తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.   అయితే,   సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా  కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే     అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి   కేబినెట్ హోదా  ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.   కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ..  కొండా సురేఖ   పార్టీ నాయకత్వంపై  దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం.  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా..  తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    [Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post,  RTC Chairman, Revanth Reddy, Telugu One]
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..! తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు  ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు.  నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు.  అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.       [ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress,  BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.       [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]  
ALSO ON TELUGUONE N E W S
  నువ్వు ఏ జోనర్ చెప్తున్నావనేది ముఖ్యం కాదు, ప్రేక్షకులకి నచ్చే విధంగా కంటెంట్ ఉందా లేదా అనేదే ముఖ్యం. ఇదే రీతిలో ఒకప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే  భారీ బడ్జెట్, టాప్ స్టార్ కాంబినేషన్, అంగరంగ వైభవంగా చేసే ప్రమోషన్లు మాత్రమే సరిపోయేవి. కానీ నేడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది.  స్టార్ పవర్ ఎంత ఉన్నప్పటికీ, కంటెంట్ లో దమ్ము లేకపోతే, 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొడుతున్నాయి. కానీ కేవలం  2 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఆధ్యాత్మిక సినిమాలు 260 కోట్లకి పైగా వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన 'టాక్సిక్', 'హనుమాన్ అంశ' చిత్రాల బాక్సాఫీస్ ప్రయాణమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఈ మధ్య కాలంలో అత్యంత భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్ యష్  'టాక్సిక్' భారీ ఓపెనింగ్స్‌ సాధించినప్పటికీ రన్నింగ్ లో నిలదొక్కుకోలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం కంటెంట్.   కథనంలో లోపాలు, స్లో పేసింగ్, మితిమీరిన హింస, రొమాన్స్  కారణంగా ప్రేక్షకుల నుండి తీవ్ర ప్రతికూల స్పందన ఎదురైంది. ఫలితంగా కేవలం 18 రోజుల్లో ఈ ప్రపంచవ్యాప్తంగా  340.75 కోట్ల గ్రాస్ మార్కు దగ్గరే ఆగిపోయింది. మూడో వారానికి వచ్చేసరికి అయితే  రోజువారీ వసూళ్లు 25 లక్షలకి  పడిపోయి, భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.  Also Read: వాళ్ళ చేతికి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ 'సిగ్మా' తెలుగు రైట్స్.. థియేటర్లలో రచ్చ ఖాయం!     అదే సమయంలో, ఎలాంటి ఆర్బాటం లేకుండా బాక్సాఫీస్ అరంగేట్రం చేసిన చిన్న చిత్రం 'హనుమాన్ అంశ' అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా 2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌తో తెరకెక్కి మొదటి రెండు వారాలు చాలా మందకొడిగా సాగింది. ఎనిమిదో రోజుకే ఫ్లాప్ జాబితాలో చేరుతుందనుకున్న వేళ మై హునా అంటూ  ప్రేక్షకుల మౌత్ టాక్  ఊపిరిపోసింది. ఏకంగా 38వ రోజున కూడా థియేటర్లలో సరికొత్త వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ, ఇండియాలోనే  214.63 కోట్ల నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా 268.05 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దాదాపు 10,700% ప్రాఫిట్ మార్జిన్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది.     ఈ రెండు చిత్రాల ఫలితాలు సినీ విశ్లేషకులకు, నిర్మాతలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. నేటి డిజిటల్ యుగంలో ఆడియన్స్ సినిమా పరిమాణాన్ని చూసి కాదు, సినిమాలోని కంటెంట్‌లోని ఆత్మను చూసి థియేటర్లకి  వస్తున్నారు. కంటెంట్ లో బలం, భావోద్వేగాలు ఉన్నప్పుడు బడ్జెట్ తో సంబంధం లేకుండా 2 కోట్ల సినిమా అయినా 260 కోట్లు సాధిస్తుంది. కథలో విషయం లేకపోతే 500 కోట్ల పాన్ ఇండియా వండర్ అయిన  కోలుకోలేని దెబ్బ తింటుంది. దీన్ని బట్టి సినిమా విజయానికి కంటెంటే అసలైన కింగ్ అని బాక్సాఫీస్ గణాంకాలు మరోసారి నిరూపించాయి. హనుమాన్  అంశ్ తెలుగులో 'హనుమాన్ అంశ'గా ఈ నెల 18 న విడుదల కానుంది. త్రివిక్రమ్ రిలీజ్ చేస్తున్నాడు.         [Toxic, Hanuman Ansh, Content is King, Hanuman Ansh Budget, Toxic Budjet, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Suriya and Jyothika have completed 20 years of marriage, and the couple chose to celebrate the milestone by renewing their wedding vows. A video from the special ceremony has now gone viral, with fans showering love on the couple for their adorable chemistry and the warmth they continue to share. The ceremony saw Suriya and Jyothika recreate some beautiful wedding moments. Jyothika looked elegant in a white wedding gown, while Suriya opted for a white suit. The presence of their children, Diya and Dev, made the occasion even more memorable. One of the most talked-about moments in the video is Suriya's emotional reaction as he sees Jyothika walking down the aisle. Jyothika also shared a heartfelt note about the celebration, calling it “The Sequel” and describing their two decades together as a journey filled with love, disagreements, adjustments, understanding and sacrifices. Rather than presenting marriage as perfect, she celebrated the imperfections that have shaped their relationship over the years. Jyothika wrote, "A vow renewal, celebrating our 20 years of love and war. And no, this is not a celebration of a perfect marriage. This is a celebration of imperfections, of adjustments, of understanding, sacrifices, of loving each other selflessly. This is a celebration of “us”. The people we have become for each other . How ironical- A dream which felt far from reality, is now a reality I will spend my entire lifetime dreaming of! So here are my vows - I vow to be a happy person — because I choose to see only life's positive side . I vow to celebrate life — because life itself is a gift when the man whom you love, respects you beyond himself. I vow never to complain- Why should I ? when even something as vast as the sky doesn’t have the privilege of touching the ground! Look around , everything in existence is incomplete. It’s how we choose to fill the gaps. I vow to be thankful - as every morning I wake in the arms of a man who protects me, and for my beautiful children who've given my life a meaning. And me, a reason to live. I vow to be healthy — because that is the only true asset we ever build. Even the fanciest brick houses will always have their leaks, termites, and renovations. I vow to be the best mother — not because I cook, or clean, or help, but because I smile, a smile that makes my children want to relive the story their appa amma lived. I vow, my Suriya, to always remain that imperfect wife , who fights, and then makes up, only to grow a little more closer to you each time. I vow to cherish our friendship most of all — because it’s rare to find your equal, your confidant, your gossip partner and your best friend, all living inside this one special man who also happens to be your husband and the father of your children. So here’s to our next twenty years — The imperfect us, with the perfect understanding."  The video has struck a chord with fans, who are particularly enjoying the couple's playful and affectionate moments. Twenty years after their wedding, Suriya and Jyothika's vow renewal has once again put their relationship in the spotlight, with their genuine chemistry becoming the biggest talking point.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    https://www.instagram.com/reel/DdUFAt2yiyO/
కొత్త సినిమా అంటేనే ఎలా ఉంటుందనే ఆసక్తి. అలాంటిది ఇళయదళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో మన తెలుగు హీరో సందీప్ కిషన్ చేసిన మూవీ 'సిగ్మా' వస్తుంటే ఎంతటి ఆసక్తి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.   తెలుగు రాష్ట్రాల్లో 'సిగ్మా' ని  నైజాం మరియు కోస్తాంధ్ర రీజియన్లలో పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ చేజిక్కించుకుంది. సీడెడ్(రాయలసీమ) ప్రాంతంలో ఎన్వీఆర్ సంస్థ గ్రాండ్‌గా  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మైత్రి, ఎన్వీఆర్ సంస్థల బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అత్యధిక సంఖ్యలో థియేటర్లు కేటాయించబడతాయని, గ్రాండ్ రిలీజ్ దక్కనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ డాన్స్ మాస్టర్ అండ్ నటుడు రాజు సుందరమ్, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్ మరియు యోగ్ జపీ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుందీప్ కిషన్ గతంలో నటించిన 'మైఖేల్' సినిమా  4.6 కోట్ల గ్లోబల్ గ్రాస్ వసూళ్లతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసింది. ఇప్పుడు జాసన్ సంజయ్ మేకింగ్ క్రేజ్, లైకా ప్రొడక్షన్స్ గ్రాండియర్, మైత్రి మరియు ఎన్వీఆర్ సంస్థల థియేట్రికల్ రీచ్ తో 'సిగ్మా' చిత్రం ఈ రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.    Also Read: 1000 కోట్ల క్లబ్ లో మమిత బైజు: కేరళ కుట్టి అరుదైన రికార్డు    లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విడుదలైన టీజర్, అలాగే మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ స్వరపరిచిన పాటలకు ప్రేక్షకులలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.      [ Sigma, Jasan sanjay, Vijay, Sundeep Kishan, Fariya Abdullah, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News] 
