LATEST NEWS
ప్రధాని నరేంద్ర మోదీ తన 76వ పుట్టినరోజు  సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల అధినేతల నుంచీ  రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల అగ్రనేతలు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే..  మోదీకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. వీరితో పాటు కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ  చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత  స్టాలిన్‌  తదితరులు కూడా మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  అలాగే    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ సేవలందిస్తున్న తీరు  చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.  గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని పదవి వరకు సాగిన సుమారు రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణం దేశ ప్రగతికి దోహదం చేసిందన్నారు. సేవ, సంకల్ప్, సుశాసన్  అనే నినాదంతో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు కోట్లాది మంది పౌరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.  సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని మంత్రి నారాలోకేష్ పేర్కొన్నారు.  క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల్లో పనిచేసే యువ నాయకులకు ప్రధాని మోడీ ఆదర్శమని లోకేష్ ప్రస్తుతించారు.  [Narendra Modi Birthday, Rahul Gandhi, Mallikarjun Kharge, Nara Chandrababu, Lokesh, Modi 76th birthday Wishes, Telugu One]
కోవూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కోవూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే కార్యకర్తలకు మరింత న్యాయం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని లోకేష్ అన్నారు. వైసీపీ నాయకులు కుల, మతాల పేరుతో విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. గతంలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని లోకేష్ సూచించారు. పెన్షన్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో పాటు రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులకు అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించాలని అన్నారు. 16 వేల టీచర్ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేశామని తెలిపారు. రాష్ట్రానికి గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థల పెట్టుబడులు రావడాన్ని ప్రస్తావించిన లోకేష్.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రభుత్వం చేసిన పనులతో పాటు వైసీపీ ప్రచారాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. డీఎస్సీపై జగన్‌కు లోకేష్ సవాల్.. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు తనను ప్రశ్నిస్తున్నారని లోకేష్ విమర్శించారు. డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. టీచర్ పోస్టుల భర్తీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టులను ఆశ్రయించినా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అన్నారు. డీఎస్సీపై తనతో బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కుటుంబం వేరు.. రాజకీయం వేరు.. కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని లోకేష్ అన్నారు. రాజకీయాలను, కుటుంబ సంబంధాలను వేర్వేరుగా చూడాలని సూచించారు. తన కుటుంబ సభ్యులపై గతంలో జరిగిన వ్యక్తిత్వ హనన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రత్యర్థి నాయకుల కుటుంబ సభ్యుల గురించి తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని తెలిపారు. కార్యకర్తే అధినేత.. ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తున్నామని లోకేష్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధి ద్వారా ఇప్పటివరకు రూ.175 కోట్లు అందించామని తెలిపారు. కార్యకర్తలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలోపేతం కావాలన్నదే లక్ష్యమన్నారు. మైటీడీపీ, మైహెల్త్ యాప్‌లను వినియోగించాలని సూచించారు.నా తెలుగుదేశం–నా బాధ్యత’ నినాదానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ అంతర్గత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యకర్తలు నాయకుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కొనసాగింపు అవసరం.. ప్రభుత్వాలు తరచూ మారడం వల్ల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. కోవూరు టీడీపీకి బలమైన నియోజకవర్గమని పేర్కొన్న లోకేష్.. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు మాట్లాడుతూ కోవూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతం కోసం లోకేష్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. సమావేశంలో బీద మస్తాన్‌రావు, మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, బీద రవిచంద్ర, మద్దిపాటి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.       [ Nara Lokesh, TDP, Telugu Desam Party, Kovur, Nellore, Local Body Elections, NDA Alliance, Andhra Pradesh Politics, YSRCP, YS Jagan Mohan Reddy, Mega DSC, DSC Recruitment, Teacher Jobs, TDP Cadre, Political Controversy, AP Politics, Chandrababu Naidu, Coalition Government, TDP Workers, Welfare Schemes, Development, Veemireddy Prashanthi Reddy, Veemireddy Prabhakar Reddy, NTR Statue, Kovur TDP, Local Elections AP ]
జగన్ హయాంలో లవ్ జిహాద్ లు, మతమార్పిడులు జరిగాయని గతంలో ఆరోపించిన విజయసాయిరెడ్డి తాజాగా జగన్ హయాంలో ఆయన మెప్పు పొందడం కోసం పెద్ద ఎత్తున బలవంతపు మతమార్పిళ్లకు వైసీపీయులు పాల్పడ్డారని మరో బాంబు పేల్చారు. వైసీపీలో గతంలో నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన విజయసాయి, ఆ పార్టీ తరఫున రెండు సార్లు రాజ్యసభకు వెళ్లారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ మాజీ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. మత మార్పిడి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రకటనలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారానికి దారితీశాయి.   తాజాగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్టులో  జగన్ విధానాలపై  విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జగన్ హయాంలో రాష్ట్రంలో మత మార్పిడిలను ప్రోత్సహించారన్న కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వేదికలపైనా కూడా హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలం పాటు వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, మరీ ముఖ్యంగా జగన్ సన్నిహితుడిగా, వైసీపీలో    కీలక పదవులు నిర్వహించిన వ్యక్తిగా విజయసాయి నుంచి వచ్చిన వ్యాఖ్యలు వైసీపీని డిఫెన్స్ లో పడేశాయి.   వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు రాజకీయ సలహాదారుగా, కుడి భుజంగా మెలిగిన విజయసాయి జగన్ అధికారంలో ఉండగా మతమార్పిళ్లు జరిగాయని చేసిన వ్యాఖ్యలను చాలా మంది నమ్ముతున్నారు. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడి విజయసాయి వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమేనంటూ ఎదురుదాడికి దిగింది.  ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ ఆరోపణలను   ఖండించారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవన్న సజ్జల. వైయస్ జగన్ మోహన్ రెడ్డి   అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని, ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా, లేదా ఒక మతాన్ని బలవంతంగా ప్రోత్సహించే విధంగా  ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారంలో లేని  సమయంలోనూ కూడా జగన్ అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను కాపాడే చర్యలు తీసుకున్నారన్నారు.   విజయసాయి రెడ్డి వైసీపీని   వీడి చాలా కాలం గడిచిపోయిందని, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లారన్న ఆయన..   విజయసాయి పార్టీని వీడినప్పుడు ఆయనపై జగన్ ఎటువంటి విమర్శలూ చేయలేదని గుర్తు చేశారు. విజయసాయి మాటలు పట్టించుకోనవసరం లేదు కానీ, ఇప్పుడు మత మార్పిడులపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై మౌనంగా ఉంటే..   ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నానన్నారు.  దశాబ్దాలుగా జగన్ కుటుంబంతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  మొత్తంగా స్థానిక ఎన్నికల ముంగిట విజయసాయి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద మైనస్ అవుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వినా ఆయన కుటుంబం నుంచి ఎవరూ కూడా ఇంత వరకూ తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరు కాకపోవడం, జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం వంటి విషయాలను గుర్తు చేస్తున్నారు. మొత్తంగా జగన్ హయాంలో బలవంతపు మతమార్పిళ్లు అన్న విజయసాయి వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద శరాఘాతంగా మారతాయనడంలో సందేహం లేదని అంటున్నారు.  [Vijayasai Reddy, YS Jagan Mohan Reddy, YSRCP, Sajjala Ramakrishna Reddy, Andhra Pradesh Politics,Telugu One]
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. పలు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లను నియమించే ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఐదారు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించే అంశంపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పుల్లో భాగంగానే తెలంగాణకు కూడా కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు వెళ్లనున్నారు. సుమారు పది నెలల పాటు ఆమె లండన్‌లో ఉండనున్న నేపథ్యంలో తెలంగాణ వంటి క్రియాశీలక రాష్ట్ర బాధ్యతలను మరో సీనియర్ నేతకు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ ఎ. చెల్లకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు పార్టీ వ్యవహారాలపై ఉన్న అనుభవం, వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన నేపథ్యం తెలంగాణ బాధ్యతలకు ఉపయోగపడుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.డాక్టర్ ఎ. చెల్లకుమార్ తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కాంగ్రెస్ నేత. 1991లో అన్నా నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1996లో టి.నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్ వర్గం) తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2011లో టి.నగర్ నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురైంది. అనంతరం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన చెల్లకుమార్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. పార్టీలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన చెల్లకుమార్.. గోవా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయనకు ఉన్న అనుభవం ఇప్పుడు తెలంగాణకు ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను సమర్థవంతంగా పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేడర్‌తో సన్నిహితంగా పనిచేసే స్వభావం, పార్టీ వ్యవహారాలపై అనుభవం ఉన్న సీనియర్ నేతను తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే డాక్టర్ ఎ. చెల్లకుమార్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటివరకు చెల్లకుమార్ పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే కొనసాగనుంది.       [ New in-charge for Telangana Congress, Dr. A. Chellakumar, Telangana Congress Party,  CM Revanth reddy, Meenakshi Natarajan, Telangana Congress Incharge, AICC, Congress Party, Telangana Politics, PCC Chief Mahesh Kumar Goud ]  
తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.   అయితే,   సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా  కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే     అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి   కేబినెట్ హోదా  ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.   కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ..  కొండా సురేఖ   పార్టీ నాయకత్వంపై  దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం.  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా..  తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    [Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post,  RTC Chairman, Revanth Reddy, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ వ్యాపారవేత్త కొణిదెల ఉపాసన కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో సందడి చేశారు. గురువారం ఉదయం మంత్రాలయానికి విచ్చేసిన ఆమె, శ్రీ రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా మంత్రాలయానికి చేరుకున్న ఉపాసనకు ఆలయ అధికారులు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు సంప్రదాయబద్ధంగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్న ఉపాసన, అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూలబృందావనం సన్నిధికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ నిర్వహించిన పూజ, అభిషేక కార్యక్రమాలలో పాల్గొని తన మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారు ఉపాసనకు ఆశీస్సులు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు మరియు శేషవస్త్రాలను అందజేశారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకుని పీఠాధిపతుల ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉందని ఈ సందర్భంగా ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. గతంలోనూ రామ్ చరణ్-ఉపాసన దంపతులు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇక మెగా కోడలు మంత్రాలయానికి వచ్చారనే వార్త తెలియడంతో స్థానిక మెగా అభిమానులు, భక్తులు ఉపాసనను చూడటానికి పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మంత్రాలయ క్షేత్రంలో కాసేపు సందడి వాతావరణం నెలకొంది.     [Upasana Konidela, Mantralayam, Sri Raghavendra Swamy Temple, Ram Charan, Tollywood News]
