LATEST NEWS
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు పంపించ‌డం వంటి ప‌నుల‌కే జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. యువ‌తకు ఉద్యోగాలు క‌ల్పించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ కంపెనీల‌ను త‌రిమేసి యువ‌త‌కు ఉపాధిని దూరం చేశారు. వైసీపీ పాల‌న‌లో క‌నీసం చిన్న‌పాటి ప‌నులు చేసుకునేందుకు కూడా ఏపీలో అవ‌కాశం లేక‌పోవ‌టంతో అధిక‌శాతం మంది ప్ర‌జ‌లు ప‌క్క రాష్ట్రాల‌కు ప‌నుల‌కోసం వ‌స‌ల వెళ్లిన ప‌రిస్థితి. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు.. వ‌చ్చే నెలలో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. ప‌లు హామీల‌తోపాటు.. సానుభూతి నాట‌కాల‌కు తెర‌ లేపారు. వీటిలో  బ‌స్సు యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌పై గుల‌క‌రాయి దాడి ఘ‌ట‌న ఒక‌టి. గ‌తంలో కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ హ‌త్య‌కేసును చంద్ర‌బాబుపై నెట్ట‌డం వంటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్న ప్ర‌జ‌లు జగన్ గుల‌క‌రాయి డ్రామాను నమ్మలేదు. నవ్వి పోయారు. దీంతో జగన్ నవ్వుల పాలయ్యారు. దాంతో ఆ డ్రామాకు తెరదించేసి, నుదుటిపై బ్యాండ్ ఎయిడ్ ను కూడా తీసేసి మేనిఫెస్టోతో మాయ చేయాలని చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టింది. జగన్ మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గత ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో శనివారం (ఏప్రిల్ 27) పార్టీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో  విడుద‌ల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో గ‌తంలోని హామీల‌నే ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌.. ప‌లు ప‌థ‌కాల‌కు నిధుల‌ను పెంచారు. అయితే  గ‌తంలో 99శాతం హామీలు అమ‌లు చేశామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం ప్ర‌జ‌ల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది. ఏపీలో ఏమాత్రం అభివృద్ధి జ‌రిగిన దాఖ‌లాలు లేవు.. కానీ, జ‌గ‌న్ మాత్రం త‌న ప్ర‌సంగంలో దాదాపు అన్ని హామీల‌ను అమ‌లు చేశామ‌ని చెప్పడంపై  ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌ల్లో జ‌గ‌న్ మోహన్ రెడ్డి అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు. జగన్ రెడ్డి హామీలఅమలు  ప్రోగ్రెస్ కార్డు ప‌రిశీలిస్తే.. హామీల అమ‌ల్లో జ‌గ‌న్ కు 10శాతం మార్కులు కూడా రాలేద‌ని చెప్ప‌డానికి సంకోచించాల్సిన అవ‌స‌ర‌మే లేదు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమ‌ల్లో ఫెయిల్ అయ్యారు. మహిళలు, బీసీలు, రైతులు, ఎస్సీలు, ఆదివాసీలు, మైనార్టీలకు గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో జగన్ సర్కార్ ఏమేరకు అమలు చేసిందన్న విషయంపై ఓ సంస్థ  చేసిన  క్షేత్ర స్థాయి పరిశీలనలో జగన్ కు 100కు 10 మార్కులు కూడా రాలేదు. గ‌త ఐదేళ్ల పాల‌న‌లో మ‌హిళ‌లకు ల‌బ్ధి చేకూర్చ‌డంలో 100 మార్కులకుగాను కేవ‌లం 13 మార్కులే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ‌చ్చాయి. బీసీల‌కు ల‌బ్ధి చేకూర్చే విష‌యంలో 16 మార్కులు, రైతుల విష‌యంలో 16 మార్కులు, ఎస్సీల‌కు ల‌బ్ధిచేకూర్చే విష‌యంలో 13మార్కులు, ఆదివాసీల విష‌యంలో 13మార్కులు, మైనార్టీల ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో 10శాతం మార్కులు మాత్ర‌మే జగన్ ప్రభుత్వానికి వ‌చ్చాయి. ఈ ఆరు సబ్జెక్టుల్లో మొత్తం 600 మార్కుల‌కు కేవ‌లం 83 మార్కులు మాత్ర‌మే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌కు వ‌చ్చాయి. దీంతో మ‌రోసారి అధికారానికి జ‌గ‌న్ అనర్హులని భావిస్తున్న ప్ర‌జ‌లు.. మే 13న జ‌రిగే పోలింగ్ లో ఓటు ద్వారా గుణ‌పాఠం చెప్పేందుకు రెడీ అయిపోయారు.  గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీల అమల్లోనూ ఫెయిల్ అయ్యారు. ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా సంవత్సరానికి 1 లక్ష నుంచి 5లక్షల వరకు లబ్ది కలుగుతుందని   తప్పు డు ప్రచారాలు చేసింది వైసీపీ పార్టీ. అదేవిధంగా పిల్లలందరికీ అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఒక్కరికే ఇచ్చారు. పేద అక్క చెల్లెమ్మల పేర్లపై సొంత ఇళ్ల రిజిస్ట్రేషన్ అని చెప్పిన జగన్ తెలుగుదేశం ప్రభుత్వంలో  నిర్మించిన టిడ్కొ ఇళ్లను కూడా  ఇవ్వలేకపోయారు..  ఇలా మహిళలకు ఇచ్చిన ప్రతి హామీలోనూ జగన్ విఫలమయ్యారు. క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాల మేరకు ఆయా హామీల అమలు విషయంలో   వైసీపీ ప్రభుత్వానికి వ‌చ్చిన మార్కుల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌తి కుటుంబానికి లబ్ది (ఒక‌ మార్కు), అమ్మఒడి ప‌థ‌కం (ఆరు మార్కులు), పేద‌లంద‌రికీ ఇళ్లు (2 మార్కులు), మ‌ద్య‌పాన నిషేదం (-2 మార్కులు), డ్వాక్రా గ్రూపుల‌కు ఆస‌రా విష‌యంలో (3 మార్కులు), పింఛ‌న్లు (2 మార్కులు), పెళ్లి కానుక (జీరో మార్కులు), అగ‌న్వాడీ వ‌ర్క‌ర్లు (ఒక మార్కు). మొత్తం 100 మార్కుల్లో వైసీపీ ప్రభుత్వానికి వ‌చ్చినవి 13మార్కులు మాత్ర‌మే. దీంతో ఐదేళ్ల‌లో మహిళలకు ఇచ్చిన హామీల అమల్లో జగన్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని స్పష్టమవుతుంది.  వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌న ఐదేళ్ల పాల‌న‌లో బీసీల ల‌బ్ధికోసం ఇచ్చిన హామీల అమ‌ల్లోనూ ఫెయిల్ అయ్యారు. ప్రత్యే క ఉప ప్రణాళిక ద్వారా రూ. 75,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి.. ఎలాంటి ప్రత్యే క చర్యలు తీసుకోకుండా నిధులు దారి మళ్లించేశారు. ఏ రకంగాకూడా వీటిని సబ్ ప్లాన్ నిధులు అనలేము. బీసీలకు పదవుల విషయంలోనూ ప్రాధాన్యత ఇవ్వలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును, వారికిచ్చిన హామీల అమలు అంశంలో జగన్ ప్రభుత్వానికి 100కు కేవ‌లం 16మార్కులే ప్రజలు ఇచ్చారు. అదే విధంగా వైసీపీ హ‌యాంలో రైతులు కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతుల‌కు మేలు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. రైతులకు మేలు చేసిన అంశంలో వైసీపీ ప్ర‌భుత్వానికి 100కు కేవ‌లం 16 మార్కులే ప్రజలు ఇచ్చారు. ఏ స‌మావేశం జ‌రిగినా ఎస్సీలు నా బంధువులు అని చెప్పుకునే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్ల పాల‌న‌లో ఎస్సీ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను పూర్తిగా విస్మ‌రించారు. వారికి క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌క పోవ‌టంతో పాటు.. వారికి కేటాయించిన నిధులు కూడా పూర్తిస్థాయిలో ల‌బ్ధిదారుల‌కు చేర‌లేదు. దీంతో ఎస్సీ, ఎస్టీల‌కు మేలుచేసే విష‌యంలోనూ జ‌గ‌న్ ఫెయిల్ అయ్యాడు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఐదేళ్ల కాలంలో  ప్రజలు ఇచ్చింది కేవలం 13మార్కులు మాత్రమే.  