LATEST NEWS
  ప్రజాస్వామ్యంలో అధికారులు వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కానీ, స్వలాభం కోసమో, రాజకీయ విధేయత కోసమో ఆ వ్యవస్థకే తూట్లు పొడిస్తే? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల  రహస్య బేటీలు  సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తుంటే, మరోవైపు తెరచాటున ఏం జరుగుతోంది? వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై  ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.   లక్షలాది మంది పోటీ పడే యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గి, అత్యున్నత శిక్షణ పొందిన ఐఏఎస్ అధికారులను మనం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ  అని పిలుచుకుంటాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, రూపొందించే ప్రతి రూల్ వీరి కనుసన్నల్లోనే జరుగుతుంది. అయితే.. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులు, హైదరాబాద్‌ వేదికగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని, కాంట్రాక్టర్ల వివరాలను, పెట్టుబడుల సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు చేరవేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం క్రమశిక్షణారాహిత్యం మాత్రమే కాదు, ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ ఆ ప్రజలకే చేసే విశ్వాసద్రోహం. ఈ విషయంలో ప్రభుత్వాధినేతలు ఉదాసీనంగా వ్యవహరిస్తే అది పెను ప్రమాదానికి దారి తీస్తుందని అప్పసాని రాజేష్ హెచ్చరించారు. తెలుగువన్ యూట్యూబ్ చానల్ అప్పసాని ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఈ కింది లింక్ క్లిక్ చేసి వీక్షించండి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం  కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దు పోరు కాదు ప్రపంచ దేశాల సమస్య. అన్ని దేశాల్లోని ప్రజల ఇంటి సమస్య. యుద్ధం అనగానే మనకు చాలా దూరంగా, ఎక్కడో సరిహద్దుల్లో జరిగే తుపాకుల మోత మాత్రమే అని అనిపిస్తుంది. కానీ ఇప్పటి గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ గా పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మరీ ముఖ్యంగా  భారతదేశ భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద మలుపు. పెద్ద కుదుపు. ఇండియాకు  అవసరమైన ఇంధన అవసరాలలో దాదాపు 90% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది.   ఈ  కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఆ ప్రభావంతో  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేనా యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలునెలకొన్న గల్ఫ్ దేశాలలో దాదాపు కొటి మంది ఇండియన్స్ పని చేస్తున్నారు. ఈ యుద్ధం   వారి ఉద్యోగాలు, భవిష్యత్, అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది.   ఈ సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి లేదా  పరిష్కరించడానికి  భారతదేశం వంటి పెద్ద దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ తన పలుకుబడిని ఉపయోగించి ఆపడానికి కృషి చేయాలి.   బ్రిక్స్ ద్వారా చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలను ఏకం చేసి శాంతి కోసం ఒత్తిడి తేవాలి.   తెలుగువన్ యూట్యూబ్ చానెల్ వాస్తవ వేదికలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ మధ్య  ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై చూపే ప్రభావం తదితర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆ చర్చ పూర్తి పాఠం ఈ దిగువ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి వీక్షించండి.  
చంద్ర‌బాబు ప‌నై పోయింద‌ని.. ఆయ‌న‌కివే చివ‌రి ఎన్నిక‌లు అవుతాయ‌ని..  ఈ వ‌య‌సులో కృష్ణా రాా అనుకోకుండా  ఆయ‌న‌కెందుకీ రాజ‌కీయాలు. అలాగైనా ఆయ‌న‌కు పుణ్యం వ‌స్తుంది  క‌దా? అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన జగన్ కు  వైసీపీ సీనియ‌ర్ నేత బొత్స  ప‌ట్ల లోకేష్ చూపిన   వాత్స‌ల్యం చెంపపెట్టులాంటిదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జగన్, లోకేష్ ఇద్దరూ పొలిటీషియన్సే.. కానీ మెచ్యూరిటీ, పరిపక్వల విషయంలో ఇద్దరికీ ఉన్న తేడా ఇది అంటూ.. మండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనై, కోలుకుని మండలికి వచ్చిన సందర్భంగా లోకేష్ ఆయనను ఆప్యాయంగా పలకరించి,  మా మాస్టారు బొత్స తిరిగి  స‌భ‌కు వ‌చ్చారు, సభలో ఆయనన చూడటం ఎంతో సంతోషంగా  ఉంద‌న్నారు లోకేష్.  ఇటీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి  తీవ్రంగా  ఇబ్బంది  ప‌డ్డారు.  కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్  సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ష‌ర్మిళ.. జ‌గ‌న్ మానసిక పరిస్థితి ప‌ట్ల తనకు సందేహాలున్నాయని షర్మిల అంటారు.   ఏదో సినిమా డైలాగులో ఆయ‌న్ను ఎవ‌రికైనా చూపించండ్రా, అలా వదిలేయకండ్రా అని వైసీపీ శ్రేణులకు సూచించారు.   జ‌గ‌న్ ఎందుక‌ని ఇంత ప‌ర్వ‌ర్టెడ్ గా ఉన్నారు? మంచి చెడులు మ‌ర‌చి వ్యవహరిస్తారు?   చంద్ర‌బాబు వ‌య‌సుతో ఆయ‌న‌కేం ప‌ని? అంటూ పలు సందర్భాలలో ఆయనపై పలువురు విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం రాష్ట్రానికి   అనుభ‌వంతో కూడిన నాయ‌క‌త్వం  అవసరం అని ప్రజలు భావించారు. కనుకనే చంద్రబాబుకు అఘండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు.  ఆ విషయాన్ని పట్టించుకోకుండా జగన్ చంద్రబాబు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరుకు.. లోకేష్ తన పరిణితితో సమాధానమిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కాలం ఎంత విచిత్ర‌మైన‌దంటే.. ఒక‌ప్పుడు మీకు క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేయ‌గ‌ల‌ను అంటూ  అహంకార పూరితంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన జగన్  ఇప్పుడు ఆయనే అదే అసెంబ్లీలో   ప్రతిపక్ష  నేత హోదా లేకుండా నిలిచారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష  హోదా  దక్కలేదు. స‌రిగ్గా  అదే స‌మ‌యంలో ఒక‌ప్పుడు ఈ శాస‌న  మండ‌లి అన్న‌దే వృథా ఖ‌ర్చు,  కాల‌యాప‌న అన్న జ‌గ‌న్ నేడు అదే శాస‌న మండ‌లిని ఆధారం చేసుకుని తన రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారు.  