విశ్వనాధ్ అండ్ సన్స్ లో 'మాడీగా' అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించి, ఇక కెరీర్ లో వెనక్కి తిరి చూసుకునే అవకాశం లేకుండా చేసుకుంది  మమిత బైజు. ఆ వెంటనే  రీసెంట్ గా స్వంత భాషలో తెరక్కేక్కిన 'బెత్లహోమ్ కుటుంబ యూనిట్' తో మరో భారీ హిట్ అందుకొని సౌత్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ అఫ్ ది డే గా నిలిచింది. ఆమె నటించిన చిత్రాలని ఏడాదిలోపు చూసుకుంటే విజయ్ జన నాయగన్  300 కోట్లు రాబట్టింది. ప్రదీప్ రంగనాధన్ తో చేసిన డ్యూడ్ 100 కోట్లు, విశ్వనాధ్ అండ్ సన్స్ 260 కోట్లు, ధనుష్ తో చేసిన కర 55 కోట్లు,  మరోవైపుబెత్లహోమ్ కుటుంబ యూనిట్' స్టిల్  310 కోట్లరూపాయలతో దూసుకుపోతుంది. ఇలా వన్ ఇయర్ లోపే 1000 కోట్లు రాబట్టి తన కట్ అవుట్ రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తుంది.   Also Read: ప్యారడైజ్ రిజల్ట్ పైనే చిరు మూవీ భవిష్యత్తు: ఎందుకు, ఏమిటి,ఎలా! కేరళలోని కొట్టాయంకి చెందిన చెందిన మమిత భైజు ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి    కాన్ఫిడెన్స్ తో కూడిన నటనని ప్రదర్శించడంలో దిట్ట. అందుకే అభిమాన ఘనాన్ని, సినిమాల లిస్ట్ ని పెంచుకుంటూ వెళ్తుంది.  2016 లో 'పావడ' అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, 'ప్రేమలు' మూవీతో ప్రేక్షకుల హృదయాల్లో కుర్చీ వేసుకొని కూర్చుంది.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి డై హార్ట్ ఫ్యాన్.       [Mamitha Baiju, viswanadh And Sons, 1000 Crore Club, bethlehem kudumba unit , Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
సెల్యులాయిడ్ పై ఇంకా అడుగుపెట్టకముందే నాని 'ది ప్యారడైజ్' హంగామా ఒక రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. ఫ్యాన్స్ అయితే మా నానిలో దాగి ఉన్న మాస్ విశ్వరూపం అంటే ఏంటో చూస్తారు, రికార్డ్స్ అన్ని నాచురల్ గా క్యూ కట్టాల్సిందే అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ విషయాన్ని అలా ఉంచితే  ప్యారడైజ్ కి మెగాస్టార్ చిరంజీవి మూవీతో లింక్ ఉందా అనే న్యూస్ తాజాగా వైరల్ హోదాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ప్యారడైజ్ సెట్స్ పై ఉన్నప్పుడే  లాస్ట్ ఇయర్  డిసెంబర్‌లోనే చిరు,శ్రీకాంత్ కాంబినేషన్‌లో ఒక భారీ బిగ్ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ కాంబినేషన్ అనౌన్స్ కాగానే మెగా అభిమానుల్లోనూ, సినీ ప్రియుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, ఈ సినిమా అసలు సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే డౌట్ కూడా ఆకాశాన్ని తాకిన అంచనాలతో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాయి. చిత్ర పరిశ్రమ తీరే అది.  కానీ ఇప్పుడు  'ప్యారడైజ్'  విజయంపైనే చిరుతో శ్రీకాంత్ మూవీ ఆధారపడి ఉందనే వార్తలు  సంచలనం సృష్టిస్తున్నాయి. ఇది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే విజయమే అన్నిటిని పర్ఫెక్ట్ గా   సెట్ చేసుకుంటూ వెళ్తుంది. లేదంటే మీకు మీరే మాకు మేమే.. ఏది ఏమైనా  శ్రీకాంత్ ఓదెల, చిరు మూవీ జరగాలని కోరుకుందాం. అనౌన్స్ మెంట్ టైంలో వచ్చిన పోస్టర్ అయితే ఒక రేంజ్ లోనే ఉంది. నానినే నిర్మాత కావడం గమనార్హం.     Also Read: బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ అప్ డేట్: అభిమానుల ఆందోళన వెనక అసలు నిజం! ప్రస్తుతం చిరు, దర్శకుడు బాబీతో చేస్తున్న కాకతో బిజీగా ఉన్నాడు. కొత్త ప్రాజెక్ట్ మాత్రం ఇంకా ఏది అనౌన్స్ చెయ్యలేదు. విశ్వంభర కూడా సంక్రాంతికి కర్చీఫ్ వేసిందనే న్యూస్ రెండు రోజులుగా సినీ,సోషల్ మీడియాలో టాప్ చైర్ లో కూర్చుంది.    [Chiranjeevi, Nani, The Paradise, Kaaka, Srikanth Odela, Kayadu Lohar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
Sundeep Kishan’s Sigma is getting a strong distribution setup in the Telugu market ahead of its October release. Mythri Distribution has acquired the theatrical rights for Telangana and Coastal Andhra, while NVR Cinema will handle the film’s release in Rayalaseema. The move gives the upcoming heist thriller a solid theatrical network even before its release. The film has already generated interest through its promotional material, particularly Sundeep Kishan’s stylish appearance, action and swag. The songs and background score by S Thaman have also added to the buzz around the project. Sigma marks the directorial debut of Jason Sanjay, who has written and directed the film. Coming from a prominent film family, the young filmmaker has attracted attention with his choice of a heist thriller for his first outing. The promotional material so far suggests an attempt to present Sundeep Kishan in a slicker action-oriented avatar. Produced by Lyca Productions, the film is being mounted on a lavish scale and is scheduled to release worldwide on October 2 in Telugu and Tamil. With Mythri and NVR backing the Telugu theatrical distribution, Sigma is expected to secure a sizeable release across the Telugu States. Ultimately, the film’s fate will depend on whether Jason Sanjay can convert the pre-release curiosity into strong word-of-mouth. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
