టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.       (Minister  Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి.  సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.   విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ  స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి.  అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో  విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి  అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు   పార్టీలోకి వచ్చి తన  నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  రాష్ట్ర రాజకీయాల్లో   బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.  ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది.   తనను తాను శివసేన వ్యవస్థాపకుడు  బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము.  ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   [Vijayasai Reddy Bal Thackeray  Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]
తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు.   ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.   [Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
    అప్పుడే పుట్టిన పసిపిల్లాడి(పాప) బోసి నవ్వు చూస్తే జన్మ ధన్యమైందని ఎలా అనుకుంటామో, బడా హీరో సినిమా రిలీజ్ రోజు బెనిఫిట్ షో కి వెళ్లి  హీరో డై హార్డ్ ఫ్యాన్ ఫేస్ చూస్తున్నా అదే ఫీలింగ్ ఉంటుందని సినీ ప్రియులు చెప్తుంటారు .ఇప్పుడు ఎన్టీఆర్ కి చెందిన  డై హార్డ్  ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 'ఎన్టీఆర్' ఇరుముడి చేసి ఉంటే అనే చర్చ లేనవెత్తుతున్నారు.  ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఈ శక్తివంతమైన భక్తి కథాంశంలో నటించి ఉంటే తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులు ఏ విధంగా రూపాంతరం చెందేవో ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. 'ఇరుముడి' కథలో కథానాయకుడి పాత్ర ఎంతో వైవిధ్యమైనది. ప్రారంభంలో పక్కా నెగెటివ్ షేడ్స్ కలిగి, తీవ్రంగా మందుకి అలవాటుపడిన ఒక సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేన్ తన చిన్నారి కూతురి కోరిక కోసం అయ్యప్ప మాల ధరిస్తాడు. ఆ మాల ధారణ తర్వాత అతని ప్రవర్తనలో, మనస్తత్వంలో వచ్చిన ఆధ్యాత్మిక మార్పులు, దాని ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రైమ్ సస్పెన్స్ డ్రామాను ఛేదించే విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్టీఆర్ వంటి అద్భుతమైన నటుడు ఈ పాత్రలో ఉండి ఉంటే, ఆ భావోద్వేగాలు మరొక ఎత్తులో ఉండేవి. 'రాఖీ', 'జై లవకుశ' వంటి చిత్రాల్లో తండ్రిగా, అన్నగా ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించిన ఎన్టీఆర్, ఇరుముడి మాల ధరించి 'స్వామియే శరణం అయ్యప్ప' అని శరణుఘోష చేస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి సాధారణంగా ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, ఆయనకున్న విపరీతమైన అభిమాన గణం ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే.ఇరుముడి  మొదటి రోజు రూ. 15 కోట్ల నుంచి  20 కోట్ల వరకు నెట్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావాన్ని చూపించింది. అదే ఎన్టీఆర్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో ఈ సినిమా వచ్చి ఉంటే, ఓపెనింగ్ డే కలెక్షన్లు సునాయాసంగా 80 కోట్ల నుండి 100 కోట్ల మార్కును దాటేసి ఉండేవి. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' మరియు 'దేవర' చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్ దృష్ట్యా, ఉత్తరాది రాష్ట్రాలలోనూ ఈ ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కథ అపారమైన విజయాన్ని సాధించేది. శబరిమల యాత్ర, అయ్యప్ప స్వామి భక్తి విశిష్టత దక్షిణాదికే కాకుండా దేశమంతటికీ బాగా కనెక్ట్ అయ్యే అంశం కావడం వల్ల పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద శతాధిక కోట్ల వర్షం కురిసేదని ఫ్యాన్స్ చెప్తున్నారు.      