బొత్స‌ను ఎమ్మెల్సీని చేసి,  త‌ద్వారా ఆయనకు మండ‌లి  ప్ర‌తిప‌క్ష  నేత హోదా  క‌ల్పించి, ఇక్క‌డ త‌మ ఉనికి కాపాడుకునే య‌త్నం చేస్తున్నారు జ‌గ‌న్. నాడు  చంద్రబాబుకు ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా  చేస్తాన‌ని బీరాలు పలికిన జ‌గ‌న్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధార‌ణ ఎమ్మెల్యేగా స‌భ‌కు వెళ్ల‌లేక గైర్హాజ‌ర‌వుతున్నారు. ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు.  ఒక్కోసారి  అవ‌స‌రం  తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి  ప‌డ‌వ బోల్తా  ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే  ఉదాహ‌ర‌ణంటున్నారు. 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికలలో వైపీపీకి కేవలం 11 స్థానాలే వచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో ప్ర‌తిప‌క్ష హోదాకు ఉండాల్సిన 18 సీట్ల సంఖ్యా బ‌లం లేక పోవ‌డ‌తో  ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక జగన్ అసెంబ్లీకి కేవలం పులివెందుల ఎమ్మెల్యే హోదాలో మాత్రమే హాజరు కావాల్సిన పరిస్థితి.  అందుకే గైర్హాజరౌతున్నారు అది వేరే సంగతి. అదే శాస‌న మండ‌లిలో మొత్తం 58 సీట్లుండ‌గా.. ప్ర‌స్తుతం 30 సీట్ల‌తో వైసీపీ  బ‌లంగా  ఉంది. దీంతో మండలిలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంది. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టే బిల్లుల‌ను అడ్డుకోవ‌డం, లేదా  చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డే అవ‌కాశం వారికి మండలిలో ల‌భిస్తోంది.    గ‌తంలో ఇదే జ‌గ‌న్ మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని తీర్మానం చేశారు జ‌గ‌న్. ఎందుకంటే అప్పట్లో  అసెంబ్లీలో వైసీకీ భారీ మెజారిటీ ఉన్నా.. మండ‌లిలో మాత్రం లేదు.   అప్ప‌ట్లో టీడీపికి శాస‌న  మండలిలో  మెజారీ ఉండేది. దీంతో  మూడు రాజ‌ధానుల బిల్లు వంటి  కీల‌క నిర్ణ‌యాల‌ను మండ‌లిలో టీడీపీ  అడ్డుకునేది. దీంతో మండ‌లి  వ‌ల్ల ప్ర‌జా ధ‌నం వృధా, కాల‌యాప‌న  అంటూ ఈసడించిన జగన్  ఇప్పుడుఅదే మండలి నుంచి తమ పార్టీ వాయిస్ వినిపించాల్సిన పరిస్థితి వచ్చింది.  ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మేంటంటే..  ఆ తర్వాత మండలిలో వైసీపీకి మెజారిటీ రావడంతో 2021 నాటి రద్దు తీర్మానాన్ని నాటి  జ‌గ‌న్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  అహంకారం ప‌నికిరాదనీ, వ్య‌వ‌స్థ‌ల‌ను అవ‌గాహ‌నారాహిత్యంతో త‌ప్పు ప‌ట్ట‌రాద‌ని.. ఈ   ఉదంతంతో తెలుస్తోంద‌ంటున్నారు పరిశీలకులు.  వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల కనీస గౌర‌వం లేక పోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన ఇబ్బందిగా దీన్ని అభివర్ణిస్తూ..  ఇప్పటికైనా తెలిసివచ్చిందా జగన్? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 
ఇటీవ‌ల   కిర‌ణ్ రాయ‌ల్ వంటి కొంద‌రు ప‌వ‌న్ లేకుంటే తెలుగుదేశం గెలిచే ఛాన్సే లేద‌ని కామెంట్ చేయ‌డం కూట‌మి వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త‌ వచ్చింది. తెలుగుదేశం, జనసేన పార్టీల   సోష‌ల్ మీడియాలో ఒక రకంగా డైలాగ్ వార్.. మాటల యుద్ధం జరిగింది. అంతే కాకుండా కిరణ్ రాయల్ వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈ నేపథ్యంలో కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కూటమి ఐక్యత వల్ల  ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్  విడ‌మ‌ర‌చి చెప్పారు.  వైసీపీ వారు కేవ‌లం 11 మందే ఉన్నా.. వారు 1100 మంది ఉన్న‌ట్టు బిల్డ‌ప్ ఇస్తార‌నీ,  క‌ల్తీ వాళ్లే చేస్తారు, బూతులు వాళ్లే మాట్లాడ‌తారు,  మ‌న‌మేదైనా  ఆన్స‌ర్ ఇస్తే దాన్ని కూడా  బ‌ద‌నాం చేస్తారు.. అదే మ‌నం మ‌నం చేసిన  ప‌ని చెప్పుకోలేక పోవ‌డం చేటు తెస్తోంద‌ని అసెంబ్లీ  వేదిక‌గా  ఆవేద‌న వ్య‌క్తం  చేశారు ఉప ముఖ్య‌మంత్రి  ప‌వ‌న్ క‌ళ్యాణ్. అదే స‌మ‌యంలో గ‌త  విధ్వంస  పాల‌న‌కు ప్ర‌స్తుత పాల‌న‌కూ ఎంతో తేడా ఉంద‌నీ,  ఆర్ధిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ర‌వీంద్రుడి వ‌చ‌నాల‌ను జోడించి ఎంతో గొప్ప‌గా  వినిపించార‌నీ, ఆయ‌న కూట‌మి  పాల‌న‌లో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ధిని కూడా ఎంతో చ‌క్కగా పాంప్లెంట్లు వేసి మ‌రీ వివ‌రించి చెబుతున్నార‌నీ ప‌య్యావుల పనితీరును ప్ర‌సంగించారు. వాళ్లు కోట్ల రూపాయ‌ల అప్పులు మిగిల్చి పోయినా, ఇక్క‌డ మ‌నం ఇంత చేస్తున్నామ‌న్న పవన్ కల్యాణ్  ఈ స‌మ‌యంలో మ‌న ముఖ్య‌మంత్రికి మ‌న‌మంతా అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు.   దీంతో బ‌య‌ట కిర‌ణ్ రాయ‌ల్ వంటి బాధ్య‌త‌లేని కార్య‌క‌ర్త‌ల  ద్వారా ఏర్ప‌డ్డ అగాథాల‌ను పవన్ కల్యాణ్  ఈ ఒక్క మాట‌తో పూడ్చే య‌త్నం చేశారు. ఎవ‌రెన్ని  య‌త్నాలు చేసినా, ఇక్క‌డ కూట‌మి ని ఎవ‌రూ విడ‌దీయ‌లేర‌నీ.. పైపెచ్చు బ‌య‌ట ఎంత‌గా వైసీపీ విజృంభిస్తోంటే.. మ‌న ఐక్య‌త అంత‌గా బ‌ల‌ప‌డాల‌ని త‌న శ్రేణుల‌తో పాటు కూట‌మి  శ్రేణుల‌కు కూడా అసెంబ్లీ  నుంచి ఒక సందేశం ఇచ్చారు పవన్ కల్యాణ్
ALSO ON TELUGUONE N E W S
