వేల మందిని దాటుకుని 25 మంది తుది జాబితాలో స్థానం సంపాదిం చుకున్నారు.  మే 26న డల్లాస్ లో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్లో   జరిగిన ఫైనల్స్ లో రెండో స్థానం దక్కించు కున్నారు.    
ALSO ON TELUGUONE N E W S
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab). ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.    'రాజా సాబ్' సినిమాని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ తో పాటు టీజర్ అప్డేట్ కూడా ఇచ్చారు. జూన్ 16న ఉదయం 10.52 నిమిషాలకు టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.     ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో 'రాజా సాబ్'ను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి నెలకొంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తదితరులు నటిస్తున్నారు.    గతేడాది డిసెంబర్ 5న అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ ఏడాది అదే డేట్ కి 'రాజా సాబ్' రానుండటం ఆసక్తికరంగా మారింది. మరి పుష్ప-2 బాటలోనే రాజాసాబ్ కూడా సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.    
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హరీష్ శంకర్(Harish Shankar)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉస్తాద్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ పొలిటికల్ బిజీతో పాటు వేరే చిత్రాల కమిట్ మెంట్ ఉండటం వలన ఉస్తాద్ షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. తన అప్ కమింగ్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 12 న విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఆ మూవీ ప్రమోషన్స్ తర్వాత పవన్ తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్స్ ని కంప్లీట్ చెయ్యాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి.   రీసెంట్ గా హరీష్ శంకర్ మాట్లాడుతు 'ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జూన్ రెండో వారం నుంచి స్టార్ట్ కాబోతుందని చెప్పాడు.. దీంతో ఉస్తాద్  ని పవన్ స్పీడ్ గా పూర్తి చెయ్యాలనుకుంటున్నాడనే వార్తలకి బలం చేకూరినట్టయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్ అందులోని పవన్ డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీలీల(Sreeleela)హీరోయిన్ గా చేస్తున్న ఉస్తాద్ ని  అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  
Kamal Haasan has dragged himself into a big controversy with his remarks that Kannada language has originated from Tamil. Talking about his emotional connect with Shiv Rajkumar, he made these comments at Thug Life audio launch event in Chennai and it triggered Kannada activists. Many claimed that he is wrong in stating that Kannada is a derivative language from Tamil.  They demanded apology from Kamal but the actor stayed adamant on his point. Kannada Film Chamber of Commerce, KFCC, asked Kamal to apologise before 30th May to allow for Thug Life release in Karnataka. With ban threats mounting, Kamal moved to Karnataka High Court and asked them to permit the release.    High Court questioned Kamal Haasan, if he is an historian or a linguist - language expert, to make such remarks. They remarked that with simple apology, he can end the matter amicably and he should do that. Kamal immediately, released a letter from his office stating that his intention has never been to hurt Kannada people.  He further stated that his remarks have been taken out of context and he regerts it. Thug Life is releasing on 5th June and it is directed by Mani Ratnam. After Nayakan, the duo is back with another gangster flick after 38 years. They promise this to be as good as Nayakan and Simbu, Trisha are playing other leading roles.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  తెలుగునాట తిరుగులేని క్రేజ్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సొంతం. పవన్ రాజకీయాలతో బిజీ అయినప్పటికీ, ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 12న 'హరి హర వీరమల్లు'తో పలకరించనున్న పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25న 'ఓజీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముఖ్యంగా పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న సినిమా కావడంతో 'ఓజీ'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను తగ్గట్టుగానే.. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే దిమ్మతిరిగే రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.   'ఓజీ' సినిమా నైజాంలో ఏకంగా రూ.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా నైజాంలో రూ.90 కోట్లకు పైగా బిజినెస్ ఒక్క పుష్ప-2 సినిమా మాత్రమే చేసింది. పుష్ప-2 మూవీ రూ.100 కోట్ల బిజినెస్ చేయగా, రూ.75 కోట్లతో ఆర్ఆర్ఆర్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. అలాంటిది ఇప్పుడు ఓజీ మూవీ.. ఆర్ఆర్ఆర్ మించిన బిజినెస్ చేసినట్లు సమాచారం.    ఓజీ చిత్రానికి సాహో ఫేమ్ సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.     తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్.  