Also Read: ఫౌజీ సెట్స్‌లో విషపురుగు కాటు:  అసలు నిజం బయటపెట్టిన రాజేష్ శర్మ! నిజానికి ఒక హీరో సినిమా రిలీజై సూపర్ డూపర్ హిట్ కొట్టాక, మా హీరో ఈ సినిమాలో చేస్తే సూపర్ గా  ఉండేదని అనుకోవడం పరిపాటి. ఆ మాటకొస్తే ఇండియన్ చిత్ర సీమ మొత్తంపై అలాంటి మాటలు ఫ్యాన్స్  ఆనందం, హుషారు మధ్య ట్రావెల్ చేస్తుంటాయి. ఆ కోవలోనే ఎన్టీఆర్ ఇరుముడి చేసి ఉంటే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అని కొంత మంది  ఫ్యాన్స్  బావిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసి ఉన్నా కూడా సూపర్ గా ఉండేదనే మాటలు సైతం  కొంత మంది ఫ్యాన్స్ నుంచి వచ్చాయి. అంతే కానీ మాస్ మహారాజాని తక్కువ చెయ్యడం కాదు. జస్ట్ ఫ్యాన్స్ ఆరాటం అంతే. మాస్ మహారాజా తనదైన పెర్ ఫార్మ్ తో ఇరుముడిని బ్లాక్ బస్టర్ బాట పట్టించాడు    .           [ Ntr, irumudi, Raviteja, Shiva Nirvana, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News, Pan India,NTR Irumudi]    
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ యాక్టర్ సూరితో కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'మండాడి' సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఇటీవల సెన్సార్ పనులను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోయింది. సెంట్రల్ బోర్డ్ ఈ చిత్రానికి UA16+ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఇక ఈ సినిమా నిడివిని క్రిస్పీగా, ఎక్కడా బోర్ కొట్టకుండా 2 గంటల 30 నిమిషాలు (150 నిమిషాలు) గా లాక్ చేశారు. నేటితరం ప్రేక్షకులకు పర్ఫెక్ట్ పేసింగ్‌తో ఉండేలా ఈ సినిమాను ఎడిట్ చేశారట. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సముద్రం, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఇది. సముద్రంలో తనదైన నైపుణ్యంతో చేపల వేట సాగించే ముత్తుకాళి పాత్రలో సూరీ నటించారు. కాళి కేవలం జాలరి మాత్రమే కాదు.. ఆ ప్రాంతంలోనే తిరుగులేని బోట్ రేసర్. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తన ఊరిని, తన ప్రజలను వదిలేసి దూరంగా బతుకుతుంటాడు. అలాంటి సమయంలో తన సొంత ఊరి మత్స్యకారులకు తీవ్రమైన ఆపద ఎదురవుతుంది. తన వాళ్ల కోసం, తన గ్రామం కోసం కాళి మళ్లీ తిరిగొస్తాడు. తన సహచరులతో కలిసి సంప్రదాయ పడవ పందాల్లో దిగి తొడగొడతాడు. ఇందులో సట్టై పులి అనే పవర్‌ఫుల్ అండ్ కన్నింగ్ పాత్రలో సుహాస్ కనిపించబోతున్నాడు. కాళికి చిరకాల ప్రత్యర్థి అయిన సట్టై పులి.. ఎలాంటి కుట్రలు చేశాడు? కుతంత్రాలతో కాళిని ఎలా దెబ్బతీయాలని చూశాడు? సముద్రం అలలపై కాళికి, సట్టై పులికి మధ్య జరిగిన ఆ పడవ పందాల పోరు ఎంత ఉత్కంఠగా సాగింది అనేదే ఈ సినిమా మెయిన్ హైలైట్. డైరెక్టర్ వెట్రీమారన్ శిష్యుడైన మతిమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దాంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సముద్రంలో చిత్రీకరించిన బోట్ రేసింగ్ సీన్స్ హాలీవుడ్ లెవెల్‌లో ఉన్నాయని ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జీవీ ప్రకాశ్ కుమార్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రచ్చ లేపాడని టాక్. సుహాస్ మరోసారి తన పెర్ఫార్మెన్స్‌తో ఫిదా చేశారట. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్, సెకండాఫ్‌లో వచ్చే సూరి-సుహాస్ ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయమని అంటున్నారు. గ్రామీణ వాతావరణాన్ని నాచురల్‌గా చూపిస్తూనే.. ఎక్కడా కథనం స్లో అవ్వకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రా విజ్యువల్స్ ఈ సినిమాకు ప్రాణం పోసాయని తెలుస్తోంది. సూరీ, సుహాస్ ఇద్దరూ పోటాపోటీగా నటించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.       [Mandaadi First Review, Mandaadi Censor Talk, Mandaadi Review, Suhas, Soori, Mathimaran Pugazhendhi, Telugu Movie Review, Telugu Film News, Telugu News]  
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ ‘ఫౌజీ’ . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ జరుగుతున్నట్టుగా టాక్.  అయితే కొన్ని రోజుల క్రితం  షూటింగ్ సెట్‌లో ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ శర్మ ని విషపూరితమైన కీటకం కొట్టడంతో  తీవ్ర అస్వస్థతకి  గురయ్యారని హుటాహుటిన కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేర్పించారనే వార్తలు నెట్టింట హల్ చల్ చేసింది. ఈ ఘటనపై సినిమా వర్కర్ల సంఘం ఏఐసీడబ్ల్యూఏ (AICWA) కూడా స్పందిస్తూ సెట్‌లో సరైన భద్రత, వైద్య సదుపాయాలు లేవని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేయడంతో సినీ పరిశ్రమలో పెద్ద కలకలమే రేగింది.  