  చిన్న సినిమా.. పెద్ద సినిమా ఎలాగూ, ప్రతి శుక్రవారం రాదు కాబట్టి చిన్న సినిమా కోసం శుక్రవారం పూట ఎదురుచూడని ప్రేక్షకుడు అంటూ ఉండదు. ఇక సినిమా నచ్చిందా! తనకి కనపడిన వాళ్ళందరిని ఫ్రెండ్స్ , బంధువులుగా మార్చుకొని సినిమాలో అది బాగుంది, ఇది బాగుంది అంటూ ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పని విషయాలని కూడా చెప్తాడు. దీంతో సినిమా కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. సినిమా పుట్టిన దగ్గర్నుంచి చిన్న సినిమా విజయానికి సూత్రం ఈ విధమైన ప్రేక్షక మిషనే. కానీ ఇప్పుడు ఆ పక్ష పాత  ప్రేక్షకుడుకి చిన్న సినిమా షాక్ ఇచ్చింది.      ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 18 లేదా శుక్రవారం రేసులో నిలవాల్సిన '418', 'హనుమాన్ అంశ్', మరియు 'అనుమాన పక్షి' వంటి చిత్రాలు అనుకోని కారణాల వల్ల బాక్సాఫీస్ రేసు నుంచి తాత్కాలికంగా తప్పుకున్నాయి.హిందీ బాక్సాఫీస్ వద్ద కేవలం లో-బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ మార్కుకు సమీపిస్తూ, 'ధురంధర్' వంటి భారీ సినిమాల రికార్డులని  సైతం తుడిచిపెట్టేసిన హనుమాన్ అంశ్'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటికీ, చివరి నిమిషంలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నుండి వైదొలగడం, ప్రమోషనల్ ఈవెంట్లు రద్దు కావడం మరియు సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు వెర్షన్ విడుదల ఆగిపోయింది. అసలు 100 శాతానికి పైగా లాభాలతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ డివైన్ హిట్ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  మరోవైపు, కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన '418' మరియు 'అనుమాన పక్షి' చిత్రాల నిర్మాతలు కూడా చివరి నిమిషంలో తమ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. థియేటర్ల సర్దుబాటు లోపాలు, సాంకేతిక మరియు ప్రమోషనల్ కారణాలు, అలాగే సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలో ఎదురైన జాప్యం వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని విశ్లేషకులు చెబుతున్నారు.    ఒక్కసారిగా ఈ మూడు ప్రతిష్టాత్మక చిన్న సినిమాలు పోస్ట్‌పోన్ కావడంతో ఈ వారం థియేటర్స్ రేసులో ఇతర చిత్రాలకు లేదా హోల్డోవర్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ స్క్రీన్లు లభించే అవకాశం ఉంది.ఈ హఠాత్ పరిణామం వల్ల చిన్న చిత్రాల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.  ప్రేక్షకులు అంతకంటే.  మేకర్స్ త్వరలోనే సరికొత్త ప్రచార చిత్రాలతో పాటు, కొత్త విడుదల తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ సరిగ్గా ప్లాన్ చేసుకుని, సరైన ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రావడం ద్వారా ఈ చిత్రాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటాయో వేచి చూడాలి! ఈ శుక్రవారం వస్తున్న సినిమాలు ఈ పాట కోరిన వారు , హ్యాపీ జర్నీ. మరి ప్రేక్షకుడు రెడీగా కాచుకొని కూర్చుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.     [Hanuman Ansh,  418, Anumana Pakshi, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
The much-discussed release-date confusion around Chiranjeevi’s Kaaka and Vishwambhara for Sankranthi 2027 now seems to have been sorted out. Kaaka has officially confirmed January 13, 2027 as its theatrical release date, making it Chiranjeevi’s Sankranthi release for next year. The makers announced the date today, putting an end to the recent speculation over whether the film would move out of the festival season. KVN Productions have released the photo of Chiranjeevi speaking with K Venkata Narayana and Vikram Reddy of UV Creations. Finally, it looks like the last minute confusion has been cleared by the Megastar himself with great discussion.  This also indicates that Vishwambhara could be looking at a different release window. The socio-fantasy film has been delayed for two years, mainly due to its extensive VFX work and other production-related factors. There have been reports that the team is considering Summer 2027, as Sankranti gone out of hands. Directed by Bobby Kolli, Kaaka is being produced by KVN Productions and stars Chiranjeevi in the lead along with Anaswara Rajan, Nivetha Pethuraj, Sunil and Getup Srinu. The film is currently progressing with its shooting schedules as the team works towards the January release. With Kaaka now firmly occupying the January 13 slot, attention shifts to Vishwambhara and when the Vassishta directorial will finally make its way to theatres.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర', 'కాకా' సినిమాల రిలీజ్ డేట్ల గురించి ఓ రేంజ్‌లో రచ్చ జరుగుతోంది. 'విశ్వంభర' 2027 సంక్రాంతికి రానుందని, అందుకే 'కాకా' మూవీ 2027 సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా 'కాకా' మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ప్రాజెక్ట్ 'కాకా'. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన చిరంజీవి మరో మూవీ 'విశ్వంభర' VFX వర్క్స్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. రెండూ చిరంజీవి సినిమాలే కావడంతో, తప్పనిసరి పరిస్థితిల్లో సమ్మర్ కి షిఫ్ట్ అవ్వడానికి 'కాకా' టీమ్ అంగీకరించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.  సంక్రాంతి రేసు నుంచి 'కాకా' మూవీ తప్పుకుందనే వార్తలను పటాపంచలు చేస్తూ, KVN ప్రొడక్షన్స్ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. "ఎలాంటి ప్రచారాలు నమ్మకండి.. ముందుగా చెప్పినట్టుగానే 'కాకా' జనవరి 13, 2027 సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది" అని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతోందని కూడా తెలిపారు. ఈ సందర్భంగా  KVN ప్రొడక్షన్స్ విడుదల చేసిన ఫొటోలో చిరంజీవి, వెంకట్ కె. నారాయణతో పాటు యూవీ క్రియేషన్స్ కి చెందిన విక్రమ్ రెడ్డి కూడా ఉండటం విశేషం. ఇప్పుడు 'కాకా' జనవరి 13కే ఫిక్స్ కావడంతో.. చిరంజీవి రెండు సినిమాలు ఒకే సంక్రాంతికి రావడం అసాధ్యం కాబట్టి, 'విశ్వంభర' కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనే దానిపై మళ్ళీ సస్పెన్స్ నెలకొంది. 'విశ్వంభర' డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  https://x.com/KvnProductions/status/2100471338297442801       [Kaaka vs Vishwambhara, Megastar Chiranjeevi, Chiranjeevi Kaaka Movie, Vishwambhara Movie, Kaaka Release Date, Vishwambhara Release Date, Telugu Film News, Telugu News]  