2000వ దశకంలో  టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, వి.వి.వినాయక్‌ సంచలన విజయాలు అందుకున్నారు. వీరిలో రాజమౌళి.. ఫెయిల్యూర్‌ అనేది లేకుండా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.  మరో దర్శకుడు పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో హిట్స్‌, ఫ్లాప్స్‌ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అతను చివరగా గత ఏడాది చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు పూరి. విజయ్‌ సేతుపతి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. టబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తారు.  ఇక వి.వి.వినాయక్‌ విషయానికి వస్తే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నితిన్‌ వంటి పెద్ద స్టార్స్‌తో బ్లాక్‌ బస్టర్స్‌ చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన కెరీర్‌ స్తబ్దుగా మారిపోయింది. 2018లో సాయిధరమ్‌తేజ్‌తో చేసిన ఇంటెలిజెంట్‌.. ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఒక్క సినిమా ఫ్లాప్‌తో హీరోలెవరూ వినాయక్‌తో సినిమా చేసేందుకు ముందుకు లేదు. 2023లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో హిందీలో ఛత్రపతి రీమేక్‌ చేశారు. అది కూడా నిరాశనే మిగిల్చింది. దానికితోడు వినాయక్‌ని ఆరోగ్య సమస్యలు వేధించాయి. అయితే ఇటీవల ఆయన కోలుకొని మునుపటి ఉత్సాహంతోనే ఉన్నారని తెలుస్తోంది. మరో సూపర్‌హిట్‌ సినిమా చేసి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని వినాయక్‌ ఆశిస్తున్నారు. తన నెక్స్‌ట్‌ సినిమా చేసేందుకు నిర్మాతను కూడా సెట్‌ చేస్తున్నారు. ప్రజెంట్‌ జనరేషన్‌కి కనెక్ట్‌ అయ్యే మంచి కథతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అయితే హీరో ఎవరు అనేది మాత్రం సస్పెన్స్‌లోనే ఉంది.  ప్రస్తుతం వినాయక్‌ ఫామ్‌లో లేకపోవడం వల్ల ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న స్టార్‌ హీరోలెవరూ అతనితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయినప్పటికీ ఇద్దరు, ముగ్గురు హీరోలను అప్రోచ్‌ అయ్యారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో యంగ్‌ హీరోలతో వెళితేనే బెటర్‌ అని భావించి సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేసేందుకు వినాయక్‌ ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ‘డిజె టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న సిద్ధు.. ఇటీవల భాస్కర్‌తో చేసిన ‘జాక్‌’ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో డైరెక్టర్ల ఎంపిక విషయంలో మరింత కేర్‌ తీసుకోవాలని సిద్ధు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అంతకుముందు భాస్కర్‌ ఎన్నో సూపర్‌హిట్స్‌ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో వెనకపడ్డారు. అలాంటి డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇవ్వడం వల్ల తను ఓ డిజాస్టర్‌ చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 8 సంవత్సరాలుగా హిట్‌ అనేది లేని వినాయక్‌తో సిద్ధు సినిమా చేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మరి ఇప్పుడు వినాయక్‌ని హిట్‌ ట్రాక్‌లో పెట్టే హీరో ఎవరు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. 
శ్రీకాంత్(Srikanth)నట వారసుడు రోషన్(Roshan)2016 లో 'నిర్మల కాన్వెంట్' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2021 లో 'పెళ్ళి సందడి' తో ప్రేక్షకులని అలరించిన రోషన్, ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న  'ఛాంపియన్' అనే మూవీ చేస్తున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి' వృషభ' అనే పాన్ ఇండియా మూవీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రీసెంట్ గా 'హిట్ 3 ' తో విజయాన్ని అందుకున్న శైలేష్ కొలను(Sailesh Kolanu)దర్శకతంలో రోషన్ ఒక సినిమా చేస్తున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో  వార్తలు వస్తున్నాయి. లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతుందని, ఒక కొత్త రోషన్ ని ఈ చిత్రం ద్వారా చూడబోతున్నారని అంటున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్ టైన్ మెంట్ భారీ బడ్జెట్ తో రోషన్ చిత్రాన్ని తెరకెక్కించబోతుందని, త్వరలోనే అధికార ప్రకటన  కూడా రానుందనే వార్తలు సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.     
2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా వంటి చిత్రాల తర్వాత స్టార్ హీరో 'విజయ్ దేవరకొండ'(VIjay Devarakonda)కెరీర్ లో మరో హిట్ లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో 'కింగ్ డమ్' అనే మూవీ చేస్తున్నాడు. నాచురల్ స్టార్ 'నాని' కి జెర్సీ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)దర్శకుడు. దీంతో కింగ్ డమ్ పై విజయ్ తో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 4 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజై న టీజర్ తో అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. నటనకి సంబంధించి విజయ్ లో ఉన్న మరో కొత్త కోణం 'కింగ్ డమ్'(KIngdom)ద్వారా కనువిందు చేయనుందని కూడా టీజర్ తో అర్ధమవుతుంది. దీంతో కింగ్ డమ్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి అడుగుపెడుతుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తు ఉన్నారు. షూటింగ్ కూడా   కంప్లీట్ అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందనే వార్తలు వచ్చాయి. అలాంటి ఈ టైం లో 'కింగ్ డమ్ కి సంబంధించిన ఫైనల్ కట్ ని గౌతమ్ తిన్ననూరి చూసుకున్నాడని, కొన్ని సీన్స్ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో రీ షూట్ చెయ్యాలని భావించి, గోవాలో వాటిని చిత్రీకరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ ఈ విషయాన్నీ బయటకి రాకుండా జాగ్రత్త పడినా కూడా, ఈ న్యూస్ బయటకి వచ్చిందని అంటున్నారు. దీంతో విజయ్ అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. రిలీజ్ కి ఇంకా నెల కూడా టైం లేదు. ఆల్రెడీ మూవీ కంప్లీట్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. విజయ్ అయితే ఒక రకంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. అలాంటి టైంలో ఇప్పుడు రిపేర్లు ఏంటని  సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. ఈ న్యూస్ నిజామా కాదా  అనే విషయంలో చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు.  విజయ్ దేవరకొండ సరసన 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ 'భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)'హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవల ఈ ఇద్దరకీ సంబంధించిన కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యాయి. ఇద్దరి ఫెయిర్ చాలా బాగుందనే పేరు వచ్చింది. సత్యదేవ్, కౌశిక్ మెహతా కీలక పాత్రల్లో కనిపిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తుండగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.  