  -పిటిషన్ లో ఏముంది  -తీర్పు ఎలా వస్తుందంటారు -విజయ్ రియాక్షన్ ఏంటి! ఇళయ దళపతి విజయ్(Vijay),భార్య సంగీత(sangeetha)వ్యవహారంపై స్టిల్ తమిళనాడుతో పాటు తెలుగునాట కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సంగీత నమోదు చేసిన విడాకుల పిటిషన్ లో విజయ్ కి ఒక సినీ నటితో ఉందని  చెప్పడం, సదరు నటి త్రిష అనే పుకార్లు వ్యాపిస్తూ ఉండటం, రీసెంట్ గా త్రిషతో కలిసి విజయ్ ఒక పెళ్ళికి హాజరు కావడంతో అందరి దృష్టి విజయ్ వ్యవహారంపై ఉంది. ఈ క్రమంలో కోర్టులో సంగీత వేసిన మరో పిటిషన్ చర్చల స్థాయిని తీవ్రతరం చేసింది. పిటిషన్ లో ఏముందో చూద్దాం.  సంగీత నమోదు చేసిన పిటిషన్ లో 'విడాకుల కేసు తుది విచారణ ముగిసి, తీర్పు వచ్చే వరకు నేను విజయ్‌ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి కావాలి. లండన్‌ కి చెందిన నేను విజయ్ ఇంట్లోనే ఉండటం కరెక్ట్.  మా లాయర్ ద్వారా ఇంట్లో ఉండటానికి అనుమతి  కోరితే బెదిరింపులకి పాల్పడుతున్నారు. అందుకే పిటిషన్ వేసాను. సినిమాల ద్వారా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బుల్లో తనకి, తన పిల్లలకి రావాల్సిన వాటా కూడా ఇవ్వాలని సదరు పిటిషన్ లో పేర్కొంది.  also read: Ustaad bhagat singh vs dhurandhar 2: అర్ధరాత్రి నుంచే వార్ స్టార్ట్    సంగీత ప్రస్తుతం లండన్ దేశంలోనే ఉంది. విజయ్ ఇల్లు సౌత్ చెన్నై నీలంకరై లోని కపిలేశ్వర్ నగర్ లో  ఉంది. సుమారు 20 ఇయర్స్ బ్యాక్ నుంచే అక్కడ ఉంటున్నాడు. ఇక విడకుల పిటిషన్ కేసులో విజయ్  ఏప్రిల్ 20 న కోర్టులో హాజరు అవ్వాల్సిన విషయం తెలిసిందే.     
సమాజంలో గురువుకు ఉన్న స్థానం అత్యున్నతమైనది. అక్షరాలు నేర్పడమే కాదు, ఒక తరాన్ని, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువుది. కానీ, అదే గురువు తన పదవీ విరమణ తర్వాత, తన సొంత హక్కు అయిన పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తే? తన కళ్ల ముందే పెరిగిన విద్యార్థులు అవినీతి అంచున నిలబడి లంచం అడిగితే? ఆ గురువు మనసు ఎంతలా గాయపడుతుందో తెలిపే హృదయ విదారక కథనం ఇది ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో నటించి రూపొందించిన ‘బ్రోకర్‌’ చిత్రంలోని ఈ సన్నివేశం దేశంలోని పరిస్థితుల్ని చూపిస్తుంది. గొల్లపూడి మారుతీరావు, అర్చన, కీర్తి చావ్లా, శ్రీహరి, ఫ్లోరా శైని ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.  35 ఏళ్ళపాటు నిష్కళంకంగా సేవలందించి, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న ఒక మాస్టారు, తన ఐదేళ్ల పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆయన అడుగుతున్నది కేవలం తన హక్కును మాత్రమే. కానీ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి ఆయన్ని ప్రతి అడుగునా అడ్డుకుంటుంది. ‘గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఇలా లంచాలు తినడం వ్యభిచారం కన్నా మహాపాపం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఐదేళ్లుగా ఇద్దరు ప్రధానులు, ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా, ఆయన ఫైలు మాత్రం కదలడం లేదు. కారణం? ఆయన అధికారుల చేతులు తడపకపోవడమే. ఆ మాస్టారు ఆగస్టు 15, 1947న, అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే పుట్టారు. కానీ తన పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు, ఈ దేశానికి ఇంకా నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఆయనకు అర్థమవుతుంది. ‘రూపాయి విలువ పడిపోవడం లేదు బాబు, ఆ రూపాయి కోసం దిగజారుతున్న మీలాంటి వాళ్ల విలువ పడిపోతోంది” అని ఆయన చెప్పే మాటలు నేటి సమాజానికి చెంపపెట్టు. చచ్చినా ఒక్క రూపాయి లంచం ఇవ్వనని, తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని ఆయన తెగేసి చెప్తారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తన సొంత విద్యార్థే ‘సహాయం’ చేస్తానంటూ లంచంతో పని ముగించాలని చూడటం. ఇది ఆ మాస్టారి ఆత్మగౌరవానికి తగిలిన పెద్ద గాయం. విలువలను పాటించాలని జీవితాంతం నేర్పిన గురువే ఆ విలువలను తప్పితే, ఇక విలువలకే విలువ ఏముంటుందని ఆయన ప్రశ్నిస్తారు. అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ఉన్నా, ఆ వయసులో శక్తి లేక, యువత పట్టించుకోకపోవడం చూసి ఆయన కుమిలిపోతారు. ‘అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది’ అని ఆయన భావించడం మన వ్యవస్థలోని వైఫల్యానికి నిదర్శనం. ఈ కథ కేవలం ఒక ఉపాధ్యాయుడి పెన్షన్ సమస్య మాత్రమే కాదు. ఇది మన సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిపై ఒక హెచ్చరిక. నిజాయితీ పరులు కూడా ఉన్నారని నిరూపించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉంది. వ్యవస్థ మారాలంటే మన ఆలోచనలు మారాలి. విలువల కోసం ప్రాణాలైనా ఇచ్చే అటువంటి గురువుల ఆశయాలను గౌరవించడం మనందరి బాధ్యత. ఇంత మంచి సందేశంతో కూడిన ఈ వీడియోను చూడండి. ఆలోచించండి. చైతన్యపూరితమైన ఇలాంటి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
  -ధురంధర్ పార్ట్ 2 ట్రైలర్ వచ్చేసింది  -ఉస్తాద్ పరిస్థితి ఏంటి! -18 అర్ధరాత్రి నుంచే వార్ ఖాయమా!   భారతీయ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2).ఈ నెల 19 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 లో 'రెహ్మాన్ డెకాయత్' ని మన దేశపు 'రా' ఏజెంట్ హోదాలో హంజా అలీ మజారి అలియాస్ 'జస్కి రత్ సింగ్ రంగి' చంపడంతో పార్ట్ 2 పై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్ళు కథని అల్లుకుంటు కోటి ఆశలతో ఎదురుచూస్తూ వస్తున్నారు. వాళ్ళ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెడుతు   అంచనాలని పెంచుకునేలా ఈ రోజు ధురంధర్ 2 ట్రైలర్ వచ్చేసింది. రావడమే కాదు తెలుగు ప్రేక్షకుల్లో సరికొత్త అనుమానాలకి, చర్చలకి తావు ఇచ్చింది. విషయమేంటో చూద్దాం. సుమారు మూడు నిమిషాల పద్దెనిమిది సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది. ఐదు గంటల్లోనే వచ్చిన  9 . 5 మిలియన్స్ వ్యూస్ రేంజ్ స్థాయికి ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగులో కూడా ధురంధర్ 2 విడుదలవుతున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ధురంధర్ 2 vs ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)అనే డైలాగ్ ఫుల్ స్వింగ్ మోడ్ లో వెళ్తుంది. నిజానికి   ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ 26 నుంచి 19 కి మారినప్పుడు పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు  ధురంధర్ ట్రైలర్ రిలీజైన దగ్గర్నుంచి ఉస్తాద్ vs ధురంధర్ వర్డ్  బాగానే రన్ అవుతుంది. కొంత మంది ధురంధర్ 2  ప్రభావం తెలుగులో పెద్దగా ఏముంటుందిలే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ అలా అనుకోవడం పొరపాటే అవుతుంది.  