418 will not be arriving in theatres on September 18 as planned. The horror thriller, presented by Prashanth Neel and backed by Mythri Movie Makers, has been postponed as the team works on a grand multi-language release. The decision comes after the film reportedly received encouraging feedback from special screenings held for select audiences and industry members. The makers say exhibitors from other language markets have responded positively, with the response from the Hindi exhibition sector being particularly strong. This has prompted the team to explore a Hindi release along with the South Indian versions. Rather than rushing the film into theatres on the already announced date, the production house now wants additional time to plan its release across multiple markets. The idea is to give 418 wider visibility and take advantage of the interest that has emerged beyond its original target audience. The postponement is therefore being presented as a strategic expansion rather than a production-related delay. The film had already generated curiosity with its trailer, while its recent screenings have apparently strengthened the makers’ confidence in its theatrical potential. Directed by Kirtan Nadagouda, 418 stars Chaitra Achar, Surya Raj, Charan Lakkaraju and Preethi Pagadala in key roles. The film has received an A certificate and a new release date will be announced soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Nani’s The Paradise is getting another major boost from its music, with Yasha Nagula turning into a viral sensation within days of its release. The second single has crossed 100 million views and 705K likes, reportedly becoming the fastest Telugu song to reach the milestone. The song’s appeal comes largely from its Telangana folk flavour, which has been given a contemporary treatment by Anirudh Ravichander. Lyrics by Kasarla Shyam, combined with the voices of folk artists, have given Yasha Nagula a distinctly rooted sound while retaining the mass energy expected from a big-screen action film. The track has remained at the No. 1 trending position globally since its release, while the glimpses featuring Nani and Keerthy Suresh have added to the buzz. Interestingly, Anirudh is now finding himself competing with his own numbers, as Aaya Sher, the film’s first single, has already crossed 200 million views. The musical momentum is arriving at an important stage for The Paradise, which is heading for a September 24 worldwide release. Directed by Srikanth Odela, the film stars Nani alongside Mohan Babu, Kayadu Lohar and Raghav Juyal, with Sudhakar Cherukuri producing the project. With the songs already creating a strong digital footprint, the film’s theatrical expectations are naturally getting bigger. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ '418' మూవీ రిలీజ్ సడన్‌గా వాయిదా పడింది. ప్రశాంత్ నీల్ శిష్యుడు కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ హారర్ లవర్స్ ని ఆకట్టుకుంది. "ఇన్నాళ్లూ హారర్ సినిమాల్లో కామెడీ చూసి నవ్వుకున్నది చాలు.. ఇక నుంచి నిజమైన భయం అంటే ఏంటో చూస్తారు" అని మేకర్స్ సవాల్ విసరడమే కాకుండా, సెన్సార్ బోర్డ్ నుండి 'A' సర్టిఫికేట్ సాధించి అందరిలో తీవ్ర ఉత్కంఠను పెంచేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు, కొందరు ప్రత్యేక ప్రేక్షకులకు ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ షోలు వేశారు. అలాగే నార్త్ ఇండియాకు చెందిన ప్రముఖ హిందీ ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మైండ్ బ్లాక్ అయ్యే రెస్పాన్స్ ఇచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్ ఎగ్జిబిటర్స్ అయితే.. "ఈ రేంజ్ హారర్ కంటెంట్‌ను కేవలం సౌత్ లాంగ్వేజెస్‌కే పరిమితం చేస్తే ఎలా? హిందీలో కూడా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాల్సిందే" అని మేకర్స్‌కు సూచించారట. హిందీ బెల్ట్‌లో సరైన ప్రాపర్ హారర్ సినిమాలకు ఉన్న డిమాండ్ తెలిసిందే. ఉత్తరాది ఎగ్జిబిటర్ల నుండి వచ్చిన ఈ అనూహ్య స్పందనతో మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ ఆలోచనలో పడ్డారు. ఒక గొప్ప కంటెంట్‌ను తక్కువ స్కేల్‌లో రిలీజ్ చేయడం కంటే, కొద్ది రోజులు టైమ్ తీసుకుని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి భారీగా విడుదల చేస్తే రేంజ్ వేరేలా ఉంటుందని భావించారు. అందుకే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. "మీ నిరీక్షణ కాస్త పెరిగినా, '418' అనుభవం మాత్రం అంతకు మించిన గ్రాండ్ రేంజ్‌లో ఉండబోతోంది" అని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల మార్కెట్లలో విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహించి, సరికొత్త విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.       [418 Movie Postponed, 418 Pan India Release, 418 Release Date, Prashanth Neel, Mythri Movie Makers, Kirtan Nadagouda, Telugu Film News, Telugu News]  
  గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'దాదా' తర్వాత చేయబోయే మూవీ కొరటాల శివతో అని అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. కమర్షియల్ టచ్ కి సోషల్ మెసేజ్ ని నింపడంలో కొరటాల సిద్ధహస్తుడు కావడంతో స్టోరీతో పాటు బాలకృష్ణ క్యారక్టర్ పై ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ పలురకాల కథల్ని ఊహించుకోవడం స్టార్ట్ చేసారు.    అంతేకాకుండా, ఈ చిత్రానికి సౌత్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు వార్తలు రావడంతో అంచనాలు స్థాయి కూడా పెరిగింది. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఆగిపోయిందంటూ అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, బాలకృష్ణ గారు ఇటీవల బడ్జెట్ మరియు కమర్షియల్ సేఫ్టీ విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం మొదలైంది. రూ. 100 కోట్ల పరిధిలోనే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారని, అందుకే రూ. 150 కోట్ల బడ్జెట్ హర్డిల్ కారణంగా కొరటాల శివ సినిమాపై అనిశ్చితి ఏర్పడిందని వార్తలు వ్యాపించాయి. ఈ పుకార్లతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురై, సినిమా అప్‌డేట్ వెంటనే ఇవ్వాలని నెట్టింట డిమాండ్ చేయడం ప్రారంభించారు.         Also Read: జై జై రామ్ సాంగ్: ఎందుకిలా చేసారు? ఉన్న అర్హత ఏంటి! అయితే అదే సమయంలో బాలయ్య డై హార్డ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు' అనవసరమైన రూమర్లని  నమ్మవద్దని, త్వరలోనే అధికారిక ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్‌మెంట్ అప్‌డేట్ రాబోతోందని సమాచారం.ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ కూడా కొత్తగా బరిలోకి దిగబోతున్న ఒంగోలు గిత్తలా బాలయ్య, కొరటాల మూవీ కోసం కాసుకొని కూర్చుంటుందనేది పక్కా.         [Balakrishna, Koratala Siva, , NBK112 , Fans Demand, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మహిళల జీవితంలో ప్రతి నెలా ఎదురయ్యే శారీరక, మానసిక సవాళ్లలో ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లేదా పిఎమ్‌ఎస్ (PMS) అత్యంత ప్రధానమైనది. బహిష్టు లేదా పీరియడ్స్ ప్రారంభం కావడానికి కనీసం ఒక వారాలు లేదా రెండు వారాల ముందు మహిళల్లో కనిపించే రకరకాల శారీరక, భావోద్వేగ మార్పుల సమాహారమే ఈ పిఎమ్‌ఎస్. నెలసరి సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పులు, శరీరంలో నీరు చేరి ఉబ్బరంగా అనిపించడం, రొమ్ముల్లో తీవ్రమైన నొప్పి, తలనొప్పి, అలసట, అధికంగా తియ్యటి పదార్థాలు లేదా జంక్ ఫుడ్ తినాలనే కోరికలు కలగడం వంటి శారీరక అసౌకర్యాలు ఒకవైపు వేధిస్తుంటాయి. మరొకవైపు కారణం లేకుండానే విపరీతమైన కోపం రావడం, చిన్న విషయాలకే తీవ్రమైన ఆందోళన చెందడం, డిప్రెషన్ లేదా చిరాకు వంటి మూడ్ స్వింగ్స్ కలగడం పిఎమ్‌ఎస్ యొక్క ప్రధాన సంకేతాలుగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసవ వయస్సులో ఉన్న దాదాపు 75 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ప్రతి నెలా ఏదో ఒక రకమైన పిఎమ్‌ఎస్ లక్షణాలను అనుభవిస్తున్నారని పలు అధ్యయనాల డేటా స్పష్టం చేస్తోంది. చాలామంది మహిళల మనస్సులో తరచుగా మెదిలే ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, వయస్సు పెరిగే కొద్దీ లేదా నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఈ పిఎమ్‌ఎస్ సమస్యలు నిదానంగా క్రమంగా మాయమవుతాయా? ఈ ఆసక్తికరమైన అంశంపై ప్రముఖ గైనికాలజిస్టులు మరియు మహిళా ఆరోగ్య నిపుణులు అత్యంత కీలకమైన శాస్త్రీయ నిజాలను వెల్లడించారు. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ పిఎమ్‌ఎస్ పూర్తిగా మాయమవ్వకపోగా, నలభై ఏళ్ల వయస్సు దాటిన తర్వాత లేదా పెరిమెనోపాజ్ (మెనోపాజ్ ముందస్తు దశ) సమయానికి చేరుకునేసరికి దీని తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల స్థాయిలలో నిరంతరం జరిగే తీవ్రమైన మార్పులే దీనికి ముఖ్య కారణం. 