  జూన్ 12న 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. పైగా, పవన్ నటించిన తొలి చారిత్రాత్మక చిత్రమిది. దీంతో వీరమల్లుపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా.. లాక్ డౌన్ రావడం, పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడం.. వంటి కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.   'హరి హర వీరమల్లు' సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 8న తిరుపతిలో ఘనంగా నిర్వహించడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తోంది. సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పేలా వీరమల్లు సినిమా ఉండనుంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం.. పవిత్ర నగరం తిరుపతిని ఎంచుకున్నారు. మరోవైపు నిజ జీవితంలోనూ పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలను పవన్ విమర్శించగా.. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో తిరుపతి ఈవెంట్ లో పవన్ ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.   పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి.. ఆయన ఏ సినిమా వేడుకలో పాల్గొన్నా అది రాజకీయ కార్యక్రమాన్నే తలపిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని సినిమా వేడుకల్లో ఆయన స్పీచ్ లు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అలాంటిది ఇది పవన్ కళ్యాణ్ నటించిన సినిమా. అందునా ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా. అంతేకాకుండా సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా. ఇన్ని ప్రత్యేకలు ఉండటంతో.. తిరుపతి ఈవెంట్ లో పవన్ స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నారు? అనేది జూన్ 8న తేలిపోనుంది.  
  మూవీ: టూరిస్ట్ ఫ్యామిలీ నటీనటులు:  ఎమ్.శశి కుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేశ్ తదితరులు ఎడిటింగ్: భరత్ విక్రమన్ సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్ మ్యూజిక్: సీన్ రోల్డన్ నిర్మాతలు: నజిరత్ పసీలియన్, ముగేశ్ రాజ్ పసీలియన్ రచన, దర్శకత్వం: అభిషన్ జీవింత్ ఓటీటీ: జియో హాట్ స్టార్ కథ: ధర్మదాస్ (శశికుమార్) వాసంతి (సిమ్రాన్) భార్యాభర్తలు. వారి సంతానమే నీతూ షాన్( మిథున్) మురళి (కమలేశ్). ఈ ఫ్యామిలీ శ్రీలంక నుంచి భారత్ కి అక్రమంగా వస్తుంది. ఒక పోలీస్ టీమ్ కి దొరికిపోయినా, తెలివిగా తప్పించుకుంటారు. వాసంతి అన్నయ్య ప్రకాశ్ (యోగిబాబు) వాళ్లు ఇక్కడ ఉండటానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తాడు. తాము శ్రీలంక నుంచి వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. కేరళ నుంచి వచ్చినట్టుగా అందరికి చెప్తారు. ఎవరితోనూ ఎక్కువగా పరిచయాలు పెంచుకోవద్దని ప్రకాశ్ చెప్పిన మాటలను వాళ్లెవరూ పట్టించుకోరు. ఇదిలా ఉండగా సిటీలో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్, పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. అక్రమంగా చొరబడిన శరణార్థులే అందుకు కారణమని వాళ్లు భావిస్తారు. ఆ దిశగా వాళ్లు సెర్చ్ చేస్తూ ఉంటారు. సిటీలోకి ప్రవేశిస్తూ తనకి దొరికిపోయిన ధర్మదాస్ ఫ్యామిలీపై ఆ పోలీస్ కి అనుమానం వస్తుంది. దాంతో ఆ విషయాన్ని పై అధికారికి చెప్తాడు. ఆ తర్వాత ఏమవుతుందనేది కథ. విశ్లేషణ: కొన్ని  సినిమాలు అంచనాలు లేకుండా వస్తాయి. అందరికి నచ్చేస్తాయి. అలాంటివి చాలా అరుదుగా వస్తాయి. సంవత్సరం క్రితం వచ్చిన '90s' , రీసెంట్ గా వచ్చిన  'అనగనగా' ఇలా కొన్ని మాత్రమే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.‌ ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఈ టూరిస్ట్ ఫ్యామిలీ చేరింది.  కథలో ప్రధానంగా కనపడేది అరడజన్ పాత్రలు మాత్రమే కానీ సినిమా అంతా ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరి పాత్ర చిన్నదిగానో పెద్దదిగానో అనిపించదు. ఎందుకంటే ఇది మన చుట్టుపక్కల ఉండే వారి జీవనశైలిలా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు మన వీధిలో ఉండేవాళ్ళని చూసిన ఫీల్ కలుగుతుంది. శ్రీలంక నుండి వచ్చిన ఓ కుటుంబం ఎలా సర్వైవ్ అయ్యారనే చిన్న పాయింట్ తో కథని ముందుకు తీసుకెళ్ళాడు దర్శకుడు. అయితే ఆ పాయింట్ తో పాటు మన చుట్టూ ఉండే వారితో మనం బాగుంటే.. వారు మనల్ని ఎంతలా అభిమానిస్తారో కూడా ఈ కథ చెప్తుంది.  ఒక కుటుంబం కోసం ఓ వీధి అంతా కలిసి సపోర్ట్ చేయడం.. వారికి తోడుగా ఉండటం చూస్తుంటే.. అరెరె ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులున్నారా.. ఇలాంటి అభిమానం ఉంటుందా అనే భావన కలుగుతుంది. ఈ ‌సినిమాలో  ఓ నాన్న, ఓ అమ్మ, పెద్ద కొడుకు, చిన్న కొడుకు.