also read: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి.. వధువు కావ్య రెడ్డి ఎవరో తెలుసా! ధురంధర్ మొదటి భాగం తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వకపోయినా హిందీ వెర్షన్ ని మెజారిటీ తెలుగు ప్రేక్షకులందరు చూసారు. భారీ స్థాయి కలెక్షన్స్ కూడా రావడంతో పాటు ధురంధర్ సబ్జెట్  గురించి చర్చలు కూడా జరిగాయి. మరి ఈ లెక్కన ధురంధర్ 2  తెలుగులో కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. 18 నుంచే ప్రీమియర్ షోస్ ఉన్నాయని కూడా అనౌన్స్ చెయ్యడంతో ఉస్తాద్ vs  ధురంధర్ 2 మధ్య పోటీ ఖాయమని సినీ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. పైగా పోటీ అనేది అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు సినిమాకి కల్పించిన హక్కు . ఉస్తాద్ హంగామ కూడా ప్రీమియర్స్ తో షురు కానున్న విషయం తెలిసిందే. ఇక ధురంధర్ తెలుగు ట్రైలర్ ఈ సాయంత్రానికి ప్రత్యక్షమవ్వడం ఖాయం.    
- డాక్యుమెంటరీ తీర్చిదిద్దిన విధానంపై ప్రశంసలు కురిపించిన జ్యూరీ సభ్యులు - యూనిటీ డాక్యుమెంటరీని నిర్మించిన దర్శక నిర్మాతలకు అభినందనల వెల్లువ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపితగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీపై యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ రూపొందించిన యూనిటీ. ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఉప శీర్షిక.  చిరందాస్ శ్రీకాంత్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో సముచితమైన స్థానం దక్కింది. 2025 సంవత్సరానికి గాను వెల్లడించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లోని డాక్యుమెంటరీ విభాగంలో తొలి ఉత్తమ డాక్యుమెంటరీగా గద్దర్ అవార్డును సొంతం చేసుకుంది. డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ కు జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న ప్రముఖ దర్శకులు విజయ్ కనకమేడల ఎఫ్ డీసీ కార్యాలయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ.... తెలంగాణ సమాజానికి మరో గాంధీ ఎలా అయ్యాడనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా పెద్దల నుంచి పాఠశాల విద్యార్థులకు సైతం సులభంగా అర్థమయ్యేలా యూనిటీ డాక్యుమెంటరీని విజయ్ కుమార్ చిత్రీకరించారు. మైమ్ మధు, బాలనటుడు భాను ప్రధాన పాత్రలు పోషిస్తూ బాపూజీ కథను వివరించారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ లో ఇలా వినూత్నమైన పద్దతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ బాల్యం నుంచి మరణం వరకు, ఆ తర్వాత తెలంగాణ సాధన వరకు ప్రతి విషయాన్ని ఎంతో స్పష్టంగా చిత్రీకరించడం పట్ల జ్యూరీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. నాణ్యమైన విజువల్స్, స్పష్టమైన వాయిస్ ఓవర్, చక్కని ఎడిటింగ్ తో ప్రేక్షకులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సుమారు అరగంటపాటు యూనిటీ డాక్యుమెంటరీని తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే యూనిటీ డాక్యుమెంటరీ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూడా శభాష్ అనిపించుకొని అవార్డులు అందుకుంది. 2025లో దిల్లీలో జరిగిన 15వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోగా.... ముంబయిలో జరిగిన భారత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023లో యూనిటీ డాక్యుమెంటరీకి రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్ హిస్టారికల్ డాక్యుమెంట్ ఫిల్మ్, ఐకానిక్ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డును యూనిటీ (UNITY) సొంతం చేసుకుంది. ఇలా... ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న UNITY డాక్యుమెంటరీ ఫిల్మ్ ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి గద్దర్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల దర్శకుడు విజయ్ కుమార్, నిర్మాత శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పరితపించిన మహోన్నత శిఖరం లాంటి వ్యక్తి చరిత్రను గుర్తించి ప్రోత్సహించడం కొండా లక్ష్మణ్ బాపూజీ పట్ల ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను చాటుకుందని తెలిపారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ ఛైర్మన్ విజయ్ కనకమేడల, జ్యూరీ సభ్యులకు దర్శకుడు విజయ్, నిర్మాత శ్రీకాంత్ తోపాటు అందులో నటించిన మైమ్ మధు, బాలనటుడు  మాస్టర్ భాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. అందులో భాగంగా పవన్‌కళ్యాణ్ తన వెర్షన్ డబ్బింగ్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించి అధికారికంగా పెట్టిన పోస్ట్ ఇప్ప్పుడు వైరల్‌గా మారుతోంది. డబ్బింగ్ చెప్తున్న పవన్‌కళ్యాణ్ పక్కన దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు థమన్ ఉన్నారు.  శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని హరీష్ శంకర్ పర్యవేక్షిస్తున్నారు. మరో పక్క థమన్ మరోసారి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ పవర్‌ఫుల్ స్కోర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక సర్‌ప్రైజ్‌ను ఈరోజు రివీల్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏది ఏమైనా ఎంతోకాలంగా పవర్‌స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉగాదికి థియేటర్లలో కలెక్షన్ల సునామీ సష్టించేందుకు సిద్ధమవుతోంది.  ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ ఎలాంటి సంచలనాలు సష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్ప్పుడు ఆ చిత్రాన్ని మించే స్థాయిలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉందనే ప్రచారం జరుగుతోంది. 