గిరిజ‌నుల‌కు ఇచ్చిన హామీల అమ‌ల్లోనూ జ‌గ‌న్ ఫెయిల్ అయ్యాడు. గిరిజనులకు ప్రత్యే క జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయ‌లేదు. 500 మంది జ‌నాభా ఉన్న ప్ర‌తి తండాను, గూడెంను పంచాయితీగా మారుస్తామ‌ని ఇచ్చిన హామీని జ‌గ‌న్ అమ‌లు చేయ‌లేదు. ఎస్సీ, ఎస్టీల‌కు పింఛ‌న్ల అర్హ‌త వ‌య‌స్సు 45ఏళ్ల‌కి త‌గ్గింపు అనే హామీని జ‌గ‌న్ అమ‌లు చేయ‌లేదు. దీంతో గిరిజ‌నుల‌కు మేలు చేసే విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంకు ప్రజలు ఇచ్చిన మార్కులు 100కు కేవ‌లం 13 మాత్ర‌మే.  మైనార్టీలకు ఇచ్చిన హామీల అమ‌ల్లోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఐదేళ్ల కాలంలో అర‌కొర హామీల‌తోనే స‌రిపెట్టాడు. 2019 పాదయాత్రలో ఇస్లామిక్ బ్యాంకును ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన‌ జగన్.. మైనారిటీలను మోసం చేశారు. అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. ఐదేళ్ల‌లో కేవలం రూ. 14.51 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మసీదులో ఇమామ్ లు, మౌజామ్ ల‌కు గౌరవ వేతనంగా నెలకు రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం రూ.10,000 ఇస్తున్నారు. అదే విధంగా ఇమామ్‌ల‌కు ఇళ్ళ స్థలాలు కేటాయించి, వారికి ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మోసం చేశాడు. ఇలా ముస్లింకు మేలు చేసే విష‌యంలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం  పూర్తిగా విఫ‌ల‌మైంది. ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ముస్లిం మైనారిటీలు ఇచ్చిన మార్కులు 100కు కేవ‌లం 10 మాత్ర‌మే. మొత్తంగా జగన్ రాష్ట్రంలో ఏ వర్గానికీ మేలు చేయకపోగా, అన్నివర్గాల వారినీ మోసం చేశారు. హామీల అమలు మాట అటుంచి.. పన్నుల రూపంలో వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఒక అంచనా ప్రకారం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వారి నుంచి వసూలు చేశారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో అంటూ మరోసారి మోసం చేయడానికి జగన్ చేసిన ప్రయత్నాన్ని జనం తిప్పి కొట్టానికి సిద్ధంగా ఉన్నారు.  
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న వ‌ర్గీయుల అరాచ‌కం పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. వారి క్రియేటివిటీని చూసి ఏపీ ప్ర‌జ‌లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఇదేంట్రా బాబు.. మ‌నం ఏమైనా పిచ్చోళ్ల‌మా అని చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ  జ‌గ‌న‌న్న అంత మ‌తిపోయే ప‌ని ఏం చేశాడ‌ని అనుకుంటున్నారా..?  ఇన్నాళ్లు జ‌గ‌న‌న్న చేసిన‌వ‌న్నీ ప్ర‌జ‌ల‌కు మ‌తులు పోగ‌ట్టే ప‌నులే క‌దా.. ఇంకా కొత్త‌గా ఏముంది మ‌తిపోవ‌టానికి అనుకుంటున్నారా? తాజాగా వైసీపీ సోష‌ల్ మీడియా క్రియేటివిటీతో ఎవరికైనా మ‌తిపోవాల్సిందే. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైసీపీ మ్యానిఫెస్టోను శ‌నివారం (ఏప్రిల్ 27) విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఆ మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలోనూ తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును తిట్ట‌డ‌మే ప‌నిగా జ‌గ‌న్ పెట్టుకున్నారు. చంద్ర‌బాబు పేద ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ట‌.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం దేశంలో ఏ ముఖ్య‌మంత్రి  చేయ‌లేనంత మంచి ప‌నులు పేద‌ల‌ కోసం చేశారంట‌. అడిగేవాడు లేక‌పోతే.. బెదిరించే వాడిదే రాజ్యం అన్న‌ట్లుగా మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌ ప్రసంగం ఉంది.  ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తాను ఏం చేసినా ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌ద‌నే స్వ‌భావంతోనే పాల‌న సాగించారు. ఐదేళ్ల కాలంలో ఆయ‌న్ను ప్ర‌శ్నిచిన ఎవ‌ర్నీ జ‌గ‌న్ వ‌దిలిపెట్ట‌లేదు. చంద్ర‌బాబు నుంచి.. ర‌ఘురామ కృష్ణంరాజు వ‌ర‌కు ఎవ్వ‌రూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క‌ పాలన నుంచి త‌ప్పించుకోలేక పోయారు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఏపీలో చంద్ర‌బాబు హ‌యాంలో తీసుకొచ్చిన కంపెనీల‌ను త‌రిమేసిన జ‌గ‌న్‌.. క‌నీసం రోడ్ల‌పై ప్యాచ్ వ‌ర్కులు కూడా చేయించ‌లేక పోయారు. ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌పై మండిప‌డుతున్నా.. వైసీపీ అనుకూల మీడియాలో, సోష‌ల్ మీడియాలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన   హామీలన్నీ నెర‌వేరుస్తున్నామంటూ ఢంకా మోగించారు. మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో 99శాతం హామీలు నెర‌వేర్చామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డంపై జనం విస్మయం  వ్య‌క్తం చేస్తున్నారు.  ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చి ఎలాంటి భ‌యం లేకుండా  ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ర్యాలీలు, స‌భ‌ల్లో పాల్గొంటుంటే ఆ ఆనంద‌మే వేరు అన్న‌ట్లుగా జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఇది విన్న ప్ర‌జ‌లు.. మ‌రి   ఇన్నాళ్లు ప‌ర‌దాల మాటున ఎందుకు తిరిగావ్ జ‌గ‌న‌న్నా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కేసి.. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన కాసింత అభివృద్ధినికూడా నిర్వీర్యం చేయ‌డం త‌ప్పితే జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా  చేసింది ఏమీలేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. క‌ళ్ల‌ముందు ఇన్ని వాస్త‌వాలు క‌నిపిస్తున్నా, వైసీపీ సోష‌ల్ మీడియా క్రియేటివిటీని చూసి ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియాలో ప‌లు వీడియోలు ప్ర‌త్య‌క్ష మ‌య్యాయి. ఈ వీడియోల్లో ఓ వృద్ధురాలు మ్యానిఫెస్టోలో కొత్త ప‌థ‌కాలు ఏంఏం ప్ర‌క‌టిస్తున్నారోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.. మ‌రొక వీడియోలో మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కొంద‌రు మ‌హిళ‌లు ఏకంగా హార‌తి ఇచ్చేస్తున్నారు.. మ‌రో వీడియోలో కొంద‌రు గ్రామ‌స్తులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ్యానిఫెస్టో చ‌దువుతుంటే ఉత్కంఠ‌భ‌రితంగా టీవీని వీక్షిస్తున్నారు. ఒక‌ప‌క్క వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌గ‌న్ మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తుంటే.. మ‌రోప‌క్క వైసీపీ సోష‌ల్ మీడియా ముందుగానే ప్లాన్ చేసిన వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ వీడియోల‌ను చూసిన నెటిజ‌న్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న టీంకు పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిందంటూ కామెంట్ల‌తో త‌మ ఆగ్ర‌హాన్ని వెలుబుచ్చారు. ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే   స‌ర్వేల‌న్నీ తేల్చేశాయి. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక పోతున్న జ‌గ‌న్.. ఎలాగైనా ప్ర‌జ‌ల‌ను మ‌యాచేసి మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని  అన్నిప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే గుల‌క‌రాయి డ్రామాను తెర‌పైకి తెచ్చిన‌ప్ప‌టికీ.. అది తుస్సుమంది. గ‌తంలో కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ హ‌త్య‌కేసును చంద్ర‌బాబుపై నెట్ట‌డం వంటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్న ప్ర‌జ‌లు గుల‌క‌రాయి డ్రామాను ఈడ్చిత‌న్నారు. అయినా  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేందుకు త‌న ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి సినిమా లెవ‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ముంద‌స్తుగా రూపొందించిన వీడియోల‌ను వైసీపీ సోష‌ల్ మీడియాలో ప్లాట్ ఫాంల‌లో ప్ర‌జ‌ల‌పైకి వ‌దిలారు. ఇలాంటి ట్రిక్ ల‌ను జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ ఎన్ని ప్ర‌యోగించినా ప్ర‌జ‌లు మాత్రం  ఓటు ద్వారా ఏపీ నుంచి వైసీపీని త‌రిమికొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 28)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. శనివారం (ఏప్రిల్ 27) శ్రీవారిని మొత్తం 81వేల 212 మంది దర్శించుకున్నారు. వారిలో 41 వేల 690 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 88లక్షల రూపాయలు వచ్చింది. 
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్  రాష్ట్రం చుట్టి వ‌చ్చారు క‌దా..., విష‌యం అర్థం అయి వుంటుంది. అందుకే  సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్క‌డ రెండు విష‌యాలు మ‌నం మాట్లాడుకుంటే  1. నామినేష‌న్ల ప‌ర్వం చాలా పేల‌వంగా, జ‌న‌మే లేకుండా వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు. జ‌నాన్ని త‌ర‌లించాలంటే డ‌బ్బు పెట్టాలి. ఎలాగూ ఓడిపోతాం క‌దా అని అనుకున్నారేమో కానీ, నామినేష‌న్ల ఘ‌ట్టంలో వైసీపీ అభ్య‌ర్థులు జ‌నాన్ని త‌ర‌లించ‌లేక‌పోయారు.  2. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని ప్ర‌చారం జ‌రిగిన మేనిఫెస్టో.... అదే పాత మేనిఫెస్టోని కొంచెం మార్చి ప్ర‌క‌టించేశారు.  పాత‌ ఎన్నికల మేనిపెస్టోనే మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు అంతే.  వృద్ధుల పెన్షన్ల విషయంలో మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా నాలుగు వేలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి మార్పు క‌నిపించ‌లేదు. మరో ఐదేళ్ల వరకూ కూడా మూడువేలే ఉంటుందని తేల్చేశారు. ఇతర పథకలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు.   మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసి ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు.  క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే, విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామన్నారు. చట్టపరంగా సాధ్యం కాని అంశం ఇది. అయినా, మేనిఫెస్టోలో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని మ‌ళ్ళీ పాత పాటే పాడారు.   టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నాలుగు వేలపెన్షన్ ప్రజల్లో విస్తృత చర్చ జ‌రుగుతోంది. వీటితో పాటు  జనసేన చెప్పిన మరో 4 పథకాలను కూడా కలిపి.. 10 గ్యారెంటీ హామీలను ఇస్తామంటోంది.  వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేసింది. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది కాబట్టి, ఇక టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఉత్కంఠ‌త నెల‌కొంది. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
రాజకీయాలను తాను వదిలేసినా రాజకీయాలు తనను వదల లేదంటూ చిరంజీవి ఏదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. నిజమే చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది.  అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తున్నారు. 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి, ఆ తర్వాత  కొంత కాలం రాజకీయాల్లో ఉండీ  లేనట్లు కొనసాగారు. అంతే  ఆ తర్వాత చిరంజీవి రాజకీయలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు.  తమ్ముడు పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో కిందా మీద అవుతున్నా, మరో బ్రదర్ నాగబాబు  ఎన్నికల్లో పోటీ చేసినా చిరంజేవి మాత్రం   ఆ దిక్కు  అడుగేయలేదు సరికదా కనీసం ఓ లుక్కు కూడా వేయలేదు.   కానీ  చిరంజీవి  పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష  బాధ్యతలను చిరంజీవికి అప్పగించాలని  భావించారు. ఇందుకోసం చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాంద్ కి అప్పగించారు.  ఆవసరమైతే    తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని రాహుల్ అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వీటికి వేటికీ స్పందించలేదు. సై అనలేదు. రాజకీయం తన వంటికి పడదు అన్నట్లుగా మౌనంగానే ఉండి పోయారు.  ఆ తరువాత కూడా మళ్లీ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ఎప్పుడంటే... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సినిమా టికెట్  రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో, చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి  చర్చలు జరిపారు.  ఆ సమయంలో   చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూపెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వాటన్నిటినీ ఖండించి రాజకీయాలకు తాను దూరం అని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపారు.  ఆ తరువాత మరోసారి చిరు పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ సందర్భం అల్లూరి సీతారామరాజు జయంతి సభ. భీమవరంలో జరిగిన ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ సభలో చిరంజీవే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి రోజాలు ఉన్న ఆ వేదికపై ప్రధాని మోడీ వారందరి కంటే చిరంజీవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వయంగా ఎదురెళ్లీ మరీ స్వాగతం పలికారు. ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. దీంతో చిరంజీవి బీజేపీ గూటికి చేరడం ఖాయమని పరిశీలకులు విశ్లేషణలు సైతం చేశారు. తరువాత మళ్లీ మామూలే చిరంజీవి మాత్రం రాజకీయాలతో తన దూరాన్ని మెయిన్ టైన్ చేశారు.  