'బలగం' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ'. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ భారీ చిత్రం నుంచి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ గ్రామీణ నేపథ్యంతో కూడిన విలక్షణ కథాంశంలో దేవిశ్రీ ప్రసాద్ సరసన కథానాయికగా నటించే భామ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో డిఎస్పీకి జోడీగా యువ నటి అనంతిక సునిల్‌కుమార్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. గతంలో 'ప్రసన్నవదనం' సినిమాతో పాటు పలు తమిళ చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో తన సహజ నటనతో అలరించిన అనంతిక, వేణు యెల్దండి రాసుకున్న ఈ బలమైన పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని భావించిన చిత్రబృందం ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 'ఎల్లమ్మ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బలగం' తర్వాత వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న రెండో సినిమా కావడంతో పాటు, దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారుతుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సంగీత దర్శకుడిగా ఎన్నో హిట్ ట్యూన్లు అందించిన డిఎస్పీ, వేణు యెల్దండి మార్క్ భావోద్వేగాలు ఉన్న కథలో నటుడిగా ఎలాంటి ప్రదర్శన ఇస్తారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. అనంతిక చేరికతో ఈ సినిమాపై గ్లామర్, యాక్టింగ్ పరంగా మరిన్ని అంచనాలు పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మరియు రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించనుంది.     [Devi Sri Prasad, Venu Yeldandi, Ananthika Sanilkumar, Yellamma Movie, Dil Raju]
The kitchen is prepped, the aprons are fastened, and the flavours are all set to sizzle as Chef Sashi Cheliah, winner of MasterChef Australia, joins Celebrity MasterChef Tamil as a Judge. Presented by Sony VIZHA and Sony LIV, the show sees Samantha Ruth Prabhu bring together popular celebrities for a high-energy culinary adventure that blends food, entertainment and drama. Chef Sashi Cheliah’s journey to the MasterChef kitchen has been anything but conventional. Before making his mark in the culinary world, Sashi began his career with the Singapore Police Force. His eventual journey to the MasterChef Australia kitchen and winning the coveted trophy marked a remarkable turning point in his life. Deeply influenced by the Indian and Southeast Asian flavours of his childhood, Chef Sashi has developed a distinctive culinary identity that reflects his roots and passion for food. His experience as a contestant now gives him a unique perspective as he steps into the role of a Judge on Celebrity MasterChef Tamil. *Speaking about joining the show, Chef Sashi Cheliah said,* My journey to the MasterChef kitchen was anything but conventional. I began my career in the Singapore Police Force, so the thought of one day stepping into the MasterChef Australia kitchen and eventually winning the trophy was something I could never have imagined. The Indian and Southeast Asian flavours that shaped my childhood and my culinary identity became an integral part of that journey and reminded me of the power of food to tell stories about who we are and where we come from. Coming to Celebrity MasterChef Tamil as a Judge feels incredibly special because I know exactly what it is like to stand on the other side of the kitchen the nerves, the pressure, the uncertainty, but also the incredible excitement of creating something you are proud of. This time, I get to experience that magic from the other side. I’m looking forward to meeting our celebrity contestants, pushing them beyond their comfort zones and discovering the stories and flavours they bring to the kitchen. With Samantha Ruth Prabhu at the helm and Chef Sashi Cheliah bringing his MasterChef experience to the judging panel, Celebrity MasterChef Tamil promises an exciting mix of celebrity personalities, culinary challenges, entertainment and drama. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
సంగీత ప్రపంచంలో పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలు అందుకున్న గాన కోకిల, కర్నాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం బుధవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. 'M.S: A Legacy On Screen' పేరుతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రష్మిక మందన్నాపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి కమల్ హాసన్ క్లాప్ కొట్టి పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాసుతో పాటు పలువురు సినీ, సంగీత ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. సుబ్బులక్ష్మి గారి పాత్రలో నటించడం అనేది ఒక నటుడికి మైఖేల్ జాక్సన్ బయోపిక్‌లో నటించినంత ఒత్తిడిని, బాధ్యతను ఇస్తుందని వ్యాఖ్యానించారు. గడ్డం తీసేసినా తాను కూడా చేయలేని అంత గొప్ప పాత్ర ఇది అని, రష్మిక తన కళ్లలో ఆ కరుణను చూపిస్తే సగం విజయం సాధించినట్లే అని కొనియాడారు. ఇక ఈ చిత్రానికి 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, బివి వర్క్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నాలుగు దక్షిణాది భాషల్లో ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. గతంలో 'పుష్ప', 'యానిమల్' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రష్మిక, ఇలాంటి పౌరాణిక, చారిత్రాత్మక పాత్రను ఎంచుకోవడం పట్ల అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. క్లాసికల్ సంగీత విద్వాంసురాలిగా రష్మిక మేకోవర్ ఎలా ఉండబోతోందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రస్తుతం గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సంగీతానికి అత్యంత ప్రాధాన్యమున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి రాబోయే ఫస్ట్ లుక్, టీజర్ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Dulquer Salmaan’s Aakasamlo Oka Taara is set to arrive in theatres on November 20. The release date has been announced with a new poster featuring Dulquer in a simple, everyday look, adding to the curiosity around the film. Directed by Pavan Sadineni, the movie stars debutant Satvika Veeravalli as leading lady.  