సినీ తారల ఇళ్లల్లో పెళ్లిళ్ల హడావిడి  పెళ్లి పీటలు ఎక్కబోతున్న సాయి శ్రీనివాస్  ఆదివారం ఎంగేజ్మెంట్! నిర్మాత కొడుకు హీరోగా సక్సెస్ కావడమనే విషయంలో తెలుగు సినిమాకి జరిగిన అన్యాయం పాళ్ళు ఎక్కువే. కానీ ఆ అపవాదుని చెరిపేసిన ఇద్దరు, ముగ్గురు హీరోల్లో 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్'(Bellamkonda sai Sreenivas)ఒకడు. హిట్టు ప్లాప్ లు సమానంగా పలరిస్తున్నా తను మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా సాయిశ్రీనివాస్ పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాని ఊపిరి సలపనంత బిజీగా చేస్తున్నాయి. మరి మనం కూడా కాసేపు పూర్తి న్యూస్ తో బిజీ అవుదాం. సాయిశ్రీనివాస్ ఫియాన్సీ పేరు కావ్య రెడ్డి.. హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. తండ్రి లాయర్ కాగా తాత జడ్జి. రేపు( మార్చి 7 ) సాయి శ్రీనివాస్, కావ్య ల  ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారు. అయితే నిశ్చితార్థం విషయంపై అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఏది ఏమైనా మొత్తానికి తెలుగు సినిమా తన వారసుల్నిఒక ఇంటివాళ్ళని చేస్తూ పెళ్లిళ్ల సీజన్ మాలో కూడా ఉంటుందని చెప్తుంది.  also read: Pawan Kalyan: వాళ్ళని కాపాడుతున్నాడా!.. ప్రముఖ నిర్మాత మాటలు వైరల్  సాయి శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే హైందవ, టైసన్ నాయుడు అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లకొండ సురేష్(Bellamkonda Suresh)గత మూడు దశాబ్దాలపై నుంచి చిత్ర సీమలో ఉంటు అగ్ర నిర్మాత హోదాలో ఎన్నో సూపర్ హిట్స్ నిర్మించాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. కానీ రెస్ట్ కి గుడ్ బై చెప్పి నిర్మాతగా మళ్ళీ బిజీ అవుతానని ఇటీవల చెప్పాడు.   
టాలీవుడ్‌కి ఎంత మంది హీరోలు వచ్చినా మెగాస్టార్ చిరంజీవి స్థానం మాత్రం ఎంతో ప్రత్యేకం. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో చిరంజీవి సాధించిన విజయాలు ఎన్నో. ప్రేక్షకుల అభిమానం అంతకు మించి ఉంటుంది. తన కెరీర్‌లో అన్నిరకాల పాత్రలు పోషించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు.  తాజాగా ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు మెగాస్టార్ ఖాతాలోకి వచ్చి చేరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స2025లో భాగంగా మెగాస్టార్‌కు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ప్రకటించడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. మెగాస్టార్ ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తిగా నిలిచి కొత్త హీరోలు ఇండస్ట్రీకి రావడానికి కారణమయ్యారు. 1978లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మెగాస్టార్ నటుడిగానే కాదు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.  తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును కూడా ప్రకటిస్తూ చిరంజీవిని ఆ అవార్డుకు ఎంపిక చేయడం అందరికీ సంతోషాన్ని కలిగించే విషయం. చిరంజీవికి ఈ అవార్డు దక్కడంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవికి ఎన్నో అవార్డులు లభించాయి. ఇప్ప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు ఆయన ఖాతాలో చేరింది. 
    -ప్రస్తుత తెలుగు సినిమా పరిస్థితి ఏంటి  -ఎందుకు వెలవెలబోతున్నాయి  -పరిష్కారం ఏంటి! ఎగ్జామ్స్ సీజన్ వచ్చేసింది. స్టూడెంట్స్ అందరు ఎంతో టెన్షన్ తో ఎగ్జామ్స్ మూడ్ లో ఉన్నారు. కానీ  ఈ నెల 19 న విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ పార్ట్ 2 పై కూడా ఒక లుక్ వేశారు. ఎలా ఉండబోతున్నాయన్న టెన్షన్ కూడా వాళ్లల్లో ఉంది. అదేంటి పరీక్షలపై ఫోకస్ చేయండని ఎవరైనా చెప్పినా, అక్కడ ఉంది ఎలాంటి సినిమాలు దేని తోవ దానిదే అంటున్నారు. దీన్ని బట్టి ఉస్తాద్, ధురంధర్ 2 పై ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ చిత్రాలపై కొన్ని బాధ్యతలు కూడా నెలకొని కొన్నాయని ప్రముఖ  నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ (Nattikumar)మా తెలుగు వన్ సినిమా(Telugu One Cinema)ఛానల్ కి  చెప్తున్నాడు. ఆ మాటలు చూద్దాం. ఆయన మాట్లాడుతు ప్రస్తుతం చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత థియేటర్లలో సందడి చేసే సరైన సినిమా రాలేదు. దాదాపు 50 రోజులుగా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల షోలు పడక సెంటర్లు మూసివేసే పరిస్థితి వచ్చింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తాము తెచ్చిన అప్పులకి  వడ్డీలు కట్టలేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. కేవలం ఒక్క హిట్ తో మొత్తం ఇండస్ట్రీని నడపడం సాధ్యం కాదు. అలాంటి హిట్ లతో  కనీసం నాలుగైదు సినిమాలు నిరంతరం రన్నింగ్‌లో ఉండాలి.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం యొక్కఉద్రిక్తతలు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా 'టాక్సిక్' (Toxic) 'దురందర్ 2' (Dhurandhar 2) వంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఓవర్సీస్ మార్కెట్. హిందీ సినిమాలకు మరియు పాన్-ఇండియా చిత్రాలకు అమెరికా, గల్ఫ్ దేశాలు, జర్మనీ మరియు బ్రిటన్ వంటి దేశాల నుండి వచ్చే వసూళ్లు చాలా ముఖ్యం. అక్కడ పరిస్థితులు సజావుగా లేకపోవడంతో, భారీ బడ్జెట్ చిత్రాలు వెనక్కి తగ్గుతున్నాయి. . దీంతో అందరి దృష్టి 'ఉస్తాద్ భగత్ సింగ్'(ustaad Bhagatsingh)పైనే ఉంది. పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారి సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ వల్ల వచ్చే నష్టం తక్కువగానే ఉండవచ్చు, ఎందుకంటే ఆయన సినిమాలకి మన లోకల్ మార్కెట్ చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాను త్వరగా లేదా అనుకున్న సమయానికి తీసుకురావాలని ఎగ్జిబిటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఉగాది వంటి పెద్ద పండుగ సమయంలో సినిమా వస్తే థియేటర్లకు మళ్ళీ కళ వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. also read: mrithyunjay vs  sampradayini suppini suddapoosani: తొలి రోజు కలెక్షన్స్ ఇవే  కానీ ఒకేసారి  5000 థియేటర్లలో వేస్తే, ప్రేక్షకులందరూ మొదటి రోజే చూసేస్తారు. దీనివల్ల రెండో రోజు నుండి కలెక్షన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది, అందుకే ప్లానింగ్ ప్రకారం థియేటర్లని కేటాయించడం ముఖ్యమని నట్టి కుమార్ చెప్తున్నారు. ఆయన చెప్పినట్టుగానే తెలుగు ప్రేక్షకులకి సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. కానీ గత కొన్నాళ్లుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. సరైన సినిమాలు లేక, ప్రేక్షకులు రాక ఎగ్జిబిటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ తరుణంలో సినిమా కష్టాలు: 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లకి పూర్వవైభవం తీసుకురావాలని ఆశిద్దాం.  