అయితే ఇప్పుడు అంటే ఏపీలో ఎన్నికల వేళ ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన కూటమి తరఫున ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ సారి వాటిని చిరంజీవి ఖండించలేదు. దీంతో పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన ప్రత్యక్షంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు పలికి, ఆయనకు ఓటేసి గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చిన తరువాత సోదరుడు పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయడానికి వెనుకాడరని అన్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా తన సోదరుడి విజయం కోసం ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే నెల 5 నుంచి ఆయన పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలలో పాల్గొననున్నారు. తన కుమారుడు హీరో రామ్ చరణ్ తో కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనున్నారు.  చిరు ప్రచారంలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులూ, బీజేపీ, తెలుగుదేశం శ్రేణులూ కూడా పాల్గొనేలా కూటమి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. అదే విధంగా ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కోసం కూడా ప్రచారం చేసే అవకాశం ఉందం టున్నారు. అంటే చిరంజీవి ప్రచారం పిఠాపురం, అనకాపల్లికే పరిమితమైనా ఆ ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్లస్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
సినిమాలు ఎక్కువగా శుక్రవారం విడుదలవుతుంటాయి. ఎందుకంటే విడుదల రోజు ఎలాగూ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటే థియేటర్లకు వస్తారు. అలాగే రెండో రోజు, మూడో రోజు వీకెండ్ అవుతుంది. ఇలా మొదటి మూడు రోజులు మంచి వసూళ్లు రాబట్టడానికి అవకాశముంటుంది. అందుకే సినిమా విడుదల అంటే శుక్రవారమే అనే ముద్ర పడిపోయింది. అయితే ఇప్పుడు శుక్రవారం ప్లేస్ లోకి గురువారం వస్తోంది. ఇటీవల చాలా సినిమాలు గురువారంకి గురి పెట్టాయి. జూన్ 27న 'కల్కి 2898 AD', ఆగస్టు 15న 'పుష్ప-2', ఆగస్టు 29న 'సరిపోదా శనివారం', అక్టోబర్ 10న 'దేవర' విడుదల కానున్నాయి. ఈ తేదీలన్నీ గురువారమే కావడం విశేషం. ఏదైనా హాలిడే తోడైతే, లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని కొందరు మేకర్స్ గురువారం తమ సినిమాని విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అంటే టాక్ తో సంబంధం కనీసం రెండు మూడు రోజులు థియేటర్ల దగ్గర సందడి ఉంటుంది. అందుకే గురు, శుక్ర వారాలు హీరో స్టార్డంతో కలెక్షన్స్ వస్తే.. శని, ఆది వారాల్లో వీకెండ్ కారణంగా కలెక్షన్స్ వస్తాయని భావించి.. మేకర్స్ గురి గురువారంపై పడిందని అంటున్నారు. ఇక నుంచి స్టార్ల సినిమాలు ఎక్కువగా గురువారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఇటీవల ఆమె నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ లో రూపొందనున్న మొదటి సినిమాను ప్రకటించారు. ట్రాలాలా బ్యానర్ నుంచి రానున్న మొదటి చిత్రానికి 'మా ఇంటి బంగారం' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇందులో సమంతనే ప్రధాన పాత్ర పోషిస్తోంది. నేడు ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. గృహిణి తుపాకీ పట్టి వయలెంట్ గా మారితే ఎలా ఉంటుంది అన్నట్టుగా పోస్టర్ లో సమంత లుక్ ఉంది. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Actress-singer Shruti Haasan and popular illistrator-doodle artist from Assam Santanu Hazarika have reportedly parted ways after dating each other for four years. The couple was reportedly living together in Mumbai before breaking up.  The fact that they both have even unfollowed each other on social media, furthermore cements the news about their split. They both deleted their pictures on social media and un followed each other on Instagram. According to a report by Hindustan Times, they broke up a month ago and have put an end to their relationship. Recently in a social media post, Shruti wrote, “It’s been a crazy ride, learning so much about myself and about people.” Shruti Haasan and Santanu Hazarika had been dating since the COVID-19 pandemic. We have to wait for the official confirmation of this news.
Popular production house Sri Venkateswara Creations bringing an entertainer in the crazy combination of youth star Nithiin and director Sriram Venu of Vakeel Saab and MCA fame. The movie titled "Thammudu" shoot is progressing at brisk pace. Recently released first look poster presents Nithiin in a new avatar and the poster is remarkable. From the ambitious first look and promotional content, it is evident that Nithiin is bringing something out of the ordinary. Director Sriram Venu is delivering an entertainer, not in a regular format. We've known that Veteran actress Laya is playing sister role of Nithiin while Kannada actress Sapthami Gowda of Kantara fame is playing the female lead. Now, it is confirmed that another beautiful heroine is now part of this film. Varsha Bollamma, who scored hit with Ooru Peru Bhairavakona is onboarded to play another key role in the film. Popular DOP Sameer Reddy working as a cinematographer for this film. Ajaneesh Loknath of Kantara and Virupaksha fame is scoring music for this entertainer. Prawin Pudi is handling the editing works.
One of the surprising hits that stunned Tollywood in 2019 is none other than Mathu Vadhalara, directed by debutant Ritesh Rana and features Sri Simha in the lead. Naresh Agastya and Satya played key roles in this thriller comedy. The film’s success gave a new breeze to Tollywood when it comes to narrating a story in whacky mode. However, both the director and the hero failed to repeat that success later on with other movies. Now, Ritesh Rana and Sri Simha are working on the sequel of Mathu Vadhalara, rather than working on Happy Birthday sequel as expected earlier. Mathu Vadhalara 2 will be in the offing with Sri Simha taking the lead role again and Satya as his accomplice, while the setup and villain will be changed. This time, there is a female lead in this thriller comedy. Faria Abdullah is playing the heroine. This exciting news is confirmed by Faria Abdullah herself in recent interaction with media. Jathi Ratnalu heroine awaits for her next with Allari Naresh titled Aa Okkati Adakku releasing on May 3rd.