20ల మరియు 30ల వయస్సులో ఉన్న యువతులలో పిఎమ్‌ఎస్ లక్షణాలు సాధారణ హార్మోన్ల మార్పుల వల్ల ఒక క్రమపద్ధతిలో వచ్చిపోతుంటాయి. అయితే, 40ల వయస్సులోకి అడుగుపెట్టిన మహిళల్లో పెరిమెనోపాజ్ కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మెనోపాజ్‌కు ముందు శరీరం సిద్ధమవుతున్నప్పుడు ఈస్ట్రోజెన్ స్థాయిలు చాలా వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల గతంలో అనుభవించిన పిఎమ్‌ఎస్ లక్షణాల కంటే మరింత తీవ్రమైన ఆందోళన, నిద్రలేమి, తీవ్రమైన మూడ్ స్వింగ్స్ మరియు హ్యాట్ ఫ్లషెస్ (శరీరం వేడెక్కడం) వంటి సమస్యలు పెరిగిపోతాయి. అధ్యయనాల ప్రకారం, నలభై ఏళ్ల దాటిన మహిళల్లో దాదాపు 20 శాతం నుండి 30 శాతం మందిలో పిఎమ్‌ఎస్ లక్షణాలు అత్యంత క్లిష్టమైన పిఎమ్‌డిడి (PMDD ,Premenstrual Dysphoric Disorder) అనే తీవ్రమైన మానసిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ పిఎమ్‌ఎస్ ప్రభావం కేవలం మెనోపాజ్ దిశగా వెళ్తున్న మహిళల్లో మాత్రమే కాకుండా జీవితంలోని వివిధ దశల్లో కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, గర్భధారణ సమయంలో హార్మోన్ల స్థితి పూర్తిగా వేరుగా ఉండటం వల్ల పిఎమ్‌ఎస్ లక్షణాలు ఉండవు. అలాగే పిల్లలకు పాలు ఇచ్చే పాలిచ్చే తల్లి దశలో కూడా ఈ సమస్య తగ్గుతుంది. అయితే ప్రసవం ముగిసిన తర్వాత తిరిగి క్రమం తప్పకుండా పీరియడ్స్ ప్రారంభమైనప్పుడు చాలామందిలో పిఎమ్‌ఎస్ లక్షణాలు మునుపటి కంటే ఎక్కువగా కనిపిస్తాయి. అంతిమంగా మహిళల్లో మెనోపాజ్ దశ (పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే దశ) పూర్తయిన తర్వాత మాత్రమే ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులు నిలిచిపోయి పిఎమ్‌ఎస్ సమస్యకు శాశ్వత విముక్తి లభిస్తుంది. ఈ పిఎమ్‌ఎస్ లేదా పెరిమెనోపాజ్ అసౌకర్యాల తీవ్రతను తగ్గించుకోవడానికి మహిళలు సరైన జీవనశైలి మార్పులు చేసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, ఆహారంలో ఉప్పు, చక్కెర, కెఫిన్ మరియు ఆల్కహాల్‌ను తగ్గించడం వల్ల శరీరంలో నీరు చేరే సమస్య మరియు మూడ్ స్వింగ్స్ అదుపులోకి వస్తాయి. ఆహారంలో పీచు పదార్థాలు, ఆకుకూరలు, క్యాల్షియం మరియు విటమిన్ బి6 అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల హార్మోన్ల వ్యవస్థ సమతుల్యమవుతుంది. ఒకవేళ పిఎమ్‌ఎస్ లక్షణాలు రోజువారీ పనులకు తీవ్రమైన అంతరాయం కలిగిస్తుంటే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గైనికాలజిస్ట్‌ను సంప్రదించి తగిన వైద్య సలహా లేదా హార్మోనల్ థెరపీ తీసుకోవడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.         [PMS, Premenstrual Syndrome, PMDD, Perimenopause, Menopause, Womens Health, Hormonal Changes, Menstrual Cycle, Estrogen, Progesterone]
  మానవ శరీరంలో అత్యంత సంక్లిష్టమైన, కీలకమైన అవయవమైన మెదడును ఆరోగ్యం గలదిగా ఉంచడంలో నాడీ వ్యవస్థతో పాటు రోగనిరోధక కణాలు కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అయితే మెదడులో ఏర్పడే క్రోనిక్ న్యూరోఇన్‌ఫ్లమేషన్ అంటే దీర్ఘకాలిక వాపు లేదా శోథ వల్ల ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ మరియు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి భయంకరమైన నాడీ సంబంధిత రుగ్మతలు తలెత్తుతుంటాయి. ఇప్పటివరకు ఈ మెదడు వాపును ఎలా అరికట్టాలో సరైన మార్గం లభించక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యూరోసైంటిస్టులు మరియు మెడికల్ పరిశోధకులు మెదడులోని రోగనిరోధక కణాలను నియంత్రించే  డాక్స్  (DAXX Death Domain Associated Protein) అనే క్రోమాటిన్ ప్రోటీన్ పాత్రను కనుగొని నాడీ వైద్య రంగంలో ఒక సరికొత్త విప్లవానికి తెరతీశారు. మన మెదడులో  మైక్రోగ్లియా  (Microglia) అనే ప్రత్యేకమైన రోగనిరోధక కణాలు నిరంతరం కాపలాదారులుగా వ్యవహరిస్తాయి. మెదడులోకి ప్రవేశించే హానికర బ్యాక్టీరియా, వైరస్‌లు మరియు వ్యర్థాలను ఏరిపారేయడం వీటి ముఖ్య విధి. సాధారణ పరిస్థితుల్లో ఇవి మెదడుకు రక్షణగా పనిచేస్తాయి, కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా జన్యు మార్పులు సంభవించినప్పుడు ఇవి తీవ్రమైన వాపును లేదా ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రేరేపించే సంకేతాలను విడుదల చేస్తాయి. ఈ మైక్రోగ్లియా కణాలలోని జన్యు వ్యక్తతను మరియు వాటి అతిగా స్పందించే స్వభావాన్ని అదుపులో ఉంచడంలో  DAXX  అనే క్రోమాటిన్ ప్రోటీన్ ఒక ప్రధాన బ్రేక్ సిస్టమ్‌లా లేదా మాస్టర్ స్విచ్‌లా పనిచేస్తుందని శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వెల్లడైంది. క్రోమాటిన్ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఈ ప్రోటీన్ హానికరమైన ఇన్ఫ్లమేటరీ జన్యువులు యాక్టివేట్ కాకుండా నిరోధిస్తుంది. పరిశోధనాత్మక ప్రయోగాల డేటా ప్రకారం, మెదడులోని మైక్రోగ్లియా కణాలలో  DAXX  ప్రోటీన్ స్థాయిలు తగ్గినప్పుడు లేదా అది సక్రమంగా పనిచేయకుండా లోపించినప్పుడు, ఇన్‌ఫ్లమేషన్ సంకేతాలు దాదాపు 300 శాతం నుండి 400 శాతం వరకు విపరీతంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తీవ్రమైన వాపు వల్ల మెదడులోని ఆరోగ్యకరమైన న్యూరాన్లు మరియు సైనాప్స్‌లు నశించిపోయి, క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణించడం, మేధోశక్తి పడిపోవడం వంటి ఆల్జీమర్స్ సంకేతాలు వేగంగా విస్తరిస్తాయి. అయితే జీన్ థెరపీ లేదా ప్రత్యేక మాలిక్యూల్స్ ద్వారా ఈ DAXX  ప్రోటీన్ పనితీరును తిరిగి పునరుద్ధరించినప్పుడు, మెదడులోని వాపు స్థాయిలు దాదాపు 70 శాతం నుండి 80 శాతం వరకు తగ్గిపోయి, నాడీ కణాలు నశించకుండా సురక్షితంగా రక్షించబడ్డాయని ప్రయోగశాల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ సంచలన ఆవిష్కరణ మానసిక మరియు నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ ఆశాకిరణంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాంప్రదాయ మందులు కేవలం రోగ లక్షణాల తీవ్రతను మాత్రమే తాత్కాలికంగా తగ్గిస్తాయి తప్ప, వ్యాధి మూల కారణమైన మెదడు వాపును అరికట్టలేకపోతున్నాయి. కానీ,  DAXX  క్రోమాటిన్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని తయారుచేసే  టార్గెటెడ్ ఎపిజెనెటిక్ థెరపీ  అందుబాటులోకి వస్తే, ఆల్జీమర్స్ మరియు పక్షవాతం వంటి వ్యాధుల పురోగతిని ప్రారంభ దశలోనే ఆపడం సాధ్యమవుతుంది. అతి త్వరలోనే ఈ సాంకేతికత ఆధారంగా సరికొత్త ఔషధాలను రూపొందించి మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని పరిశోధకులు ప్రణాళికలు రచిస్తున్నారు.         [DAXX Protein, Neuroinflammation, Brain Health, Microglia, Alzheimer's Disease, Parkinson's Disease, Autism Spectrum Disorder, Epigenetic Therapy, Neuroscience Research, Brain Inflammation]
  నేటి ఆధునిక డిజిటల్ యుగంలో మానవ సమాజం వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ, తీవ్రమైన మానసిక సమస్యలు మరియు ఒత్తిడి మనుషులను లోలోపలే దహించి వేస్తున్నాయి. ముఖ్యంగా తీవ్ర మానసిక కుంగుబాటు (డిప్రెషన్) మరియు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పిటిఎస్‌డి) వంటి నాడీ సంబంధిత రుగ్మతలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను దెబ్బతీస్తున్నాయి. ఏదైనా దారుణమైన ప్రమాదం, విషాదం లేదా మానసిక గాయం చూసినప్పుడు మనుషుల్లో పిటిఎస్‌డి తలెత్తుతుంది. ఇప్పటి వరకు ఈ సమస్యలను కేవలం మానసికమైనవిగా లేదా మెదడులోని రసాయనాల అసమతుల్యతగా భావిస్తూ చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ మానసిక రుగ్మతల వెనుక రక్తంలో తిరిగే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ నాడీ వ్యవస్థ శాస్త్రవేత్తలు మరియు వైద్య పరిశోధకులు సరికొత్త అధ్యయనంలో సంచలన విషయాలను వెల్లడించారు. రక్తంలో ఉండే నిర్దిష్ట ప్రోటీన్ స్థాయిలకు, మనుషుల్లో కనిపించే తీవ్రమైన డిప్రెషన్ మరియు పిటిఎస్‌డి లక్షణాలకు మధ్య చాలా బలమైన జీవసంబంధమైన లంకె ఉందనే విషయం ఈ నూతన ఆవిష్కరణ ద్వారా స్పష్టమైంది. పరిశోధకులు వేల సంఖ్యలో ఉన్న రోగుల రక్త నమూనాలు, జన్యు ఆధారాలు మరియు మెదడు మ్యాపింగ్ డేటాను సమగ్రంగా విశ్లేషించారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, తీవ్ర మానసిక ఆందోళన, నిరాశ మరియు భయాందోళనలతో బాధపడే రోగుల రక్తంలో ఈ నిర్దిష్ట ప్రోటీన్ పరిమాణం అసాధారణ రీతిలో హెచ్చుతగ్గులకు గురవుతున్నట్లు రక్త పరీక్షల డేటాలో తేలింది. ఈ ప్రోటీన్ వ్యత్యసాల వల్ల మెదడులోని నాడీ వ్యవస్థకు సంకేతాలను చేరవేసే మార్గాలలో అంతరాయం ఏర్పడి, మనుషులు భయాన్ని, తీవ్రమైన దుఃఖాన్ని మర్చిపోలేక నిరంతరం నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ శాస్త్రీయ పరిశోధన వివరాల ప్రకారం, రక్తంలో ఉండే ఈ బయోమార్కర్ ప్రోటీన్ సహాయంతో భవిష్యత్తులో కేవలం ఒక చిన్న రక్త పరీక్ష ద్వారానే వ్యక్తికి డిప్రెషన్ లేదా పిటిఎస్‌డి వచ్చే ముప్పు ఎంతవరకు ఉందో అత్యంత ఖచ్చితత్వంతో ముందే అంచనా వేయవచ్చు. ఇప్పటివరకు మానసిక వైద్యులు కేవలం రోగులతో మాట్లాడి, వారి ప్రవర్తన ఆధారంగా సమస్య తీవ్రతను అంచనా వేసేవారు. దీనివల్ల దాదాపు 40 శాతం నుండి 50 శాతం కేసుల్లో సరైన సమయానికి సరైన వ్యాధి నిర్ధారణ జరగక చికిత్స ఆలస్యమయ్యేది. కానీ, ఇప్పుడు ఈ బయోమార్కర్ ప్రోటీన్ గుర్తింపు వల్ల వ్యాధి నిర్ధారణ క్రమంలో 85 శాతానికి పైగా ఖచ్చితత్వం సాధించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మానసిక వైద్య విభాగంలో ఒక రకమైన విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు. మరింత ఆశాజనకమైన విషయమేమిటంటే, ఈ ప్రోటీన్ పనితీరును లక్ష్యంగా చేసుకుని సరికొత్త ఔషధాలను రూపొందించేందుకు ఔషధ రంగానికి సరికొత్త బాటలు పడ్డాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంప్రదాయ యాంటీ డిప్రెసెంట్ మందులు రోగులలో పనిచేయడానికి కనీసం 4 నుండి 6 వారాల సమయం పడుతుంది, పైగా అనేకమందిలో ఇవి పూర్తిస్థాయి ఉపశమనాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కానీ రక్తంలోని ఈ ప్రోటీన్ లక్ష్యంగా పనిచేసే టార్గెటెడ్ థెరపీ అందుబాటులోకి వస్తే, అతి తక్కువ సమయంలోనే అంటే కేవలం కొద్ది రోజుల్లోనే మెదడులోని ఒత్తిడి స్థాయిలను తగ్గించి, మానసిక కుంగుబాటు నుండి ఉపశమనం కలిగించవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ప్రాణాలమీదికి తెచ్చే డిప్రెషన్, ఆత్మహత్యా ఆలోచనలను అరికట్టడానికి ఈ రక్త ప్రోటీన్ ఆవిష్కరణ ఒక గొప్ప వెలుగు దివ్వెలా నిలుస్తుదనడంలో ఎలాంటి సందేహం లేదు.         [Depression, PTSD, Mental Health, Stress, Blood Protein, Biomarkers, Brain Health, Mental Disorders, Depression Research, Targeted Therapy]