‌. ఇలా అందరి ఎమోషన్స్ ని సమపాళ్ళలో చూపించాడు దర్శకుడు.  సినిమా నిడివి రెండు గంటలే కాబట్టి హ్యాపీగా చూసేయొచ్చు. అడల్ట్ సీన్లు ఏమీ లేవు.. ఎక్కడ అసభ్య పదజాలం వాడలేదు.. చివరి వరకు ఎంగేజింగ్ గా సాగే ఈ ఫ్యామిలీ డ్రామా విత్ సర్వైవింగ్ థ్రిల్లర్ ని హ్యాపీగా చూసేయొచ్చు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. సీన్ రోల్డన్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు: ధర్మదాస్ గా శశికుమార్, వాసంతిగా సిమ్రాన్, నీతూ షాన్ గా మిథున్, మురళిగా కమలేశ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. ప్రకాశ్ గా యోగిబాబు తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.  రేటింగ్:  3 /5 ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే కథ ఇది. డోంట్ మిస్ . ✍️. దాసరి మల్లేష్
ఒక సినిమాని అందరూ మెచ్చేలా తియ్యడం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. సాధారణంగా సినిమా రిలీజ్‌కి వచ్చే సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు.. మేకర్స్‌ నిర్వహించే ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఉంటారు. అందులో భాగంగా రకరకాల ఈవెంట్స్‌లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంటారు. అయితే కొందరు హీరోలు, హీరోయిన్లు సినిమా చేయడంతో తమ పని అయిపోయిందని, ప్రమోషన్స్‌కి రావడం కుదరదని చెప్తుంటారు. అలాంటి వారిలో హీరో అజిత్‌, హీరోయిన్‌ నయనతార పేర్లను ప్రముఖంగా చెప్పుకోవాలి. అజిత్‌ విషయానికి వస్తే.. సెట్‌కి వచ్చి షూటింగ్‌లో పాల్గొనడం తప్ప ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకు, తనకు సంబంధం లేదని చెప్పేస్తుంటాడు. ఈవెంట్స్‌కి హాజరు కావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడు. హీరోయిన్‌ నయనతారది కూడా అదే పద్ధతి. సినిమా కమిట్‌ అయ్యే ముందే తాను ప్రమోషన్స్‌కి రాను అని చెప్పేస్తుంది. దాని ప్రకారమే అగ్రిమెంట్‌ చేసుకుంటుంది. అయితే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమా కోసం షూటింగ్‌ ప్రారంభం కాకముందే ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో నయనతార ట్రోలింగ్‌కి గురవుతోంది.  వరస హిట్స్‌తో దూసుకెళ్తున్న అనిల్‌రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో మరో బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ వెంటనే తన నెక్స్‌ట్‌ మూవీ మెగాస్టార్‌ చిరంజీవితో అని అనౌన్స్‌ చేయడం, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. అయితే ఈ సినిమాకి ఎనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రమోషన్స్‌ చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి 157వ సినిమా కావడంతో అనిల్‌ రావిపూడి ఎక్కువ కేర్‌ తీసుకుంటున్నారు. ఈ సినిమా గురించి డిస్కస్‌ చేసేందుకు చెన్నయ్‌ వెళ్లిన అనిల్‌.. నయనతారను కలిసి, ఆమెను ఒప్పించి వెంటనే ఒక ప్రమోషన్‌ వీడియో కూడా చేయించారు. ప్రమోషన్స్‌కి దూరంగా ఉండే నయన్‌తో సినిమా స్టార్ట్‌ అవ్వకముందే ఒక వీడియో చేయించడంతో అనిల్‌ను అందరూ అప్రిషియేట్‌ చేశారు. అదే సమయంలో నయనతారను ట్రోల్‌ చేస్తూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇంతకుముందు చిరంజీవితో సైరా, గాడ్‌ఫాదర్‌ చిత్రాల్లో నటించిన నయనతారకు ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. డబ్బు ఎక్కువ ఇచ్చారని ముందు నుంచే ప్రమోషన్స్‌ చేస్తున్నావా అంటూ కొందరు నెటిజన్లు నయనతారను ట్రోల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ నెటిజన్ల నుంచే ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ‘ఇప్పటివరకు తమిళ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్‌లో పాల్గొనని నువ్వు.. తెలుగు సినిమాకి షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే ఎలా ప్రమోషన్స్‌ చేస్తున్నావు? నీకు తెలుగు సినిమాలు ఇంట్రెస్ట్‌ ఉంటే టాలీవుడ్‌కి వెళ్లిపో.. ఇక్కడెందుకు ఉన్నావు?’ అంటూ తీవ్రపదజాలంతో నయనతారను విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన నయనతార.. ‘ప్రమోషన్స్‌కి వెళ్లాలా? వద్దా? అనేది నా వ్యక్తిగత విషయం. నాకు ఎలా వీలవుతుందో అలా చేసుకునే అవకాశం నాకుంది. ఈ విషయంలో మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇలాంటి అనవసర విషయాల గురించి మాట్లాడి నా టైమ్‌ వేస్ట్‌ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు’ అంటూ మరో ప్రశ్నకు ఆస్కారం లేకుండా ఘాటుగా సమాధానమిచ్చింది నయనతార. 
  రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ప్రేమ జంట అయినా, భార్యాభర్తలైనా  ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సమయం గడపాలని, మాట్లాడాలని కోరుకుంటారు. అయితే ఒకరికొకరు దూరంగా అంటే  వేర్వేరు ప్రదేశాలలో ఉన్న జంటలు ఒకరితో ఒకరు సమయం గడపడం కొంత కష్టమే. వారి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కమ్యూనికేట్ చేయడానికి భార్యాభర్తలు ఒకరికొకరు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్‌లు చేయవచ్చు లేదా మెసేజ్ లు కూడా  పంపవచ్చు. బిజీ లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోలేక పోయినట్లయితే, రోజంతా కొన్ని మెసేజ్‌ల ద్వారా భాగస్వామికి తాను దూరంగా లేడనే భావన కలిగించవచ్చు. అయితే, కొన్నిసార్లు ఈ మెసేజ్లు  భార్యాభర్తల మధ్య వివాదాలకు కూడా కారణం అవుతాయి.  భార్యాభర్తలు పొరపాటున కూడా కొన్ని మెసేజ్ లను తమ భాగస్వామికి  పంపకూడదు. అవేంటంటే.. రెస్పాండ్ కావడం.. భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు వారి మధ్య మెసేజ్ లలో జరిగే కమ్యూనికేషన్ ఎంత సరదాగా ఉంటుందో.. ఏదైనా తేడా జరిగితే చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది.  ముఖ్యంగా భార్యలు ఏవైనా మెసేజ్ పెట్టినప్పుడు భర్తలు లేదా అబ్బాయిలు ఎక్కువగా రెస్పాండ్ కారు.కేవలం ఒక ముక్క లేదా ఒక మాటతో లేదా ఎమోజీలతో, స్చిక్కర్లతో  రిప్లే ఇస్తుంటారు.  ఇది కమ్యూనికేషన్ పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు మెసేజ్ చేసుకొనేటప్పుడు స్పష్టంగా ఉండాలి. కోపం.. కోపం బంధాలను విచ్చిన్నం చేస్తుంది.  భార్యాభర్తలు మెసేజ్ చేసుకొనేటప్పుడు కోపం ప్రదర్శించడం కాదు.  భార్యలు ఎప్పుడూ భర్తల గురించే ఆలోచిస్తారు.  భార్యలు మెసేజ్ చేసినప్పుడు వారికి ఇచ్చే రిప్లే కోపంతో కూడుకుని ఉండకూడదు.  ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కొంచెం సేపటి తరువాత టచ్ లోకి వస్తాను అని చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉండిపోవాలి. ఆ తరువాత సహజంగా మాట్లాడాలి. పదే పదే.. భర్త లేదా భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.  భార్య భర్తకు అయినా,  భర్త భార్యకు అయినా పదే పదే నాన్ స్టాప్ గా మెసేజ్ లు చేయకూడదు.  ఒకసారి మెసేజ్ చేశాక అవతలి నుండి రెస్పాన్స్ లేకపోతే ఏదైనా పనిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.   ముఖ్యంగా మహిళలు     ఈ విషయంలో కంగారు పడుతూ ఉంటారు.  భర్త తొందరగా స్పందించకపోతే ఏం జరిగిందో అని గాబరా పడతారు. కానీ  అవతల వారిని అర్థం చేసుకోవాలి. భర్తలు కూడా భార్య మెసేజ్ లు చూసిన తరువాత కాల్ చేసి మాట్లాడటం మంచిది. గొడవలు వద్దు.. మెసేజ్ లో ఏ విషయాలు అయినా సాధారణ పలకరింపులు,  బాగోగులు అడిగి తెలుసుకోవడం, ఏవైనా కబుర్లు చెప్పుకోవడం మంచిది.  దేని గురించి అయినా ప్రశ్నించడం, సీరియస్ విషయాల గురించి అడగటం చేయకూడదు.  ఇలాంటివన్నీ నేరుగా మాట్లాడుకోవడం మంచిది.  లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు పెరుగుతాయి.                                                              *రూపశ్రీ.
  ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...! పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.  ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి. ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి. ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది. ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.                                      ◆నిశ్శబ్ద.