ఇక నట్టి కుమార్ ఏ ముహూర్తాన కోరుకున్నాడో కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 26 నుంచి ఈ నెల 19 కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లు ఉగాది శోభతో  కళకళలాడనున్నాయి. ఆయన భయపడినట్టుగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో టాక్సిక్ వాయిదా పడింది. ధురంధర్ 2 మాత్రం యధావిధిగా వస్తుంది. మరిన్ని ఆసక్తికర  అప్డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా(Telugu One cinema) యూట్యూబ్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
    నిన్న థియేటర్స్ లో మరో మారు సినీ సందడి  నాలుగు చిత్రాలకి టాక్ పర్లేదు మరి కలెక్షన్స్ ఎంత! సిటీకి ఎంతో మంది పోలీస్ కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ చంటి గాడు లోకల్ అనే సినీ డైలాగ్ ఎంత ఫేమస్సో తెలిసిందే. అదే రీతిలో ప్రతి సంవత్సరం ఎన్నో పండగలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ సినీ పండగ మాత్రం ప్రతి శుక్రవారం ఉంటుందన్నట్టుగా నిన్న మృత్యుంజయ్(Mrithyunjay),ఎస్. సరస్వతి(S Saraswathi),మెన్షన్ హౌస్ మల్లేష్(Mension House mallesh),సాంప్రదాయినీ, సుప్పిని, సుద్దపూసిని(sampradayini suppini suddaposani)చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఈ చిత్రాలు తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ సాధించాయో చూద్దాం.   మృత్యుంజయ్ చూసుకుంటే కోటి రూపాయల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. శ్రీ విష్ణు(Sreevishnu)నుంచి గత వారమే వచ్చిన మరో మూవీ విష్ణు విన్యాసం తొలి రోజు రెండు కోట్ల నెట్ ని సాధించింది. శివాజీ, లయల సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసిని తొలి రోజు 0 .20 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా టాక్. మెన్షన్ హౌస్ మల్లేష్ 0 .65 కోట్ల గ్రాస్ అని చెప్తున్నారు. సరస్వతి కలెక్షన్స్ వివరాలు రాలేదు. ద్వీబాషా చిత్రం కావడమే ఇందుకు కారణం.  also read: s.saraswathi: వైరల్ గా నిలిచిన సరస్వతి.. ఆ లెజండ్రీ కథతో తెరకెక్కిందా! ఇక ఈ నాలుగు చిత్రాలు దేనికవే డిఫరెంట్ సబ్జెట్స్ తో తెరకెక్కడం జరిగింది. టాక్ కూడా అన్నిటికి  పర్వాలేదనే స్థాయిలో వస్తుండంతో పాటు మీ అభిమాన నటులు తమ పెర్ ఫార్మెన్స్ తో  కనువిందు చేస్తున్నారు. థియేటర్ కి వెళ్లి చూసి ఆనందించండి. ఈ నాలుగు చిత్రాల రివ్యూస్ మా తెలుగు వన్ సినిమా సైట్ లో ఉంచడం జరిగింది.    
తెలుగు వెండితెరపై అత్తాకోడళ్ల మధ్య సాగే పోరాటాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ‘అబ్బాయిగారు’ సినిమాలో అత్తాకోడళ్ల మధ్య జరిగే డ్రామా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. జయచిత్ర, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నూతన్‌ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆ సినిమాలోని ఒక పవర్‌ఫుల్ ఎపిసోడ్‌లోని విశేషాల గురించి తెలుసుకుందాం. కుటుంబ బంధాలలో ప్రేమ ఎంత ఉంటుందో, కొన్నిసార్లు ఆస్తి కోసం లేదా అహంతో చేసే కుట్రలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఈ కథలో అత్తగారు తన కోడలిని కొడుకు నుంచి విడదీయడానికి ఆడిన ఒక తెలివైన నాటకం మరెవరినైనా భయపెట్టేలా ఉంటుంది. తన కొడుకు జాతకంలో పెద్ద దోషం ఉందని, 28 ఏళ్లు వచ్చే వరకు భార్యతో కాపురం చేస్తే ప్రాణగండం పొంచి ఉందని అత్తగారు కోడలికి చెబుతుంది. అలాంటి సందర్భం వస్తే తన తాళిబొట్టు కాపాడుకోవడం కోసం ఏ భార్య అయినా భర్తకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడ కోడలు కూడా అలాగే భావించి తన భర్తను దూరం పెడుతుంది. అయితే ఈ నాటకం వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరు. కొడుకును, కోడలిని విడదీసి, ఆస్తిని కాజేయాల నేది ఆ అత్తగారి పన్నాగం. అత్తగారు ఆడుతున్నది నాటకమని, ఆమె నాగదేవత కాదు నాగుపాము అని మామ‌గారి ద్వారా కోడలు తెలుసుకుంటుంది. తన అత్తగారి అసలు రంగు బయటపడటంతో, ఆమెపై తిరిగి అదే రీతిలో యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకుంటుంది. అత్తగారు ఆడిన ఆటతోనే ఆమెను ఓడించడానికి కోడలు సిద్ధమవుతుంది. కోడలు కేవలం బాధపడటంతో ఆగిపోలేదు. ‘టిట్ ఫర్ టాట్‌’ అన్నట్లుగా అత్తగారి ఎత్తుగడలను చిత్తు చేస్తుంది. అత్తగారు తన కొడుకును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికి సిద్ధమైనట్లు నటించగా, కోడలు కూడా తనదైన శైలిలో అత్తగారి ప్రాణాలకు గండం ఉందని చెప్పి, అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ క్రమంలో జరిగే సంభాషణలు ప్రేక్షకులలో నవ్వును, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. జయచిత్ర, మీనా అత్తా కోడళ్లుగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీకు అందిస్తున్నాం. చూసి ఆనందించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