The film "Jathi Ratnalu," which was released amid doubts about whether the real audience would come to the theatres after Corona, became a box office hit and drew everyone's attention. This full-length comedy entertainer from Tollywood became sensation everywhere. Despite lack of any star actors, this film broke box office records. The film's heroes are Naveen Polishetty, Priyadarshi, and Rahul Ramakrishna, and the heroine is Fariya Abdullah. This film marks the debut of new director Anudeep KV in the industry, who turned into Cash Anudeep and got decent fan base. The filmmakers have stated that if this film becomes a smash hit, there will be a sequel. Anudeep KV also clarified the film's sequel. There is a specific idea for film "Jathi Ratnalu 2." However, he said that the film will take 4-5 years before it starts. Recently, heroine Faria Abdullah interacted with media about Aa Okkati Adakku and shared exciting news about Jathi Ratnalu 2. Talking about Jathi Rathnalu 2, she said "Presently the producers are busy with 'Project K'. That's a huge project. I am also waiting for Kalki. I think after the release of Kalki they will think about Jathi Ratnalu 2." It appears that Nag Ashwin will co-write this sequel with Anudeep KV. More details about this sequel will be known soon.
ప్రతీవారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కంటే ఓటీటీలోకి వచ్చే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో తమిళ, మలయాళ, హిందీ సినిమాలు పోటీ పడీ మరి వస్తున్నాయి. అయితే ఇందులో కాస్త భిన్నంగా ఉండే సినిమాలకి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరంలో 'గుడ్ నైట్' పేరుతో తమిళంతో పాటు తెలుగులో ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో హీరో పడుకున్న తర్వాత గురక వస్తుంటుంది. అది తన పక్కన పడుకున్నవారికి తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకంటే అచ్చం అదే తరహాలో 'డియర్' మూవీని తీసుకొచ్చారు మేకర్స్. జి.వి ప్రకాష్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'డియర్'. ఈ సినిమా ఈ నెల 11న తమిళంలో 12న తెలుగులో రిలీజ్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు(ఏప్రిల్ 28) నుండి స్ట్రీమింగ్ అవుతోంది. జి.వి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టరే కాదు హీరోగా సపోర్టింగ్ రోల్ గా చేస్తూ మెప్పిస్తున్నాడు. థియేటర్లలో ఈ సినిమాని చూడనివాళ్ళు ఓసారి చూసేయ్యండి.  ఓ టెలివిజన్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా జాబ్ సంపాదించి ప్రముఖులని ఇంటర్వ్యూ లు చేయాలనేది అర్జున్(జి.వి ప్రకాష్) కల‌‌. అయితే అతనికి పడుకున్న తర్వాత చిన్న శబ్దం వినపడినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అదే సమయంలో నిద్రపోయాక గురకపెడుతుంటుంది దీపిక(ఐశ్వర్య రాజేష్). ఈ ఇద్దరు ఒకరి సమస్య ఒకరికి తెలియకుండా పెళ్ళి చేసుకుంటారు. మరి పెళ్ళి తర్వాత ఒకరి సమస్య ఒకరికి తెలిసిందా? వాళ్ళిద్దరి కలిసి ఉండగలిగారా లేదా అనేది మిగతా కథ.. ఈ రోజు నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని ఓ సారి చూసేయ్యండి.
Comedy king Allari Naresh is going to come up with out and out family entertainer 'Aa Okkati Adakku'. Malli Ankam is making his debut as a director and Rajiv Chilaka is producing this film under the banner of Chilaka Productions. Faria Abdullah is playing the heroine. As Allari Naresh is bringing a comedy entertainer after a long time, there is special interest in this film. The teaser and trailer of this movie created huge buzz. Ahead of the grand release of the film on May 3, heroine Faria Abdullah interacted with media about the film. Talkung about her character, she said "My character's name in this is Siddhi. My character is very care free. She doesn't like to live with all the plans and regulations. The role of the hero is different from my role. He has everything according to plan. There is a good conflict between these two characters. At the same time there is a good attraction. The story revolves around the theme of marriage and is captivating to all. The story and concept of 'Aa Okkati Adakku' is beautiful. Talking about challenges playing this role, she said "It didn't seem like a challenge. Because, I am also in free flow. It is a character that I am very connected to. I liked the content when the director told the story. This is the content that everyone needs these days. Sharing her work experience with Allari Naresh, she said "Working with Naresh was a very good experience. Shooting was a lot of fun. Naresh's comedy timing is extraordinary. The audience will laugh heart full. It has a lot of hilarious entertainment. Talking about the challenges choosing in character, she said "I will look at character priority, length. I have also done some cameo roles. I always wanted to work with Ravi Teja. An opportunity came in Ravanasura. I can't say that it was a heroine role but I found it very exciting to play that role." The actress also shared the films that she want to do in future, she said "Mass Masala films, in a typical heroine role. Also a horror thriller is to be made. Also to make a comedy film. I think I like action movies better.
Babai Hotel has become a favorite place for food lovers in the Telugu states. This restaurant is currently expanding its business into all areas. Babai Hotel came to Hyderabad in 2022. A new branch was opened in Madhapur last month. The two branches established by KV Dinesh Reddy and Shreshta Reddy in Madinaguda and Madhapur are running successfully. Meanwhile, the third branch of Babai Hotel has now been opened at Nallgandla in Lingampally, Hyderabad. Family hero Srikanth inaugurated the restaurant and sent his best wishes to the management. Managers of Babai Hotel KV Dinesh Reddy, Shreshta Reddy, and some other guests participated in the inaugural function. The management expressed their happiness over the opening of this new branch and thanked Hero Srikanth who opened the new branch in Nallagandla.
Mega Producer K. T. Kunjumon As the producer and directed by sensational director S. Shankar, Music by Oscar winner A. R. Rahman and starring by Indian Michael Jackson Prabhu Deva and beautiful actress Nagma movie Premikudu is going to be re-released. Ramana and Muralidhar are acting as the re release producers of this movie. SP Balasubramaniam, Vadivelu, Raghuvaran and Girish Karnad acted in lead roles. The event for this re-release was held very grandly yesterday. Producers Muralidhar Reddy, Ramana, famous producer Lagadapati Srinivas and Shobharani were present in this ceremony. They are confident on the film's grand success. The movie Premikudu, which released 30 years ago, is being re-released in more than 300+ theaters on May 1st. Bookings are open and getting excellent response from audience. Premikudu is Directed by S. Shankar, starring Indian Michael Jackson Prabhu Deva and Nagma’s movie released 30 years ago and impressed the youth. Even now, the songs of that movie continue to impress everyone, not just the youth. Prabhu Deva’s father S. P. Balasubramaniam’s acting is a big plus for the movie. S. P. Balu’s dancing is equal to Prabhudeva in the song andamaina premarani cheyyi tagilithe is special. Takeit Easy Policy, O Chelia Na Priya Sakhia songs are still evergreen songs. The movie which came out as a good youth full love story was the biggest blockbuster in those days.
ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ ల గురించి.. మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం.. కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు. ఒంటరితనమే బలం.. మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా.. అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు. తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు. జ్ఞాపకశక్తి ఎక్కువ.. 2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది. ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.  లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.                                          *నిశ్శబ్ద.
ప్రేమ, స్నేహం రెండు కవలపిల్లల లాంటివి. చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి. కానీ చాలా సున్నితమైన వ్యత్యాసాలు దాగుంటాయి. స్నేహం ప్రేమ లానూ, ప్రేమ స్నేహం లానూ అనిపించి చాలా మందిని గందరగోళ పెడుతుంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో జెండర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. అమ్మాయిలు స్నేహం అనుకున్నా. దాన్ని ప్రేమగా భావించే అబ్బాయిలు, అబ్బాయిలు స్నేహం అనుకుంటే దాన్ని ప్రేమగా భ్రమ పడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. నిజానికి ఈ వ్యత్యాసం తెలుసుకోలేక చాలామంది స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమది స్నేహమా?? లేక ప్రేమా?? అనే విషయం గురించి అమ్మాయిలలో ఉండే సందేహాలు క్లియర్ చేసుకుంటే.. అసూయ చూపిస్తున్నారా? ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ మీరు మీ స్నేహితుడికి దగ్గరగా ఉన్న వారిని చూసి మీకు అసూయగా అనిపించినప్పుడు, లేదా మీరు ఇతరులతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మీ స్నేహితుడు అసూయగా ఫీలవుతుంటే మీ మధ్య స్నేహం ప్రేమగా మారుతుందని అర్థం. ఉదాహరణకు  ఇతరులకు దగ్గర ఉండటం, వారితో సినిమాలు, పార్టీలు, మొదలైన వాటికి ఆసక్తి చూపిస్తూ వెళ్ళడం చేస్తే అవన్నీ చూసి స్నేహితుడు లేదా స్నేహితురాలు చిటపటలాడుతున్నా, కోప్పడుతున్నా, అలుగుతున్నా  వారితో స్నేహం కంటే ఎక్కువ అనుభూతి చెందుతున్నారని అర్థం. ఏకాంతం కోరుకుంటున్నారా? సాధారణంగా స్నేహితులు అంటే ఒక బ్యాచ్ గా ఉంటారు. వీళ్లలో కొందరు అమ్మయిలు, మరికొందరు అబ్బాయిలు కూడా ఉంటారు. అయితే ఇంతమంది స్నేహితులలో కేవలం ఒక్కరితోనే ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంటే అది స్నేహం కంటే ఎక్కువ భావనను సూచిస్తుంది.  పదే పదే గుర్తుచేసుకోవడం.. చాలా వరకు స్నేహితులతో సమయం గడిపిన తరువాత ఇంటి పనుల్లోనూ ఇతర కార్యకలాపాలలోను మునిగిపోతుంటారు. కానీ అలా కాకుండా కేవలం ఒకే ఒక్కరి గురించి పదే పదే ఆలోచిస్తున్నా, వారితో మాట్లాడాలని అనిపిస్తున్నా వారు మిగిలిన వారికంటే చాలా స్పెషల్ అని అర్థం.  ప్రాధాన్యత.. ఎంతమందిలో ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్న తమ స్నేహితుడు లేదా స్నేహితురాలి గురించి ప్రస్తావిస్తూ, తమ మధ్య ఉండే సాన్నిత్యన్ని బయటకు గర్వంగా చెప్పుకుంటున్నా, ఇతరులకంటే వారిని ఎక్కువగా పరిచయం చేస్తున్నా, వారికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వారంటే ప్రత్యేక భావన అని అర్థం. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య జెండర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ కారణంగా చాలామంది తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఈ ఆకర్షణ కారణంగా ఏర్పడే స్నేహం, ఆకర్షణ ఉన్నంత వరకు ఉంటుంది. ఈలోపు నిజంగా స్నేహం వెల్లివిరిస్తే.. అది ప్రత్యేక సాన్నిత్యం కోరుకుండా..  కష్టసుఖాలు చెప్పుకోవడానికి, కష్టసమయంలో సాయం చేసుకోవడానికి తోడుగా ఉండేది అయితే స్నేహమే.. ప్రేమకు, స్నేహానికి  మధ్య సన్నని గీతను గుర్తెరగాలి.                                   *నిశ్శబ్ద.
విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు. బంధంలో  భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.  ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి.  అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి.   బంధం కూడా బలపడుతుంది. అవి నేరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది. చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు.  భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిలో ప్రేమ, గౌరవం,  అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్నిగడపాల్సి ఉంటుంది.   ఇది పరస్పర అవగాహనతోనూ, బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండటం ద్వారా జరుగుతుంది. స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు. భార్యలు భర్తల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసుకుంటే.. ప్రేమ.. ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ,  ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది. ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా, దృఢంగా మారుతుంది. శ్రద్ద..  ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వహించడం.  భార్యకు ఇంటి పనిలో సహాయం చేయడం, ఆమె మానసిక స్థితి సరిగా లేకుంటే ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనులలో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం,  ఆమెకు తినిపించడం, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం, ఆమె కోసం సమయం కేటాయించడం..  ఇవన్నీ చిన్నవి కానీ శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పడానికి ఇవి చాలా మంచి మార్గాలు. గౌరవం.. ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు. వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి ఉంటుంది. భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, సమానంగా చూడాలని,  తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైనవారి దగ్గర   దెబ్బతీయకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త ఇవన్నీ చేస్తే భార్యలు తమను ఎంతగా గౌరవిస్తారో గ్రహించగలుగుతారు కమ్యూనికేషన్.. భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యం. భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని,  జడ్జ్ చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది. భార్యాభర్తల బంధంలో  ఒకరికొకరు నిజాయితీగా,  మంచి  నమ్మకంతో  కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుంటే, భర్త ఆమెను పట్టించుకోకుండా ఉండటం సరికాదు.  ఈ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి. తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది. అవగాహన.. భార్యాభర్తల మధ్య సంబంధాలలో పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు తమ భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని భార్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మనస్తత్వంతో ఉంటారని ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతి భర్త తన భార్య ఇష్టాలు,  అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే వారి బంధానికి శ్రీరామ రక్ష.                                                             *నిశ్శబ్ద.