The story is said to be  Dulquer helping the leading lady achieve her astronaut dream even though they hail from a remote village in Andhra Pradesh. Shruti Haasan is playing a key character who is a scientist and helps the couple in their impossible journey.  The film has been carrying good buzz, particularly after the teaser and its first single, “Chitti Chitti Cheema” has struck a chord with listeners. GV Prakash Kumar is composing the music for the film. According to inside reports, as an actress filed cheating case on director Pavan Sadineni, the makers have decided to push the release from October to November. But there is a catch in this too. Dulquer's romantic drama with Pooja Hegde, Sri Sri, has been locked to release for 4th December. If this movie is locked for 20th November, then it would be Dulquer releasing two movies in gap of two weeks. With I'M Game failure, whether the actor be willing to take such a risk is to be seen.  Currently, the reports suggest that the makers are planning to start the remaining shoot and finish the project at the earliest with desired quality. Produced by Sandeep Gunnam and Ramya Gunnam under Lightbox Media, Aakasamlo Oka Taara is presented by Geetha Arts and Swapna Cinema.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో విశేష ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ సీనియర్ నటి ప్రేమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, విడాకులు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. జీవితంలో ఒంటరిగా ప్రయాణించడం కంటే ఒక సరైన తోడు ఉండటం చాలా ముఖ్యమని ప్రేమ అభిప్రాయపడ్డారు. తనకు తగిన వ్యక్తి, తన మనసును అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే వయసుతో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసులోనైనా రెండో పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని వెల్లడించారు. గతంలో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చును వివాహం చేసుకున్న ప్రేమ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి తాను ఒంటరిగానే జీవిస్తున్నానని, భవిష్యత్తులో పరిస్థితులు కుదిరితే వివాహం చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై కూడా ఆమె ఘాటుగా స్పందించారు. తనకు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి సోకిందంటూ గతంలో కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి నిరాధారమైన వార్తను నమ్మవద్దని అభిమానులకు సూచించారు. 'ఓంకారం', 'దేవి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ, తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఆమె తన వ్యక్తిగత విషయాలపై ఇంత స్పష్టంగా మాట్లాడడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నటి ప్రేమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు, నెటిజన్లు ఈ సీనియర్ నటి ధైర్యాన్ని మెచ్చుకుంటూ సానుకూలంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె రీ-ఎంట్రీ ఇస్తారా లేదా అనే దానిపై కూడా అభిమానుల్లో చర్చ జరుగుతోంది.       [Actress Prema, Prema second marriage, Prema divorce, Prema cancer rumors, Telugu senior heroine news]
సినీ పరిశ్రమలో ఎవరూ ఊహించని సరికొత్త కాంబినేషన్స్ సెట్ అవ్వడం సహజమే. కానీ, సోషల్ మీడియాలో ఉన్నట్టుండి చక్కర్లు కొడుతున్న ఒక క్రేజీ కాంబో వార్త మాత్రం మెగా అభిమానులకు టెన్షన్‌ను తెచ్చిపెడుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారంటూ నేషనల్ అండ్ సౌత్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు హల్‌చల్ చేయడం ప్రారంభించాయి. 'తానాజీ' లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించిన ఓం రౌత్.. ప్రభాస్ తో 'ఆదిపురుష్' తీసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అలాంటి డైరెక్టర్‌తో చరణ్ ప్రాజెక్ట్ ఓకే అయిందంటూ వార్తలు రావడంతో ఫిల్మ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఓం రౌత్ ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా కథను సిద్ధం చేసి, రామ్ చరణ్‌ను కలసి వినిపించారని, దానికి చరణ్ బాగా ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కొందరు సోషల్ మీడియాలో కథనాలు వండి వార్చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందంటూ ప్రచారం జరగడంతో.. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ "అయ్యో వద్దన్నా.. ఆదిపురుష్ రిజల్ట్ చూశాం కదా, ఈ ప్రాజెక్ట్ వద్దు" అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే రామ్ చరణ్ సన్నిహిత వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదొక బేస్‌లెస్ రూమర్ అని తేలిపోయింది. ఓం రౌత్ సౌత్ ఇండియాలోని ఒక టాప్ స్టార్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న మాట నిజమే అయినప్పటికీ, చరణ్‌ను కలిసి కథ చెప్పారనే వార్త పూర్తిగా కల్పితమని స్పష్టమైంది. ప్రస్తుతం రామ్ చరణ్ దృష్టి అంతా స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోతున్న 'RC17' పైనే ఉంది. 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పాత్ర కోసం చరణ్ సరికొత్త స్టైలిష్ లుక్‌లోకి మారుతున్నారు.  సుకుమార్ ప్రాజెక్ట్ తర్వాత మాత్రమే చరణ్ తన తదుపరి సినిమాలను లైన్‌లో పెట్టే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఓం రౌత్ - రామ్ చరణ్ కాంబినేషన్ అనేది కేవలం ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్న పుకారు మాత్రమేనని స్పష్టమవుతోంది.       [Ram Charan Om Raut Movie, Ram Charan RC17, Ram Charan Sukumar Movie, Adipurush Director, Ram Charan, Om Raut, Telugu Film News, Telugu News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన ఆరోగ్య సంరక్షణలో పీచు పదార్థం లేదా ఫైబర్ (Fiber) పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, మలబద్ధకం సమస్య దూరమవ్వాలన్నా, బరువు అదుపులో ఉండాలన్నా ప్రతీ ఒక్కరూ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోమని సలహా ఇస్తుంటారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలలో లభించే ఈ పీచు పదార్థం పేగులలోని మంచి బాక్టీరియాకు ఆహారంగా పనిచేసి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే, ఏదైనా అతిగా తింటే అమృతమైనా విషమవుతుందనే నానుడి ఫైబర్ విషయంలోనూ నూటికి నూరు శాతం వర్తిస్తుంది. ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం బాగుపడటానికి బదులుగా తీవ్రంగా పాడయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు మరియు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన మానవ శరీరానికి రోజువారీగా సుమారు 25 నుండి 30 గ్రాముల ఫైబర్ మాత్రమే అవసరమవుతుంది. కానీ చాలామంది బరువు వేగంగా తగ్గాలనే ఉద్దేశంతో లేదా జీర్ణ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందాలని ఒక్కసారిగా తమ ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని 50 నుండి 60 గ్రాములకు పైగా పెంచేస్తుంటారు. ఇలా హఠాత్తుగా లేదా అతిగా పీచు పదార్థాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. మన పేగుల్లో ఉండే బాక్టీరియా ఈ అధిక ఫైబర్‌ను వేగంగా ఫర్మెంటేషన్ (కిణ్వ ప్రక్రియ) చేయడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కడుపులో విపరీతమైన గ్యాస్ తయారవ్వడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపులో తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యం వంటి సమస్యలు వెంట వెంటనే తలెత్తుతాయి. అంతేకాకుండా, పరిమితికి మించిన ఫైబర్ తీసుకోవడం వల్ల విరోచనాలు (Diarrhea) లేదా కొందరిలో విరుద్ధంగా మరింత తీవ్రమైన మలబద్ధకం (Constipation) ఏర్పడే అవకాశం ఉంది. మనం తినే ఫైబర్ సరిగ్గా జీర్ణం కావాలంటే శరీరానికి తగినంత నీరు అత్యంత అవసరం. శరీరం లోపల నీటి శాతం తక్కువగా ఉండి, ఫైబర్ మాత్రమే ఎక్కువగా తీసుకుంటే, ఆ పీచు పదార్థం పేగుల్లోని నీటిని పీల్చేసుకుని గట్టిపడిపోతుంది. దీనివల్ల ఆహారం పేగుల్లో ముందుకు కదలకుండా అడ్డుపడి మలబద్ధకాన్ని మరింత క్లిష్టం చేస్తుంది. ఇది క్రమంగా కడుపులో తీవ్రమైన తిమ్మిర్లు మరియు పేగులలో వాపునకు దారితీస్తుంది. అధిక ఫైబర్ వల్ల మరొక ప్రధానమైన ముప్పు ఏమిటంటే పోషకాల లోపం. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం మోతాదుకు మించి ఉంటే, అది శరీరంలో కీలకమైన కాల్షియం, ఐరన్, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను పేగులు పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. ఫైబర్ ఈ ఖనిజాలతో బంధాన్ని ఏర్పరచుకుని, అవి శరీరానికి అందకుండానే మలం ద్వారా బయటకు పంపేస్తుంది. ఫలితంగా దీర్ఘకాలంలో రక్తహీనత (Anemia) మరియు ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రోజువారీ డైట్‌లో ఫైబర్‌ను ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా పెంచుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగుతూ, శరీరానికి సరిపడా సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా పొట్టను, పేగులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.     [ Fiber, High Fiber Diet, Digestive Health, Constipation, Diarrhea, Gut Health, Bloating, Hydration, Nutrient Deficiency, Healthy Diet ]
నేటి వేగవంతమైన జీవనశైలి మరియు మార్పుచెందిన ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్ అనేది ప్రతి ఇంటా సాధారణ సమస్యగా మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు ఏ విధంగా పెరుగుతాయో తెలియక చాలామంది ప్రతిరోజూ ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఉదయం పూట తినే అల్పాహారం లేదా బ్రేక్‌ఫాస్ట్ మన రోజంతా ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదయాన్నే మైదా, ప్రాసెస్ చేసిన పిండి వంటకాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా స్పైక్ అవుతాయి. ఇలాంటి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచే ఆరోగ్యకరమైన టిఫిన్ ఎంచుకోవడం అత్యంత ఆవశ్యకం. మధుమేహ బాధితులకు దివ్యౌషధంగా పనిచేసే అలాంటి ఒక అద్భుతమైన సాంప్రదాయక ఉదయపు ఆహారమే జొన్న మెంతి పరోటా (Jowar Methi Paratha). జొన్నలు మరియు మెంతులు రెండూ కూడా ఆయుర్వేదంలో మరియు ఆధునిక పోషకాహార శాస్త్రంలో అత్యుత్తమ ఆహారాలుగా గుర్తించబడ్డాయి. సాధారణంగా మనం తినే గోధుమలు లేదా బియ్యంతో పోలిస్తే జొన్నలలో గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. జొన్నల పిండిని ఆహారంగా తీసుకున్నప్పుడు అది శరీరంలో చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఒక్కసారిగా విడుదల కాకుండా క్రమంగా విడుదలవుతుంది. తద్వారా ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. అంతేకాకుండా జొన్నలలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ లేదా పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇది పదే పదే ఆకలి వేయకుండా ఆపుతుంది, తద్వారా బరువు పెరగకుండా సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. ఇక ఈ పరోటాలో ఉపయోగించే మరో ముఖ్యమైన దినుసు మెంతి ఆకులు. మెంతి ఆకులలో లభించే విశిష్టమైన గెలాక్టోమన్నన్ అనే పీచు పదార్థం మరియు అమైనో ఆమ్లాలు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని (Insulin Sensitivity) పెంచుతాయి. మెంతి ఆకులు రక్తంలోని గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. జొన్న పిండికి సన్నగా తరిగిన పచ్చి మెంతి ఆకులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, వాము మరియు తగినంత ఉప్పు కలిపి కొద్దిగా గోరువెచ్చని నీటితో సాఫ్ట్‌గా కలుపుకోవాలి. జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి రొట్టెలు చేయడం కొద్దిగా కష్టంగా అనిపించినా, కొద్దిపాటి నూనె లేదా నెయ్యి రాసి నిదానంగా ఒత్తి పెనంపై కాల్చుకోవాలి. ఈ జొన్న మెంతి పరోటాను ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం వల్ల కేవలం షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిత్యం బిపి, షుగర్ సమస్యలతో బాధపడేవారు మరియు బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఉదయపు ఆహారంలో ఒకట్రెండు జొన్న మెంతి పరోటాలను పెరుగు లేదా పుదీనా చట్నీతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రుచికరమైన, పోషకాల గని వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను మీ ఆహారంలో భాగం చేసుకోండి.     [ Jowar Methi Paratha, Diabetes, Type 2 Diabetes, Blood Sugar, Jowar, Methi Leaves, Low GI Foods, Dietary Fiber, Insulin Sensitivity, Healthy Breakfast ]  