బట్టతల మరియు జుట్టు రాలడం :  కారణాలు నివారణలు  ఆధునిక చికిత్సలు జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన అందానికి మరియు ఆత్మవిశ్వాసానికి చిహ్నం. అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు పలచబడటం గమనిస్తే కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే బట్టతల సమస్య, నేడు మారుతున్న జీవనశైలి వల్ల 13-14 ఏళ్ల చిన్న వయసులోనే మొదలవుతోంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని అరికట్టడం సాధ్యమేనా?  Dr. Sunaina Shaik చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం జుట్టుపై ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) • ముందస్తు గుర్తింపు (Early Diagnosis): జుట్టు పూర్తిగా ఊడిపోయిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందుల ద్వారా జుట్టును కాపాడుకోవచ్చు. • ఆత్మవిశ్వాసం: జుట్టు రాలడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల మనల్ని మనం ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. • మెరుగైన ఫలితాలు: జుట్టు పల్చబడే దశలో (Hair Thinning) చికిత్స ప్రారంభిస్తే, ఉన్న జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) • సొంత వైద్యం వద్దు: డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మినాక్సిడిల్ (Minoxidil) వంటి మందులను వాడకూడదు. • గర్భధారణ సమయంలో జాగ్రత్త: గర్భం దాల్చిన వారు లేదా ప్లాన్ చేస్తున్న వారు మినాక్సిడిల్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. • అతిగా ఆశించవద్దు: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ద్వారా గతంలో ఉన్నంత సహజమైన సాంద్రత (Density) రాకపోవచ్చు; ఇది కేవలం పలచబడిన ప్రాంతాన్ని కవర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. • ఒత్తిడిని నిర్లక్ష్యం చేయకండి: ఆధునిక పరిశోధనల ప్రకారం, ఒత్తిడి (Stress) అనేది బట్టతలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతోంది. జుట్టును ఎలా కాపాడుకోవాలి? (How to - Treatment Steps) 1. కారణాన్ని గుర్తించండి: పురుషులలో వచ్చే బట్టతలను 'ఆండ్రోజెనెటిక్ అలోపేసియా' అంటారు, ఇది ఎక్కువగా జన్యుపరంగా వస్తుంది. మహిళల్లో జుట్టు మధ్యలో పలచబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. వైద్య చికిత్సలు:     ◦ మినాక్సిడిల్: ఇది సీరం, లోషన్, ఫోమ్ లేదా టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ◦ PRP మరియు GFC: ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP) మరియు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (GFC) చికిత్సల ద్వారా మీ స్వంత రక్తం నుండి తీసిన పోషకాలను తలకు ఇంజెక్ట్ చేసి జుట్టు సాంద్రతను పెంచుతారు. ◦ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్: జుట్టు పూర్తిగా ఊడిపోయిన చోట వేరే ప్రాంతం నుండి జుట్టును తీసి నాటుతారు. 3. సప్లిమెంట్స్: డాక్టర్ సూచన మేరకు అవసరమైన విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: బట్టతల అనేది కేవలం జన్యుపరంగానే వస్తుందా?  జ: పురుషులలో ఇది ప్రధానంగా జన్యుపరంగా వస్తుంది. కానీ మహిళల్లో జన్యువులతో పాటు హార్మోన్ల మార్పులు మరియు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. ప్ర: PRP చికిత్సతో కొత్త జుట్టు వస్తుందా?  జ: లేదు. PRP లేదా GFC చికిత్సలు ఉన్న జుట్టును ఒత్తుగా (Thickening) చేయడానికి మరియు రాలకుండా ఆపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. జుట్టు లేని చోట కొత్తగా జుట్టు రావాలంటే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఒక్కటే మార్గం. ప్ర: శరీరంలోని ఇతర భాగాల నుండి జుట్టును తీసి తలకు వాడవచ్చా?  జ: అవును, చాతి లేదా గడ్డం వంటి భాగాల నుండి జుట్టును తీసి ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చు. కానీ తలపై ఉన్న జుట్టు ఇచ్చినంత సహజమైన ఫలితాలు వీటితో రాకపోవచ్చు. జుట్టు రాలడం అనేది ఒక సమస్యే కావచ్చు, కానీ సరైన సమయంలో స్పందిస్తే దానికి పరిష్కారం తప్పక ఉంటుంది. భయపడకుండా నిపుణులైన డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానెల్ సందర్శించండి: జుట్టు సంరక్షణ మరియు మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
బిజీగా గడిపిన తర్వాత పురుషుల కంటే మహిళలు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చాలామంది మగాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ మాత్రం ఆడవారి పరిస్థితి నిజమేనని చెబుతోంది.   సైన్స్ కూడా మహిళలు  పురుషుల కంటే ఎక్కువ  అలసిపోతారని,  వారికి ఎక్కువ నిద్ర అవసరమని చెబుతోంది.  ఇది కేవలం సోమరితనం లేదా విశ్రాంతి తీసుకోవడానికి చెబుతున్న విషయం కాదని, దాని వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో అర్థం తెలుసుకుంటే..   మల్టీ టాస్కింగ్..  మెదడు సంక్లిష్టత.. నిద్ర యొక్క అతి ముఖ్యమైన విధి మెదడును బాగుచేయడానికి,  తిరిగి శక్తిని  నింపడానికి సమయం కేటాయించడం. పరిశోధన ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తారు.  ఇల్లు, పిల్లలు, ఉద్యోగం,  భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒకేసారి ఆలోచిస్తారు. మెదడును  తీవ్రంగా,  ఎక్కువ కాలం ఇలా ఆలోచించినప్పుడు, అది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మహిళల మెదళ్ళు రోజంతా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. కాబట్టి వారికి మరింత గాఢ నిద్ర అవసరం అవుతుంది. హార్మోన్ల మార్పులు.. జీవితంలోని వివిధ దశలలో మహిళల శరీరాలు గణనీయమైన హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. ఋతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్  వంటి సమయాలలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. గర్భం.. గర్బం దాల్చిన కాలంలో శరీర బరువు పెరగడం,  శారీరక మార్పులు అలసటను పెంచుతాయి. మెనోపాజ్.  మెనోపాజ్  దశలో వేడి ఆవిర్లు,  చెమటలు పట్టడం వంటి సమస్యలు తరచుగా నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.  