ఎక్కువగా తింటేనే కడుపు నిండినట్లు అనిపించడం అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. దీనివల్ల బరువు పెరగడం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం ఎంత తింటున్నాం అనే దానికంటే, మన మెదడుకు కడుపు నిండిందనే సంకేతం ఎప్పుడు అందుతోంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ముగింపు పలికి, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ఎలా అలవర్చుకోవాలి. ఎక్కువగా తింటేనే కడుపు నిండింది అని అనుకునే సమస్యకు ఎలా చెక్ పెట్టాలి? వివరంగా తెలుసుకుంటే.. ఎక్కువ తింటేనే కడుపు నిండిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది? మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు కడుపు నిండింది అనే విషయాన్ని మెదడుకు చేరవేసేందుకు కొన్ని రకాల హార్మోన్లు పనిచేస్తాయి. అయితే కొన్ని తప్పుడు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.. ఆహారాన్ని వేగంగా తినడం.. త్వరత్వరగా ఆహారాన్ని మింగేయడం వల్ల కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరేలోపే మనం తినాల్సిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తినేస్తాం. సాధారణంగా కడుపు నిండిన భావన మెదడుకు చేరడానికి దాదాపు ఇరవై నిమిషాల సమయం పడుతుంది. ఆలోచనలు వేరే చోట ఉంచి తినడం..  టీవీ చూస్తూ, ఫోన్ వాడుతూ లేదా ఏదైనా పనిలో మునిగిపోయి తిన్నప్పుడు ఎంత తింటున్నామో గమనించలేం. దీనివల్ల సాధారణ పరిమాణంలో తిన్నా కడుపు నిండిన తృప్తి లభించదు. తక్కువ పీచు, ఎక్కువ ప్రాసెస్డ్ ఆహారం..  మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి, మైదా, షుగర్ వంటి ప్రాసెస్డ్ పదార్థాలు ఎక్కువగా ఉంటే అవి త్వరగా అరిగిపోతాయి. దీనివల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండదు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి.. తీవ్రమైన ఒత్తిడి లేదా సరిపడా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువై, కడుపు నిండినా ఇంకా తినాలనే భావన కలుగుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి పాటించాల్సిన మార్గాలు.. ఆహారాన్ని నమిలి నెమ్మదిగా తినడం.. ప్రతి ముద్దను బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా తినడం వల్ల మెదడుకు కడుపు నిండుతున్న సంకేతాలు సమయానికి అందుతాయి. దీనివల్ల తక్కువ ఆహారంతోనే పూర్తి తృప్తి లభిస్తుంది. మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాటు చేసుకోవడం..  తినే సమయంలో ఫోన్లు, టీవీలు, పుస్తకాలు పక్కన పెట్టాలి. ఆహారం రంగు, రుచి, సువాసనను ఆస్వాదిస్తూ ద్యాస అంతా తిండిపైనే ఉంచి తినాలి. ఇది అతిగా తినడాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. పీచు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.. భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు , ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పప్పుధాన్యాలు, గుడ్లు, పనీర్ వంటివి చేర్చుకోవాలి. ఇవి పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. భోజనానికి ముందు నీళ్లు తాగడం..  భోజనం చేయడానికి ఒక అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సిద్ధమవ్వడమే కాకుండా, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. అయితే తింటున్న సమయంలో లేదా తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం మంచిది కాదు. చిన్న ప్లేట్లు వాడడం..  పెద్ద ప్లేట్లలో ఆహారం తింటే తక్కువగా ఉన్నా ఖాళీగా కనిపిస్తుంది. అదే చిన్న ప్లేట్ వాడితే తక్కువ ఆహారమే ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది మానసికంగా త్వరగా తృప్తిని కలిగిస్తుంది. ఆకలికి, దాహానికి తేడా గుర్తించడం.. చాలాసార్లు శరీరానికి దాహం వేసినప్పుడు కూడా ఆకలి వేస్తున్నట్లే అనిపిస్తుంది. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగి కొన్ని నిమిషాలు వేచి చూడడం మంచిది. సరిపడా నిద్ర, ఒత్తిడి నిర్వహణ..  ప్రతిరోజూ ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే ఆకలిని నియంత్రించే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. చివరగా తెలుసుకోవాల్సింది.. ఎక్కువ తింటేనే కడుపు నిండుతుంది అనుకోవడం ఒక తప్పుడు జీవనశైలి అలవాటు మాత్రమే. కొద్దిరోజుల పాటు పైన పేర్కొన్న నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే, తక్కువగా,  సరైన పరిమాణంలో ఆహారం తీసుకుంటూనే కడుపు నిండిన అనుభూతిని పొందవచ్చు. ఇది కేవలం బరువును అదుపులో ఉంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.                          *రూపశ్రీ.  
వయసు పెరగడం సహజం.. కానీ వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరులో కూడా వయసుకు అనుగుణంగా మార్పులు వస్తాయి. 60+ వయసులో పడిపోవడం, నీరసం, వినికిడి తగ్గడం, చూపు సమస్యలు, నిద్రలో మార్పులు వంటి సమస్యలు సాధారణంగా కనిపించవచ్చు. అయితే వీటిని చిన్న సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో General Geriatrics & Lifestyle Specialist డాక్టర్ శ్రావణి కుమారి 60 ఏళ్లు దాటిన వారు తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. వయసుకు తగ్గట్టుగా మందుల మోతాదు, పోషకాహారం, నిద్ర, శారీరక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అవసరమో తెలియజేస్తున్నారు. అంతేకాదు, నాగార్జున, చిరంజీవి వంటి ప్రముఖులు వయసు పెరిగినా ఫిట్‌గా, యాక్టివ్‌గా మరియు గ్రేస్‌ఫుల్‌గా కనిపించడానికి కారణం ఏమిటి? వయసును ఆరోగ్యంగా, అందంగా స్వీకరించేందుకు ఎలాంటి జీవనశైలి పాటించాలి? అనే అంశాలపై కూడా ఈ వీడియో ఆసక్తికరమైన అవగాహన కల్పిస్తుంది. మీ వయసు 60 దాటిందా? లేదా మీ కుటుంబంలో 60+ వయసున్న వారు ఉన్నారా? అయితే ఈ వీడియోను తప్పక చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు, ఆహారం లేదా ఇతర చికిత్సలకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)