  తల్లిదండ్రుల తో బంధం చిన్నతనం నుంచి ఉంటుంది.  అందుకే వారితో ఏదైనా గొడవ జరిగితే అది కొన్ని గంటలు లేదా రోజులలో క్లియర్ అవుతుందిి. కానీ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు చాలా వరకు తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంటాయి.  అసలు భార్యభర్తల మధ్య గొడవలకు కారణాలు ఏంటో తెలుసుకుంటే బంధాన్ని నిలబెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సాధారణంగా వివాహిత జీవితంలో వస్తుంటాయి. ఇవి చిన్నపాటి అభిప్రాయ భేదాల నుంచి తీవ్రమైన సమస్యల వరకు ఉండవచ్చు. గొడవలకు ప్రధానమైన  కారణాలు ఇవే:  ఆర్థిక సమస్యలు డబ్బు ఖర్చులు, ఆదాయం, పొదుపు పై అగ్రిమెంట్ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీస్తుంది.  భర్త తనదే ఆధిపత్యం అని, భార్య తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటాడని ఇలా.. ఇద్దరూ ఆర్థిక విషయాలలో అబిప్రాయ బేధాలతో గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకరి ఖర్చు పద్ధతులు ఇంకొకరికి నచ్చకపోవడం కూడా ఆర్థిక గొడవలకు కారణం అవుతుంది. ఆత్మీయత లోపం లేదా శారీరక సంబంధాల్లో తేడా.. శారీరక సంబంధాలపై అబద్ధపు అంచనాలు,  ప్రేమ లేదా స్పర్శలో లోపం భార్యాభర్తల మద్య పెద్ద గొడవలకు కారణాలు అవుతాయి. సాధారణంగా వివాహం అనేది ప్రేమ, నమ్మకం,  శారీరకంగా ఒకరిని ఒకరు కోరుకోవడంలోనే ఆధారపడి ఉంటుంది. కానీ వివాహం తరువాత ఇవి లోపిస్తే ఇద్దరి మధ్య అసంతృప్తి ఏర్పడి అది కాస్తా గొడవలుగా మారుతుంది. అభిప్రాయ భేదాలు.. కుటుంబపరమైన నిర్ణయాలు, పిల్లల పెంపకం, జీవిత పద్ధతులపై విభిన్న అభిప్రాయాలు ఉంటాయి.  భార్యాభర్తలు ఇద్దరూ కలసి చర్చించి ఈ విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భర్త తను, తన తల్లిందండ్రులు చెప్పినట్టే జరగాలని, భార్య తన మాట నెగ్గాలని పంతానికి పోతే ఇద్దరి మధ్య అబిప్రాయ బేధాలు ఏర్పడి గొడవలు అవుతాయి. ఆత్మగౌరవ సమస్యలు / ఈగో సమస్యలు.. ఒకరి మాటకి మరొకరు విలువ ఇవ్వకపోవడం. చిన్న విషయాల్లోనూ తానెక్కడా తగ్గకూడదన్న భావన భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తుంది.  భార్యాభర్తలు తామరిద్దరూ సమానమే అనే విషయాన్ని తెలుసుకుని ఒకరిని ఒకరు గౌరవించుకుంటే.. ఒకరి మాటకు మరొకరు ప్రాధాన్యత ఇవ్వగలరు. అభిమానాలు / అనుమానాలు.. ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడం, చిర్రెత్తించే ప్రవర్తనలపై అనుమానాలు పెరగడం వల్ల బంధం విచ్చిన్నమవుతుంది. బంధంలో నమ్మకమే కీలక పాత్ర పోషిస్తుంది. అనుసంధానం లోపం (Communication Gap).. సరిగ్గా మాట్లాడుకోకపోవడం, భావాలను పంచుకోకపోవడం వల్ల గొడవలు వస్తాయి. పెళ్లంటే కేవలం ఆర్థికంగా,  ఇంటి పనులలో ఒకరి అవసరం మరొకరికి ఉండటం కాదు.  ఇద్దరి మధ్య మానసిక అనుబంధం కూడా ఉండాలి.  స్నేహితుల్లా మాట్లాడుకోవాలి. బంధువుల జోక్యం.. భార్యాభర్తల తల్లిదండ్రుల  జోక్యం,  తోబుట్టువులు,  స్నేహితులు, బంధువుల జోక్యం వల్ల, వారిచ్చే సలహాల కారణంగా  ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం జరిగి గొడవలు వస్తాయి. వ్యక్తిత్వ తేడాలు.. ఒకరు చురుకుగా ఉండగా, ఇంకొకరు అంతగా కాకపోవడం,  జీవితంలో గమ్యం లేదా అభిరుచుల్లో తేడా ఉండటం. వీటి వల్ల  ఇద్దరి మధ్య జీవితానికి సంబంధించిన లక్ష్యాలు,  భవిష్యత్ ప్రణాళికలు వంటివి చేరుకోలేక పోతారు. సమస్యలు తగ్గించడానికి మార్గాలు: ఓపికగా వినాలి, సానుభూతితో స్పందించడం చాలా ముఖ్యం. స్పష్టమైన సంభాషణ  ఉండాలి. దీని వల్ల ఇద్దరి మధ్య అపార్థాలు రావు. పరస్పర గౌరవం ఉండాలి.  గౌరవం లేని బంధం ఎక్కువ కాలం నిలబడదు. చిన్న విషయాల్లో క్షమించటం నేర్చుకోవాలి.  అన్ని విషయాలకు పంతానికి పోతూ ఉంటే తనను గౌరవించట్లేదని భాగస్వామి అర్థం చేసుకునే అవకాశం ఉంది. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. ఇది భార్యాభర్తలు చేస్తున్న తప్పులు తెలియజేసి ఒకరితో ఒకరు ఎలా ఉండాలో తెలుసుకునేలా చేస్తుంది.                                                          *రూపశ్రీ.
  మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి, అందుకే ఏదైనా ఒక భాగంలో సమస్య తలెత్తితే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా గుండె-ఊపిరితిత్తుల వంటి అవయవాలలో ఏర్పడే సమస్యల గురించి మనమందరం  అప్రమత్తంగా ఉంటాము. ఆ సమస్యల గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కళ్ళు,  చెవులు వంటి అవయవాల ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపం. ఆరోగ్య నిపుణులు  కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ ఈ అవయవాలలో సమస్యలు  తీవ్రమైన దుష్ప్రభావాల ప్రమాదాన్ని కూడా కలిగిస్తాయి. చాలామంది చెవులలో ఒకరకమైన శబ్ధం రావడం గమనిస్తుంటారు. ఇదొక టోన్ లాను, సముద్రపు హోరు లానూ, బీప్ వంటి శబ్ధం లాను ఉంటుంది. చాలామంది ఇదేమి చేస్తుందిలే.. తగ్గిపోతుంది. మనకు బాగా వినిపిస్తోంది కదా అనే నిర్లక్ష్యంతో పట్టించుకోరు. కానీ ఈ చెవి సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది  దీర్ఘకాలిక ప్రమాదాలను కలిగి ఉండే ప్రమాదముంది. ఇలా శబ్ధం వినిపించడాన్ని టిన్నిటస్ అని అంటారు.  టిన్నిటస్ సమస్య..  టిన్నిటస్ సమస్యలో  చెవులలో ఒకటి లేదా రెండింటిలో రింగింగ్ లేదా ఇతర శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇవి బయట నుండి వినిపించేవి కాదు. ఈ శబ్దాలు కేవలం ఈ సమస్య ఉన్నవ్యక్తులకే వినిపిస్తుంది . ఇతరులు దీన్ని వినలేదు. టిన్నిటస్ అనేది చాలా సాధారణ సమస్య  15% నుండి 20% మంది వ్యక్తులను ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో ఇది వస్తుంటుంది. సాధారణంగా టిన్నిటస్ అనేది అంతర్లీన సమస్య వల్ల వస్తుందని, దానిని గమనించి చికిత్స చేయవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు.. ఆరోగ్య నిపుణులు, టిన్నిటస్ ను సాధారణంగా వయస్సు-సంబంధిత వినికిడి లోపం, చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్  వంటి అంతర్లీన సమస్య వల్ల సంభవించవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితులను సకాలంలో గుర్తించకపోతే లేదా చికిత్స చేయకపోతే, దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.  టిన్నిటస్ సమస్యకు  జలుబు వంటి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు, దీని గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమస్యకు  సమయానికి చికిత్స చేయకపోతే, ఇది చెవికి సంబంధించి అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది, చెవుడు కూడా వ్వచే అవకాశం ఉంటుంది.  వినికిడి సమస్య శాశ్వతంగా తగ్గిపోవచ్చు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు, మన చెవి లోపలి భాగంలో చిన్న, సున్నితమైన కణాలు ఉంటాయి, అవి ధ్వని తరంగాలను స్వీకరించినప్పుడు కంపిస్తాయి. లోపలి చెవిలో ఏదైనా సమస్య ఉంటే, అది టిన్నిటస్‌కు కూడా కారణమవుతుంది.  సమయానికి చికిత్స చేయకపోతే, చెవుల శక్తి  తగ్గిపోతుంది. ఇది కాకుండా, చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిలో ఏవైనా అడ్డుపడటం వల్ల కూడా  ఈ సమస్య రావచ్చు. చెవి ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే, మెదడు మాత్రమే కాకుండా ఇతర భాగాలపై కూడా దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది.                              *నిశ్శబ్ద.
  కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’. ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌! మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయని తెలిసిందే! అయితే ఈ పిండి పదార్థాలను ఎడాపెడా తీసుకోవడం వల్ల వాటిలోని అధిక చక్కెర మన శరీరాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, స్వీట్లు, తియ్యటి తేనీరు, చాక్లెట్లు, ఐస్ క్రీములు... ఇలా చెప్పుకుంటో పోవాలే కానీ చక్కెర అధికంగా ఉండే పదార్థాల జాబితా చాంతాడుని మించిపోతుంది. కొంతమంది ఈ పదార్థాలను వదిలి లేకపోవడమే కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్. ఏం జరుగుతుంది కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌ ఉన్నవారు చక్కెర అధికరంగా ఉండే పదార్థాలను తినేందుకు ఉబలాడపడిపోతుంటారు. ఒకటి రెండు రోజుల పాటు ఇలాంటి పదార్థాల దొరక్కపోతే వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలైతే ఆ పదార్థాన్ని తీసుకునేదాకా పేచీ పెడుతూనే ఉంటారు. వీరి శరీరం చక్కెరకు అలవాటు పడటం వల్ల, చక్కెర తీసుకున్న వెంటనే వారి ఒంట్లో ‘డోపమైన్‌’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ డోపమైన్‌ మనసు సంతోషంగా ఉన్న ఒక భావనని కలిగిస్తుంది. మద్యం వంటి వ్యసనాలలో కూడా ఈ డోపమైన్‌దే ముఖ్య పాత్ర. తరచూ ఏదో ఒక చక్కెర పదార్థాన్ని తినాలని నాలుక లాగుతూ ఉంటడం, ఎదురుగుండా ఎంత తీపి పదార్థం ఉంటే... అంతా తినేయడం, ఊబకాయం వస్తున్నా కూడా ఆహారాన్ని నియంత్రించుకోకపోవడం... ఇవన్నీ కూడా కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ లక్షణాలే! ప్రమాదం కార్బొహైడ్రేట్ ఎడిక్షన్‌ అనేది ఆషామాషీగా తీసుకోవల్సిన