వయస్సు పెరుగుతున్న కొద్దీ లేదా మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరంలో వచ్చే అత్యంత ప్రధానమైన మార్పు ఎముకల బలహీనత. చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు రావడం, కొద్దిపాటి దెబ్బలకే ఎముకలు విరగడం లేదా అరిగిపోవడం వంటి సమస్యలు నేడు చాలామందిని వేధిస్తున్నాయి. సాధారణంగా ఎముకల ఆరోగ్యం అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది పాలు మరియు పాల ఉత్పత్తులు మాత్రమే. కానీ మన ఇంట్లోనే లభించే కొన్ని సంప్రదాయ మరియు సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు పాలకంటే అత్యంత శక్తివంతంగా ఎముకలను దృఢపరచగలవని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా నల్ల నువ్వులు, పొన్నగంటి కూర, తోటకూర మరియు రాగులు వంటి పదార్థాలలో లభించే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం మరియు విటమిన్లు మన ఎముకల సాంద్రతను (Bone Density) ఊహించని రీతిలో పెంచి, వాటిని ఉక్కులా బలంగా మారుస్తాయి. నల్ల నువ్వులు (Black Sesame Seeds) ఎముకల ఆరోగ్యానికి ఒక గొప్ప నిధి లాంటివి. వీటిలో సాధారణ తెల్ల నువ్వుల కంటే అత్యధిక పరిమాణంలో కాల్షియం మరియు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కేవలం వంద గ్రాముల నల్ల నువ్వులను తీసుకుంటే దాదాపు 1450 మిల్లీగ్రాముల వరకు ఉపాధి కలిగించే కాల్షియం శరీరానికి అందుతుంది. ఇది మనం రోజువారీ తాగే ఒక గ్లాసు పాలలో లభించే కాల్షియం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంతేకాకుండా, వీటిలోని జింక్ మరియు రాగి (Copper) కండరాలు, ఎముకల అనుసంధాన కణజాలాన్ని బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక స్పూన్ వేయించిన నల్ల నువ్వులను లేదా నువ్వుల లడ్డును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) వంటి తీవ్రమైన ఎముకల వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆకుకూరల విషయానికి వస్తే పొన్నగంటి కూర మరియు తోటకూర ఎముకల బలానికి అద్భుతంగా తోడ్పడతాయి. పొన్నగంటి కూరలో కాల్షియంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి మరియు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల అరుగుదలను నివారించడమే కాకుండా, కీళ్ల మధ్య ఉండే సైనోవియల్ ద్రవం ఇంకిపోకుండా కాపాడుతుంది. మరొకవైపు, తోటకూర (Amaranth Leaves) అత్యధిక కాల్షియం మరియు మెగ్నీషియం కలిగిన ఆకుకూరగా పేరుగాంచింది. వంద గ్రాముల తోటకూరలో సుమారు 330 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది శరీరంలో ఎముకల నిర్మాణికి అవసరమైన ఆస్టియోబ్లాస్ట్ కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఆకుకూరలను పప్పు లేదా వేపుడు రూపంలో తీసుకోవడం వల్ల ఎముకల మాతృక (Bone Matrix) ఎంతో దృఢపడుతుంది. వీటితో పాటు మన సంప్రదాయ చిరుధాన్యమైన రాగులు (Ragi/Finger Millet) ఎముకల ఆరోగ్యానికి ఒక పవర్‌హౌస్‌గా పనిచేస్తాయి. శాకాహార ఆహారాలలో రాగులలో ఉన్నంత కాల్షియం మరే ఇతర ధాన్యంలోనూ లభించదు. ప్రతి వంద గ్రాముల రాగులలో దాదాపు 344 మిల్లీగ్రాముల సులభంగా జీర్ణమయ్యే కాల్షియం నిండి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే రాగి జావ తాగడం లేదా రాగి సంకటి, రాగి రొట్టెలు తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత క్రమంగా పెరుగుతుంది. చిన్నపిల్లల పెరుగుదలకు, గర్భిణులకు మరియు రుతుస్రావం ముగిసిన (Menopause) మహిళలకు ఎముకలు బలహీనపడకుండా ఉండటానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. ఈ నాలుగు సహజ ఆహారాలను మన రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకల నొప్పులకు స్వస్తి చెప్పి, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.     [ Bone Health, Bone Density, Calcium Rich Foods, Black Sesame Seeds, Ponnaganti Leaves, Amaranth Leaves, Ragi, Osteoporosis, Joint Health, Strong Bones ]
అమరాంత్ సీడ్స్.. తోటకూర గింజలు లేదా రాజ్‌గిరా అని వీటిని పిలుస్తారు. ఇవి ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్‌గా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయ ఆహారంలో భాగమైన ఈ గింజలు, ఆధునిక ఆరోగ్య నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మన నిత్య జీవితంలో తోటకూరను ఆకుకూరగా ఎంతగా ఉపయోగిస్తామో, దాని గింజలలో ఉన్న పోషక విలువలు కూడా అంతకంటే ఎక్కువే. సాధారణంగా కనిపించే ఈ చిన్న గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. అమరాంత్ సీడ్స్ అంటే.. అమరాంత్ సీడ్స్ అనేది 'అమరాంథస్' అనే మొక్క నుండి లభించే గింజలు. తెలుగులో వీటిని తోటకూర గింజలు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో వీటిని 'రాజ్‌గిరా' లేదా 'రామ్‌దానా' అని అంటారు. అమరాంత్ గింజలను ధాన్యాల జాబితాలో చేర్చినప్పటికీ, వృక్షశాస్త్రం ప్రకారం ఇవి నిజానికి సూడోసిరియల్స్ గా పిలుస్తున్నారు. అంటే బియ్యం, గోధుమల లాగా కాకుండా, ఇవి ఆకుకూరల జాతికి చెందిన గింజలు. అందుకే వీటిలో ఇతర సాధారణ ధాన్యాల కంటే పోషకాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండకపోవడం వల్ల ఇది గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆరోగ్యానికి అమరాంత్ సీడ్స్ చేసే మేలు.. పోషకాల గని: అమరాంత్ గింజలలో శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోస్ఫరస్ , పోటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్: సాధారణంగా వృక్ష సంబంధిత ఆహారాలలో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం చాలా అరుదు. కానీ అమరాంత్ లో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా 'లైసిన్' అనే అమైనో ఆసిడ్ ఇందులో ఉండటం వల్ల ఇది శరీరంలో ప్రొటీన్ శోషణకు ఎంతగానో తోడ్పడుతుంది. శాఖాహారులకు, కండరాల పుష్టిని కోరుకునే వారికి ఇది సరైన పోషకాహారం. జీర్ణవ్యవస్థ మెరుగుదల: అమరాంత్ గింజలలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం , కొలెస్ట్రాల్ నియంత్రణ: అమరాంత్ లో ఉండే సహజ నూనెలు , ఫైబర్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె నాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ గా ఉండేలా చేస్తాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. బరువు తగ్గడానికి: బరువు తగ్గాలనుకునే వారికి అమరాంత్ సీడ్స్ చక్కని ఎంపిక. తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్ , పీచు పదార్థం కలిగి ఉండటం  వల్ల శరీర జీవక్రియ రేటు అంటే మెటబాలిజం  పెరుగుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమై, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. డయాబెటిస్ నియంత్రణ: ఈ గింజలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణ ధాన్యాల కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమబద్ధంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ ఆహారంలో అమరాంత్ ను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి.. అమరాంత్ లో స్క్వాలేన్ , లోనాఫిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు  ఉంటాయి. ఇవి శరీరంలో  ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో తోడ్పడతాయి. శరీర కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆహారంలో అమరాంత్ సీడ్స్ ఎలా తీసుకోవాలి? అమరాంత్ సీడ్స్ ని వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని వేయించి, పాప్‌కార్న్ లాగా మార్చి పాలు లేదా తేనెతో కలిపి ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు. వరి అన్నం లాగే వీటిని ఉడికించి తీసుకోవచ్చు లేదా ఉప్మా రూపంలో వండుకోవచ్చు. అమరాంత్ గింజలను పిండిగా తయారుచేసి  గోధుమ పిండితో కలిపి రొట్టెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు. పాయసం లేదా పానీయాలలో ఉడకబెట్టిన అమరాంత్ గింజలను చేర్చి పౌష్టికాహారంగా తీసుకోవచ్చు. సలాడ్లు లేదా సూప్‌లలో వేయించిన అమరాంత్ గింజలను పైన చల్లుకోవడం ద్వారా పోషక విలువలతో పాటు రుచిని పెంచుకోవచ్చు.                      *రూపశ్రీ.  
ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. వాకింగ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్ , బ్యాక్ వాకింగ్.. అంటూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో 8 ఆకారంలో వాకింగ్ చేయడం చాలా పవర్ఫుల్ అంటున్నారు. దీన్ని అష్టాంగ నడక లేదా ఎనిమిది ఆకారపు నడక అని కూడా అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన సాంప్రదాయ వ్యాయామ పద్ధతి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. అష్టాంగ నడక.. సాధారణంగా మనం ప్రతిరోజూ నేరుగా లేదా పార్కుల్లో రౌండ్‌గా నడుస్తుంటాం. కానీ ఒకే రీతిలో నడిచే నడక కంటే,  ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శరీరానికి ఎన్నో రెట్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. సరైన పద్ధతిలో ఈ నడకను  దినచర్యలో భాగం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే శరీరంలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా చూడవచ్చు. చిన్న స్థలం చాలు.. ఈ నడకను సాధన చేయడానికి పెద్దగా స్థలం లేదా ఖరీదైన పరికరాలు అవసరం లేదు.  ఇంటి ఆవరణలో లేదా ఒక ఖాళీ గదిలో దక్షిణం నుండి ఉత్తర దిశగా ఎనిమిది ఆకారాన్ని ఊహించుకుని లేదా సుద్ద ముక్కతో గీసుకుని నడవడం ప్రారంభించాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పరగడుపున పరధ్యానం లేకుండా పాదరక్షలు లేకుండా నడవడం చాలా మంచిది. ఎలా నడవాలి?  నడిచేటప్పుడు శ్వాసపై ధ్యాస ఉంచుతూ ప్రశాంతంగా, నిలకడగా అడుగులు వేయాలి. దాదాపు పదిహేను నిమిషాలు ఒక దిశలో నడిచిన తర్వాత, తదుపరి పదిహేను నిమిషాలు వ్యతిరేక దిశలో నడవడం ఈ పద్ధతి లో ఉండే  ముఖ్య నియమం. అష్టాంగ నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె ఆరోగ్యం.. ఎనిమిది ఆకారంలో తిరుగుతూ నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ ఎంతో మెరుగుపడుతుంది. రెండు వైపులా  అడుగులు వేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండెకు తగినంత ప్రాణవాయువు అందుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ.. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారంలో నడిచేటప్పుడు మోకాళ్లు, తుంటి భాగాలు, వెన్నుముక సహజంగా వంగుతాయి. దీనివల్ల వెన్నుముక బలపడి, నడుము నొప్పి , సయాటికా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పాదాల కింద ఉండే ఆక్యుప్రెజర్ పాయింట్లు నేలను తాకడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మానసిక ఆరోగ్యం.. అష్టాంగ నడక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారాన్ని అనుసరిస్తూ నడిచేటప్పుడు మనస్సు పూర్తిగా ఆకారం పైన నడక పైన దృష్టి పెడుతుంది. దీనివల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గి, మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ నడకను సాధన చేస్తే మంచి నిద్ర పడుతుంది. డయాబెటిస్ కు మంచిది.. అష్టాంగ నడక వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు భాగంలో కదలికలు ఏర్పడి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగి, బరువు అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉండటానికి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఈ నడక ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం.. సాధారణ నడకతో పోలిస్తే అష్టాంగ నడక శరీరంలోని రెండు వైపుల కండరాలను సమంగా ఉపయోగిస్తుంది. దీనివల్ల శరీర సమతుల్యత పెరుగుతుంది. వయసు పైబడిన వారు పడిపోకుండా స్థిరంగా నడవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ  నార్మల్ బ్యాకింగ్  కు బదులుగా  ప్రతిరోజూ కనీసం అర్ధగంట సేపు ఈ అష్టాంగ నడకను సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని , కొత్త ఉత్సాహాన్ని సొంతం చేసుకోవచ్చు.                          *రూపశ్రీ.  
గర్భనిరోధక మాత్రలు మహిళల జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కుటుంబ నియంత్రణతో పాటు నెలసరి సరిగ్గా రానప్పుడు వాటిని రీసెట్ చేయడానికి, తీవ్రమైన కడుపునొప్పి, పిసిఓడి వంటి హార్మోన్ల సమస్యల చికిత్సకు కూడా వైద్యులు వీటిని సూచిస్తుంటారు. అయితే వీటిని కొద్దికాలం  పాటు వైద్యుల పర్యవేక్షణలో వాడటం సురక్షితమే..  అయినప్పటికీ, ఎక్కువ కాలం పాటు ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా క్రమం తప్పకుండా వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ముఖ్యంగా మహిళలు వైద్యుల సలహాతో అయినా సరే.. ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం మంచిది కాదు.. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు , సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?  వివరంగా తెలుసుకుంటే.. హార్మోన్ల అసమతుల్యత , మూడ్ స్వింగ్స్...  గర్భనిరోధక మాత్రలలో ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టిన్ అనే హార్మోన్లు ఉంటాయి. వీటిని ఎక్కువకాలం తీసుకోవడం వల్ల శరీరంలో సహజమైన హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితమవుతుంది. దీనివల్ల మానసిక ఆందోళన, నిరాశ, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం..  ఎక్కువకాలం పాటు గర్భనిరోధక  మాత్రలు వాడటం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాళ్లలోని నాళాలలో లేదా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్నవారిలో,   ముప్పై ఐదేళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు , అధిక రక్తపోటు..  గర్భనిరోధక మాత్రల వల్ల కొందరిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా చాలా ఏళ్ల పాటు వీటిని వాడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ,  స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. విటమిన్లు , ఖనిజాల లోపం..  ఈ మాత్రలు ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల జీర్ణ వ్యవస్థలో పోషకాల శోషణ తగ్గుతుంది. ముఖ్యంగా విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి , మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల లోపం శరీరంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఎప్పుడూ అలసట, నీరసం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  రొమ్ము నొప్పులు.. ఎక్కువ కాలం ఈ మాత్రల  వాడకం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల కారణంగా రొమ్ములో బరువుగా అనిపించడం, వాపు లేదా నొప్పి రావడం జరుగుతుంది. కాలేయం , పిత్తాశయ సమస్యలు.. మాత్రల రూపంలో తీసుకునే ఈ హార్మోన్లను కాలేయం జీర్ణం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం వీటిని వాడటం వల్ల కాలేయ పనితీరుపై ప్రభావం పడి కాలేయ గడ్డలు ఏర్పడటం లేదా పిత్తాశయంలో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదం..  ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల గర్భాశయ ముఖద్వారం , రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు కొద్దిగా  పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే అదే సమయంలో ఇవి అండాశయ , గర్భాశయ క్యాన్సర్ల నుండి రక్షణ ఇస్తాయట. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడే ముందు , వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. సొంత వైద్యం చేసుకోవద్దు. వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రారంభించాలి. ప్రతి కొన్ని నెలలకోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. కొందరు వైద్యులు కేవలం సమస్యను తగ్గించాలనే కారణంతో ఈ మాత్రలను ఎక్కువ నెలలు రికమెండ్ చేస్తూ ఉంటారు. అవగాహన లోపం వల్ల కంటిన్యు గా ఎక్కువ నెలలు ఈ మాత్రలు రికమెండ్ చేయడం లేదా వాడటం మంచిది కాదు. రక్తపోటు , కాలేయ పనితీరును తరచూ సరిచూసుకోవాలి. మాత్రలు వాడుతున్న సమయంలో తరచూ తలనొప్పి, కాళ్ల వాపు, తీవ్రమైన కడుపునొప్పి లేదా చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.                        *రూపశ్రీ.