అందరినీ వేదించే సమస్య ముఖ్యంగా యువతను వేదిస్తున్న సమస్య ఊబ కాయం అంటే ఒబెసిటీ. దీనికోసం తిరగని చోటంటూ ఉండదు .  వెళ్ళని డాక్టర్ అంటూ లేదు. సక్షన్లు, నాన్ లైపోసక్షన్లు. ప్రత్యేకంగా దీనికోసమే ఉన్న ఆసుపత్రులు. ప్రత్యేక సర్జన్లు. ఇలా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావడం  గమనించ వచ్చు.చేతి వాడిని ఒదిలి కాలివాడిని పట్టుకున్నట్లు మనం పాటించాల్సిన కనీస  నియమావళిని అమలు చేయకుండా స్వీయ నియంత్రణ  లేకుండా ఊబ కాయాన్ని తగ్గించలేమని అంటున్నారు వైద్యులు.మీ శరీరం బరువు తగ్గాలంటే రాత్రి వేళ ఈ పది సూత్రాలు అమలు చేయండి.మీరు మీ శరీర బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.ప్రతిరోజూ వర్క్ అవుట్ తప్పని సరిగా  చేస్తూ ఉంటారు. కొన్ని మార్పులు చేసి ప్రయత్నం చేయండి. దీని వల్ల మీరు నాజూకుగా స్లిమ్ముగా కనపడడానికి దోహదం చేస్తాయి. రాత్రి సమయమే సరైన సమయం... మన శరీర బరువు తగ్గించే ప్రయత్నం చేస్తు ఆరోగ్యకర మైన ఆహారం తీసుకుంటూనే వర్క్ అవుట్ చేస్తూ ప్రతిరోజూ ప్రత్యేకమైన  విషయాలు అనుసరించాలి.అందులోను కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ రాత్రివేళ ప్రయత్నించండి మీరు స్లిమ్ గా మారచ్చు .సాయంత్రం వేళ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. సాయంత్రం వేళ మిమ్మల్నిమీరు ఒక వ్యాపకం వైపుకు మళ్లించండి. కొన్ని సందర్భాలలో ప్రజలు చాలా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. అలా చెయడం బోరింగ్ మీరు ఫిట్ గా ఉండాలంటే నిద్ర పోయే ముందు కొంత పని చేయాల్సి ఉంటుంది. కొంచం సేపు నడవడం, చాట్ చేయడం, వ్యాసాలు రాయడం, మీమిత్రులతో పంచుకోవడం. లేదా కొన్ని పుస్తకాలు చదవడం వల్లమీరు  ఆహారం పెద్దగా తీసుకోరు. ఒక కొత్త అలవాటు ఒక్కొఅంశం పైన ఆశక్తి పెంచుకోడం వల్ల పెయింటింగ్ వేయడం. సంగీతం పాడడం లేదా ఏదైనా వాయిద్యం వాయించడం. అల్లికలు చేయడం వంటి పనుల వల్ల ఆహారం తినాలన్న కోరిక తగ్గిపోతుంది. మళ్ళీ తినా లన్నా కాంక్ష బోర్ గా ఉంటుంది. సరిగా నిద్రపోవాలి... సాయంత్రం వేళలో  కాస్త వ్యాయామం కొంత మేర మీకు సహాయ పడుతుంది. అది ఎక్కువ సేపు వ్యాయామం చేయకూడదు. విరామం లేకుండా చేసే వ్యాయామం చెయడం వల్ల నిద్ర పోవడం కొంచం కష్టంగా ఉంటుంది. మరీ ఆలస్యంగా వర్క్ అవుట్ చేయకండి. నిద్రపోడానికి రాత్రివేళ గంట ముందు  వ్యాయామం ఆపేయండి ఆతరువాతే నిద్రకు ఉపక్రమించండి. నిద్రపోయే ముందు తినకండి... నిద్రపోయే ముందు మీరు డిన్నర్ తీసుకుంటారా? అల్పాహారం అంటే టిఫిన్ తీసుకుంటారా? ఏదైనా మీరు మీఅహారాని నిద్రకు ముందే ముగించేయ్యాలి. అలాకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీఆహారం తీసుకుంటే అది మీ శరీర బరువును మరింత పెంచుతుంది. అయితే మీరు మీ బరువు తగ్గాలన్న ప్రయత్నం విఫలం కావచ్చు. సరైన సమయం, అంటే ఏ సమయంలో ఆహారం తిన్నారు అన్నది విషయం కాదు. చాలా మంది రాత్రి వేళలో  ఆహారం తీసుకునే వాళ్ళు పైగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. అర్ధ రాత్రి భోజనం ,అల్పాహారం తీసుకోడం వల్ల  నిద్రపోలేరు. దీనివల్ల మళ్ళీ బరువు పెరుగుతారు. కొన్ని గంటల పాటు వంట గది నుంచి బయటికి రండి. నిద్రపోయేముందు నుంచి మరుసటి రోజు ముందు వరకు మేల్కుని ఉంటారు. మీ మధ్యాహ్న భోజనాన్ని రేపటికి ప్యాక్ చెయ్యండి... ప్రతి రోజూ మీరు మాధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్తున్నారా? అయితే కొంత పొడుపు చేయండి. రాత్రికి ముందే మీ లంచ్ ను ప్యాక్ చెయ్యండి. బయట తినడము అంటే  అందులో ఎక్కువ కొవ్వు పదార్ధాలు, సోడియం ఉంటుంది మీ ఆహారాన్ని మీరే  ప్యాక్ చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఇచ్చే బాదాం, టర్కీస్లై సెస్, హోల్ గ్రైన్, తక్కువ కొవ్వు ఇచ్చే  పాల ఉత్పత్తులు చాలా రకాల పండ్లు ఫలాలు తీసుకోవచ్చు. మీరు మీ సమయ పాలనకు కట్టుబడి ఉండండి... రాత్రి వేళ మీరు ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారని గమనిస్తే అంటే దాని ఆర్ధం ఉదయం వేళ మీరు సరిపడే ఆహారాన్ని తీసుకోలేదని అర్ధం. దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మీ భోజనం మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరకంగా మీ శరీరానికి ఎప్పుడు ఆహారం తీసుకోవాలో  తెలుస్తుంది. మాధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ మధ్య స్నాక్ తీసుకుంటే మంచిది. అలా ప్రయత్నం చేయడం అది మీరు ఎక్కువగా చేయకండి. టి వి ని కట్టెయ్యండి... రాత్రి వేళ ఆహారం తీసుకుంటూ టివి చూసే అల వాటు మీకు ఉంటె మీరు ఆహారం తీసుకునే సమయం టి వి చూసే సమయం ఆమధ్యలో మీరు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాసం ఉంది.రాత్రి ఆహారం తీసుకున్నాక మీ చిగుళ్ళను పళ్ళను బ్రష్ చేయండి. రాత్రి వేళ మీరు తీసుకునే ఆహారాన్నిపూర్తిగా తగ్గించాలంటే మీరు మీపళ్ళను  చిగుళ్ళను శుబ్రం చేసుకోండి. ఒక వేళ మీ పళ్ళు శుభ్రంగా ఉంటె నిద్రపోవడానికి ముందే అల్పాహారం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి. పళ్ళు శుభ్రం చేయడానికి 6౦ నిమిషాలు ఆలోచించండి. ప్రత్యేకంగా మీరు యాసిడ్స్ లాంటివి అంటే నిమ్మరసం, ద్రాక్ష పళ్ళు, సోడా లాంటివి తీసుకుంటే 6౦ నిమిషాలు  ఆగాలి అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని సులభంగా జయించవచ్చు... మీరు ఒత్తిడిని ఎదుర్కుంటూ న్నట్లైతే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి వేళ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. లోపలి సుదీర్ఘ శ్వాస తీసుకునే పద్దతులు అవలంబించండి. లేదా మెడిటేషన్ ధ్యానం చెయడం ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని అలా చేయడం వల్ల నాణ్యతతో కూడుకున్న నిద్ర ను పొందవచ్చు. ఇక చివరగా రాత్రివేళ నిద్ర పోయే ముందు లైట్లు తీసి వేయండి.. చీకాట్లో నిద్రపోవడం చాలా మందికి అల వాటు. అలా చేయడం వల్ల మాంచి నిద్ర పడుతుంది.మీరు బరువు తగ్గించు కోవాలన్న ప్రయత్నాం చేయడం ద్వారా మీ కిటికీలు మూసి వేయండి. కర్టెన్లు వేసుకోండి. ఫోన్లు ల్యాబ్ టాబ్ కు దూరంగా ఉండండి. పడు కునేందుకు ముందు 3౦ నిమిషాలు వాటికి దూరంగా ఉండండి. కంటి మీద మాస్క్ వేసుకుంటే సహాయ పడుతుంది.