లక్షణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చిన్నవయసులో ఊబకాయం బారిన పడేవారిలో 75 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తోందట. కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉన్న వారిలో ఇన్సులిన్‌ చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది కొన్నాళ్లకి అస్తవ్యస్తంగా మారిపోయి, చక్కెర వ్యాధికి దారితీస్తుంది. ఇక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యల గురించి చెప్పనే అక్కర్లేదు. పైగా చక్కెర అధికంగా ఉండే చాలా పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు తదితర పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా కనిపిస్తుందే కానీ, కూర్చుంటే లేవలేనంత నిస్సత్తువ ఉంటుంది. మరేం చేయడం! - ముందుగా తీపి పదార్థాలలోనే కాస్త ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి. ఉదాహరణకు పండ్ల రసాలకు బదులుగా పండ్లు, ఐస్‌క్రీంకు బదులుగా పెరుగు... ఇలాగన్నమాట. - ఇంట్లో అదేపనిగా చిరుతిళ్లను నిలువ చేసుకోవడం అపేయండి. మీ ఇంట్లో చిరుతిండి డబ్బాలను ఖాళీ చేయండి. - ఆకలి వేయకపోయినా కూడా ఏదో ఒకటి తినాలని నోరు పీకేస్తుంటే బాదం పప్పులు, టమోటాలు, ఆమ్లెట్లు, మొలకలు... ఇలా తక్కువ పిండి పదార్థాలు ఉండే చిరుతిళ్లని తీసుకోండి. - నీరు తాగడం వల్ల ఆకలి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. కడుపు నిండిన భావనా కలుగుతుంది. ఒంట్లోని చెడంతా బయటకి పోవడమూ ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ నుంచి బయటపడే వరకూ కాస్త మంచినీరుని ఆరారగా తీసుకుంటూ ఉండండి. - వ్యాయామం వంటి శారీరిక శ్రమను అలవాటు చేసుకోండి. దీని వల్ల కొవ్వు కరగడమే కాదు, శరీరంలో ‘నిజమైన’ ఆకలి మొదలవుతుంది. అది తీపి పదార్థాల మీద కాకుండా పోషక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటుంది. - మీ పిల్లల్లో కనుక కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉందని గమనిస్తే, వారిని కూర్చోపెట్టి అందులోని లాభనష్టాల గురించి వివరించండి. - నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇందుకోసం ఏవేవో చెయ్యక్కర్లేదు. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటుంటే ఆరోగ్యం ఆఫహే చేకూరుతుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తినమని పెద్దలు చెబుతారు. అన్ని రకాల కూరగాయలు తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. కానీ చాలామంది కొన్నింటికి స్టిక్ అయిపోయి ఉంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా కొందరు కొన్ని కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి వాటిలో కాకరకాయ కూడా ఒకటి. పిల్లలకు ఏమాత్రం ఇష్టం లేని ఈ కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా విపరీతంగా తింటే చెప్పలేనన్ని సమస్యలు వస్తాయి.  కాకరకాయ తినడం వల్ల బరువు తగ్గవచ్చు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె వేగాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కాకరకాయ ఉపయోగపడుతుంది. అయితే కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల బోలెడు నష్టాలు ఫేస్ చేయాల్సిందే.. ఏదైనా మితిమీరితే హానికరం అనే మాట తెల్సిందే కదా.. కాకరకాయను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై పడే చెడు ప్రభావాల గురించి నష్టాల గురించి తెలుసుకుంటే..  కాకరకాయ  తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే సాధారణ వ్యక్తుల్లో షుగర్ లెవల్స్ సాధాణంగానే ఉంటాయి. ఇలాంటి వారు కాకరకాయను ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ మీద ప్రభావం పడుతుంది. అలాగే అధిక షుగర్ లెవెల్స్ ఉన్నవారు షుగర్ కంట్రోల్ ఉండటానికి మెడిసిన్ వాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు కాకరకాయ ఎక్కువ తిన్నా షుగర్ లెవల్స్ డౌన్ అవుతాయి. అలాగే, హిమోలిటిక్ అనీమియా ప్రమాదం కూడా కాకరకాయ ఎక్కువ తినడం వల్ల పెరుగుతుంది. గర్భధారణ సమయంలో కాకరకాయను తినకూడదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు కాకరకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  కాకరకాయను ఎక్కువగా తీసుకునేవారికి కాలేయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  కాకరకాయలో లెక్టిన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కాలేయంలో ప్రొటీన్ల కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. అందుకే పొట్లకాయను రెగ్యులర్ గా, ఎక్కువగా తినకూడదు. కాకరకాయ ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, వాంతుల సమస్య పెరుగుతుంది. కాకరకాయలో బోలెడు ప్రయోజనాలున్నాయని దాన్ని ఇంట్లో వారికి, పిల్లలకు ఎక్కువగా వండిపెట్టే వారు దీనిగురించి తెలుసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదే అయినా హాని కూడా కలిగించడంలో కాకరకాయ కూడా ఒకటనే విషయం మరచిపోకూడదు.                                        ◆నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...