దీని కారణంగా శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. అందుకే ఎక్కువగా నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. నిద్ర నాణ్యత.. పురుషుల కంటే స్త్రీల నిద్ర తక్కువగా ఉంటుంది. ఇంట్లో శబ్దాలు, పిల్లలు ఏడుపు లేదా ఏదైనా చిన్న కదలికలకు కూడా వారు తొందరగా మేల్కొంటారు. ఇంకా మహిళలు నిద్రలేమి,  రెస్ట్‌లెస్ కాళ్ల సిండ్రోమ్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. తరచుగా నిద్ర అంతరాయాల కారణంగా, శరీర మరమ్మత్తుకు అవసరమైన గాఢ నిద్ర వారికి లభించదు. అందువల్ల  ఉదయం మేల్కొనేటప్పుడు అలసటగా,  ఇంకాసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం,  ఒత్తిడి.. సామాజిక,  కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు తరచుగా ఎక్కువ మానసిక ఒత్తిడి,  ఆందోళనను అనుభవిస్తారు. ఒత్తిడి నేరుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. తగినంత నిద్ర లేకపోవడం ఈ ఒత్తిడిని మరింత పెంచుతుంది, ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది. బాగా నిద్రపోవడానికి ఏమి చేయాలి? మహిళలకు నిద్ర లేకపోవడం అలసటను మాత్రమే కాదు..  గుండె జబ్బులు, ఆందోళన,  నిరాశ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. పడుకోవడానికి, మేల్కొనడానికి ఒక సమయాన్ని నిర్థేశించుకోవాలి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్,  ల్యాప్‌టాప్ వాడటం మానేయాలి. మధ్యాహ్నం తర్వాత టీ, కాఫీ తాగకూడదు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
                           ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక పండ్లలో కొన్ని మనకు తెలియని రహస్యాలను దాచుకుంటాయి. అలాంటి ఒక అరుదైన మరియు శక్తివంతమైన పండే 'బిహి' (Behi). దీనిని ఇంగ్లీష్‌ లో 'క్విన్స్' (Quince) అని, సంస్కృతంలో 'అమృతఫల' అని, తెలుగులో 'సీమ దానిమ్మ' అని పిలుస్తారు. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండు, పర్షియా (నేటి ఇరాన్) నుండి గ్రీస్, రోమ్ మరియు మధ్యప్రాచ్య దేశాలకు వ్యాపించింది. ప్రాచీన గ్రీకులు దీనిని 'ప్రేమ మరియు సంతాన సాఫల్యతకు' (Love and Fertility) చిహ్నంగా భావించేవారు. ఈ రోజు మనం ఈ 'బంగారు ఆపిల్' వంటి బిహి పండు విశిష్టతలను గురించి Dr SGV Satya (Unani Specialist) ఈ Video లింక్ క్లిక్ చేసి వివరంగా తెలుసుకుందాం. మనం ఈ పండును ఎందుకు తీసుకోవాలి? (Why should we?)  బిహి పండు కేవలం రుచికరమైనదే కాదు, ఇది ఒక పోషకాల గని. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడానికి గల ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయి: సంతాన సాఫల్యత మరియు పురుషుల ఆరోగ్యం: మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ను (Sperm Count) అమాంతం పెంచే అద్భుత గుణం దీనికి ఉంది. అందుకే పురాతన కాలంలో పెళ్లికూతుళ్లకు పెళ్లికి ముందు దీనిని ఇచ్చే ఆనవాయితీ ఉండేది. బరువు తగ్గడానికి మరియు మధుమేహానికి: ఇది తక్కువ క్యాలరీలు ఉండి, పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్. బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిక్ పేషెంట్లు, థైరాయిడ్ మరియు క్యాన్సర్ రోగులు కూడా దీనిని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుదల: ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం (Constipation) మరియు అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం: పొటాషియం, కాపర్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును (BP) అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి (Immunity): కరోనా సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన 'జోషాంద' (Joshanda) కాడాలో బిహి గింజలను (Behi Dana) ఒక ముఖ్యమైన ఇంగ్రిడియంట్‌గా వాడారు. ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడి బాడీని స్ట్రెంథన్ చేస్తుంది. ఎలా ఉపయోగించాలి? (How to use?) బిహి పండు నేరుగా తినడానికి చాలా పుల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని ఈ క్రింది పద్ధతుల్లో తీసుకోవచ్చు: మురబ్బా (Murabba): ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. బిహి మురబ్బా ఏ యునానీ మందుల షాపులోనైనా దొరుకుతుంది. తేనెతో కలిపి: డయాబెటిక్ పేషెంట్లు పంచదార పాకంలో చేసిన మురబ్బా కాకుండా, తేనెతో చేసిన దానిని ఎంచుకోవాలి. జెల్లీలు మరియు షర్బత్‌లు: దీనితో జెల్లీలు, జామ్‌లు లేదా 'షర్బతే బిహి' వంటి పానీయాలు తయారు చేసుకోవచ్చు. వంటల్లో: గ్రీస్ వంటి దేశాల్లో దీనిని నిమ్మరసంతో కలిపి ఉడికించి వంటల్లో వాడుతుంటారు. ఏమి చేయకూడదు? (What NOT to do?) ఈ పండు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి: నేరుగా ఎక్కువగా తినకండి: ఇది చాలా పుల్లగా ఉండటం వల్ల నేరుగా పండును ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహ రోగులు జాగ్రత్త: బయట దొరికే మురబ్బాలలో షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేదా తాటి బెల్లంతో ఇంట్లోనే తయారు చేసుకున్న మురబ్బాను వాడటం శ్రేయస్కరం. అపరిమితంగా వద్దు: ఇది మన దేశీయ పండు కాదు కాబట్టి, రోజుకు ఒక చిన్న టీస్పూన్ మురబ్బా తీసుకుంటే సరిపోతుంది. అతిగా తీసుకోకూడదు. ప్రశ్నోత్తరాలు (Q&A): ప్రశ్న: బిహి పండు కేవలం మగవారికి మాత్రమే ఉపయోగపడుతుందా? సమాధానం: లేదు, ఇది అందరికీ ఆరోగ్యకరమైనది. అయితే పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఇది విశేషంగా పనిచేస్తుంది. ప్రశ్న: ఇది మార్కెట్‌లో దొరుకుతుందా? సమాధానం: పండు దొరకడం కష్టమైనా, 'బిహి మురబ్బా' రూపంలో యునానీ స్టోర్లలో సులభంగా లభిస్తుంది. ప్రశ్న: పిల్లలకు ఇది ఇవ్వవచ్చా? సమాధానం: అవును, రోగనిరోధక శక్తి పెంచడానికి తక్కువ మోతాదులో మురబ్బాను ఇవ్వవచ్చు. పురాతన కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న ఈ బిహి పండు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. ముఖ్యంగా నేటి కాలంలో ఎదుర్కొంటున్న సంతాన సమస్యలకు మరియు ఇమ్యూనిటీ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. ప్రకృతి ఇచ్చిన ఈ 'అమృతఫలాన్ని' సరైన పద్ధతిలో తీసుకుని ఆరోగ్యంగా ఉందాం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన పండ్ల గురించి వివరంగా తెలుసుకోవడానికి మా  TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.