వేసవి కాలంలో అందరూ ఎం ఇష్టంగా తినే ఖర్భుజాను స్వీట్ మెలోన్ లేదా రాక్ మెలోన్ అని అంటారు. హిందీ, మరాఠీ, తెలుగులో దీనిని 'ఖర్బూజా' అని పిలుస్తారు, తమిళంలో దీనిని 'ములం పజం' అని పిలుస్తారు. బెంగాలీలు దీనిని 'ఖర్ముజ్' అని పిలుస్తారు, గుజరాతీలు దీనిని షకర్టెట్టి అని పిలుస్తారు. ప్రాంతాలు, పేర్లు ఎన్ని మారినా ఈ ఖర్భూజా మాత్రం మ్యాజిక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో దొరికే అన్ని పండ్లలోకి ఇది చాలా అద్బుతమైనది అని అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఈ ఖర్భూజా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..  ఖర్భూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మన రోగనిరోధక కణాలైన తెల్ల రక్త కణాలను (WBC) బిల్డ్ చేస్తుంది. తద్వారా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . ఇవి సాధారణంగా మూసుకుపోయిన రంధ్రాల్లో పెరిగిమొటిమలుగా కనిపించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కూడా సహాయపడుతుంది. మెరిసే చర్మం కోసం, ఖర్భూజా, పుదీనా కాంబినేషన్ గా జ్యూస్ ప్రయత్నించవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది చక్కెర లేకుండా ఈ జ్యుస్ తీసుకుంటే కేలరీలు బెడద ఉండదు.  బరువు తగ్గించే ఆహారం తీసుకునే వారు ఎప్పుడూ రుచినిచ్చే పదార్థాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఖర్భూజా బెస్ట్ ఆప్షన్. ఇది నోటికి, కడుపుకు కూడా తృప్తిని ఇస్తుంది. దీనివల్ల బరువు పెరగరు.  కేవలం ఇదొక్కటే కాకుండా దీనితో పాటు ఇతర పండ్లను భాగం చేసుకుని ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు. ఖర్భూజాలో ఉండే విటమిన్ సి క్యాన్సర్ను నిరోధించడంలో, క్యాన్సర్ తో పోరాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.  తరచుగా నోటి పుండ్లు మరియు నమలడంలో ఇబ్బంది ఉన్నవారు క్యాన్సర్ రోగులు ఖచ్చితంగా ఖర్భుజా తీసుకోవాలి.  ఖర్భూజా పండులో కొవ్వులు ఉండవు.  ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణంగా  ధమనులను ఆరోగ్యంగా ఉంచి గుండెను కాపాడుతుంది. శరీరానికి  సరిపడామెగ్నీషియం ఉందులో లభిస్తుంది.  ఇది హృదయ స్పందనను సక్రమంగా ఉంచుతుంది.  ఇందులో ఉండే  పొటాషియం  రక్తపోటును నిర్వహించడానికి పని చేస్తుంది. ఎక్కువ శాతం నీటితో నిండిన పండ్లలో ఖర్భూజా ఒకటి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.  జీర్ణశయానికి చాలా మంచిది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, నిర్విషీకరణకు సహాయపడుతుంది.  చాలామందిలో తరచుగా వచ్చే  ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) తగ్గించండంలో సహాయపడుతుంది.  అసిడిటీ సమస్య ఉన్నవారికి ఖర్భూజా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఖర్భూజా కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఖర్భూజా తీసుకుంటే చాలా సేపటి వరకు ఆకలిని నియంత్రించుకోవచ్చు.  ◆నిశ్శబ్ద.
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట. యాపిల్ లో ఉండే పోషకాలే దీనికి కారణం. అయితే ఈ మధ్య యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పాపులర్ అయింది. దీన్ని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.  ఎవరైనా కొత్తగా యాపిల్ సైడర్ వెనిగర్ వాడే ఆలోచనలో ఉన్నా, దీని గురించి పూర్తీగా తెలియకున్నా ... దీని గురించి తప్పక తెలుసుకుని వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్ వాడటానికి ముందు అందరూ తెలుసుకోవలసిన విషయాలేంటో.. దీన్ని వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. మధుమేహ రోగులకు.. యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.  మధుమేహం ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను వైద్యుల సలహా తీసుకుంటే రెగ్యులర్ గా వాడుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. బరువు.. యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గాలని అనుకునేవారికి  ఔషధం కంటే తక్కువ కాదు. దీన్ని రోజువారీ వాడుతుంటే  ఆకలి నియంత్రణలో ఉంటుంది.  ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.   ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. గుండె ఆరోగ్యం.. చెడు కొలెస్ట్రాల్ సమస్య అయినా,  రక్తపోటును నియంత్రించడం అయినా..  ఆపిల్ సైడర్ వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన చాలా  సమస్యలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.   ఇందులో ఉండే మూలకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యం.. యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని నిర్వహించడానికి  ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మం  దురద, ఎరుపు,  చర్మ అంటువ్యాధులు మొదలైన  సమస్యలలో  బ్యాక్టీరియాను చంపడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి.. యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగించడానికి ఒక కరెక్ట్ కొలత వాడాలి. ప్రతిరోజూ ఇంతే మోతాదులో తీసుకోవాలి.  5-10 ml మోతాదుతో మాత్రమే ప్రారంభించాలి.  ఒక గ్లాసు తీసుకుని అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. గ్లాసు నిండుగా నీరు తీసుకోవాలి.  దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో  తాగాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు,  చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  కాబట్టి దీన్ని మొదలుపెట్టే ముందు   వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                         *రూపశ్రీ.