అయితే ఈ ప్రచారం అంతటికీ చెక్ పెడుతూ స్వయంగా నటుడు రాజేష్ శర్మ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అసలు నిజాన్ని వెల్లడి చేసాడు. ఆయన మాట్లాడుతు 'ప్రభాస్ సినిమా సెట్‌లో నన్ను విషకీటకం కుట్టిందనే వార్తలన్నీ పూర్తిగా అబద్దం. అవన్నీ ఒట్టి రూమర్లు మాత్రమే. ప్రభాస్ గానీ, ఆ సినిమా నిర్మాణ బృందం గానీ చాలా మంచివారు. సెట్‌లో నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. నా ఆరోగ్యం క్షీణించడానికి ఆ సినిమా యూనిట్‌కి  ఎలాంటి సంబంధం లేదు". నాకు చాలా కాలంగా కుడి కాలికీ ఒక తీవ్రమైన చర్మ సమస్య (స్కిన్ ఇన్ఫెక్షన్) ఉంది. హైదరాబాద్ షూటింగ్ ముగించుకుని కోల్‌కతా వెళ్లిన తర్వాత నా రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ / డయాబెటిస్) అనూహ్యంగా పెరిగిపోవడంతో ఆ చర్మ ఇన్ఫెక్షన్ ఒక్కసారిగా విషమించింది. స్టార్టింగ్ లో ఆ సమస్యని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి తీవ్రమై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అంతేతప్ప పురుగు కుట్టడం అనేది ఏమాత్రం నిజం కాదని స్పష్టత ఇచ్చారు.     Also Read: దారుణంగా పడిపోయిన టాక్సిక్ ఓటీటీ డీల్: అత్యాశ వల్ల ఎన్ని కోట్లు లాస్ అంటే! కోల్ కతా కి చెందిన రాజేష్ వెనక వందకి పైగా  హిందీ, బెంగాలీ చిత్రాలు ఉన్నాయి. ఎనీ క్యారక్టర్ తీసుకోండి ఓవర్ డోస్ లేకుండా పెర్ ఫార్మ్ చెయ్యడం రాజేష్ శర్మ స్పెషాలిటీ.     [ Fauji,  Prabhas, Rajesh Sharma, Health Rumors, Kolakata, Hanu Raghavapudi, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
Suriya delivered biggest blockbuster of his career with Karuppu. The movie was designed as Mookuthi Amman 2, sequel to Mookuthi Amman by RJ Balaji. But the director quit Mookuthi Amman franchise and sold the rights to Sundar C to develop the sequel. Now, this Nayanthara starrer is set to clash with Suriya's next film.  As per the reports, Suriya has completed shoot of his next film as a cop, in the direction of Jithu Madhavan. After Aavesham, the director is coming up with this film and it has huge anticipation. Nazriya Nazim and Naslen are cast in the film, which further increased expectations.  Suriya is producing the film on his Zhagaram productions and he locked Diwali release for the film, say reports. On the other hand, Sundar C and producer Ishari Ganesh have watched Mookuthi Amman 2, loved it and are super confident about the movie becoming a huge blockbuster for Diwali time, it seems.  Well, Ramayana Part-1 is set to release for the same date or time. Already, Dhanush's OM makers wanted to see if they can postpone their movie from 16th October to avoid clash with Rajinikanth's Jailer 2 but they did not want to lose to Ramayana. We have to wait and see how other two biggies will withhold and carry forward.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
బాక్సాఫీస్ దగ్గర మళ్లీ డబుల్ ధమాకా క్రియేట్ చేయడానికి తమిళ హీరో కార్తీ 'సర్దార్ 2' తో వచ్చేస్తున్నారు. 2022లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన 'సర్దార్' సినిమాకి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతున్న ఈ మూవీ సెన్సార్ పనులను ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా మొత్తం రన్ టైమ్ 2 గంటల 59 నిమిషాలు (179 నిమిషాలు). నిడివి కాస్త భారీగానే అనిపించినా, ప్రతీ నిమిషం ఊపిరిసలపని హై యాక్షన్ సీన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని సెన్సార్ టాక్ వెల్లడిస్తోంది. కథ ఏంటంటే.. భారత ప్రధాని అత్యవసరంగా ఒక సీక్రెట్ మిషన్‌ను ఆదేశిస్తారు. దేశ భద్రతను దెబ్బతీయడానికి 'బ్లాక్ డాగర్' అనే డేంజరస్ పాత్రలో ఎస్‌జే సూర్య ఒక ముఠాతో కలిసి భారీ కుట్ర పన్నుతాడు. ఈ కుట్రను భగ్నం చేయడానికి జపాన్ భాష తెలిసిన ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ అవసరమవుతాడు. దాంతో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్, సీక్రెట్ ఏజెంట్ విజయ్ (కార్తీ) రంగంలోకి దిగుతాడు. ఒకపక్క నేటి సమాజంలో తీవ్రమైన ముప్పుగా మారిన ప్లాస్టిక్ వాడకం అండ్ దాని వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్ చుట్టూ ఈ కథ నడుస్తూనే.. దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ తో సాగుతుంది. నటన విషయానికి వస్తే కార్తీ తండ్రి, కొడుకులుగా డబుల్ రోల్‌లో జీవించేశారు. విలన్‌గా ఎస్‌జే సూర్య పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందట. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ల గ్లామర్ అండ్ యాక్షన్ ఓ రేంజ్ లో అలరిస్తాయని తెలుస్తోంది. అలాగే సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ కానుంది. సెన్సార్ నుంచి పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ 10న థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.       [Sardar 2 Review, Karthi Sardar 2, SJ Suryah Sardar 2, Sardar 2 Story, Sardar 2 Censor, PS Mithran, Telugu Cinema Review, Telugu Film News, Telugu News]  
  అత్యాశ అనే వర్డ్ తప్పని చెప్పలేం. కానీ అత్యాశతో వెయిట్ చేసి అనుకున్నది కుదరక అసలుకే మోసం వస్తే మాత్రం అత్యాశనే మౌనంగా సరైన సమాధానం చెప్తుంది. ఇప్పుడు యష్ వన్ మాన్ షో  టాక్సిక్ మేకర్స్ ది అదే పరిస్థితి.    థియేట్రికల్ రిలీజ్ కి  ముందు, ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి 'టాక్సిక్' ఆల్ లాంగ్వేజ్ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం 150 కోట్ల వరకు  ఆఫర్లు వచ్చాయి. అయితే, థియేట్రికల్ బిజినెస్ ద్వారా  450 కోట్ల మైలురాయిని సులభంగా అందుకుంటుందని, ఆ విజయం ఆధారంగా డిజిటల్ హక్కుల ధరను . 200 కోట్లకు పైగా పెంచవచ్చని మేకర్స్ భావించారు. యశ్ కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని నమ్మి, 150 కోట్ల ప్రారంభ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఉదయం మొదటి ఆట నుంచే నాకు ఎదురే లేదు అన్నట్టుగా డిజాస్టర్ టాక్ వీరవిహారం చేస్తూ వచ్చింది.  ఈ డిజాస్టర్ ఫలితం ప్రభావం ప్రత్యక్షంగా ఓటీటీ రైట్స్ పై పడి గతంలో 150 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడిన సంస్థలు ఇప్పుడు తమ ఆఫర్లను పూర్తిగా తగ్గించేశాయి. ప్రస్తుతం జీ5 (Zee5) సంస్థ మాత్రమే ఈ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుండగా, వారు కోట్ చేసిన మొత్తం కేవలం  30 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే, విడుదలకు ముందు చేతివరకు వచ్చి చేజారిన రూ. 150 కోట్లతో పోలిస్తే, మేకర్స్ దాదాపు  120 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది.     Also Read: చిరు డాటర్ సుస్మితకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు    పైగా, ఈ చిత్రంలో బోల్డ్ మరియు అడల్ట్ ఓరియంటెడ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో శాటిలైట్ హక్కుల ద్వారా కూడా పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం కనిపిచడం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి మెరుగైన ఆఫర్లను పొందడానికి, మేకర్స్ డిజిటల్ స్ట్రీమింగ్ వెర్షన్ కోసం సరికొత్త కట్ (Fresh Edit) తయారు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రణాళికల అంచనాలు తప్పి, భారీ రేటు ఆశించడంతో ఒక అగ్ర హీరో సినిమా ఓటీటీ మార్కెట్‌లో ఇన్ని కోట్ల నష్టాన్ని ఎదుర్కొవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇక టాక్సిక్  12 రోజుల రన్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 337.80 కోట్ల గ్రాస్ మాత్రమే నమోదు చేయగలిగింది.ఇంక వస్తాయనే నమ్మకం లేదు. ఇటీవల ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలీజ్ చేయగా కనీసం ఫోన్ ఖర్చులకి కూడా రాలేదని టాక్.         [Toxic, Ott Deal. yash, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
    మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటుంది.  మన శంకర వరప్రసాద్ గారుతో ఇప్పటి వరకు వచ్చిన చిరంజీవి  ఎంటైర్ కెరీర్ సినిమాల మొత్తంలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిపింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ తో తెరకెక్కించిన 'జగమే సంగీతం'తో కూడా హిట్ అందుకుంది. రీసెంట్ గా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్మితకి  కీలకమైన బాధ్యతలని అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం) ట్రస్ట్ బోర్డుకి సుస్మిత ని ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి చిరంజీవి నుంచి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రంతో  కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నిర్మాతగా ఎదగడం, ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకి ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించబడం విశిష్టమనే చెప్పాలి. సుస్మిత తల్లి చిరు వైఫ్ తెలంగాణలోని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ట్రస్ట్ బోర్డ్ నెంబర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. Also Read: ఈ రోజు అనస్వర రాజన్ బర్త్ డే:  కాకా కూతురి లుక్ రిలీజ్.. మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్       [Sushmitha Konidela, Durga Devi Temple. Chiranjeevi, Ap Cm, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ 'పౌర్ణమి' గుర్తుండే ఉంటుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించకపోయినా, అందులోని పాటలు మాత్రం మన మదిలో నిలిచిపోయాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన, సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించిన, కె.ఎస్. చిత్ర మంత్రముగ్ధమైన గొంతులో వచ్చిన 'భరత వేదముగా..' పాట అంటే ఇప్పటికీ ప్రతీ ఒక్కరికీ ప్రాణమే. అయితే, సరిగ్గా 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ వింటేజ్ క్లాసికల్ సాంగ్.. ఇప్పుడు ఏకంగా చైనాలో మార్మోగిపోతోంది. చైనాకు చెందిన మీరా వాంగ్ అనే ఒక యువతి ఈ 'భరత వేదముగా' పాటకు చేసిన అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రస్తుతం ఇంటర్నెట్ లో గ్లోబల్ వైడ్ గా వైరల్ అవుతోంది. ఆమె ముఖంలో కనిపించే భావాలు, అచ్చం మన భారతీయురాలిలా ఆమె పలికిస్తున్న అభినయం, కనురెప్పల కదలికలు చూస్తుంటే నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయిపోతోంది. మీరా వాంగ్ ఇప్పటివరకు జీవితంలో ఒక్కసారి కూడా భారతదేశంలో కాలు పెట్టలేదు. మన దేశానికి రాకుండానే, ఆంధ్రాలోని అనంతపురానికి చెందిన కూచిపూడి గురువు అలా వేణుగోపాల్ దగ్గర ఆన్‌లైన్ ద్వారా కూచిపూడి నేర్చుకుంటోంది. భారతీయ సంస్కృతిపై, తెలుగు సినిమా సంగీతంపై ఉన్న విపరీతమైన ప్రేమతో ఆమె అహోరాత్రులు సాధన చేసి ఈ ప్రదర్శన ఇచ్చింది. మీరా వాంగ్ కు తెలుగు భాషపై ఎంతటి అభిమానం ఉందంటే.. గతంలో 'మాయాబజార్' సినిమాలోని ఆల్ టైమ్ క్లాసిక్ 'అహా నా పెళ్లంట..' పాటకు కూడా నాట్యం చేసి నెటిజన్ల మనసు దోచుకుంది. ఇప్పుడు ఈ 'భరత వేదముగా' పర్ఫార్మన్స్ తో టాలీవుడ్ స్టార్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ చైనీస్ భామపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. https://x.com/Theteluguone/status/2097260212159963181       [Chinese Dancer Meera Wang, Kuchipudi Dance, Prabhas Pournami Song, Bharata Vedamuga Song, Devi Sri Prasad, Sirivennela Songs, Telugu Film News, Telugu News]  
Directed by senior filmmaker Mahesh Chandra, the film ‘Pithapuramlo… Ala Modalaindi’ is set for a grand worldwide release on September 18. The prominent production house, Prime Show Entertainment, is handling the film's release. The movie features a cast including Dr. Rajendra Prasad, Prithviraj, Kedar Shankar, Manichandana, Annapurnamma, Sunny Akhil, Virat, Sai Pranith, Srilu, Pratyusha, and Rehana. It has been produced by Dundigalla Balakrishna, Akula Suresh Patel, and F.M. Murali (Godari Kittayya) under the 'Mahesh Chandra Cinema Team' and Evergreen Epic Cinema banners. Director Mahesh Chandra stated that the film has been crafted to convey a meaningful message to the youth while incorporating emotional elements such as romance, subtle humor, sentiment, and the bond between a father and daughter. He noted that the film feels incredibly natural, featuring characters and incidents that mirror real life, and promises a fresh experience for the audience. He highlighted that the voice-over by the legendary comedian Dr. Brahmanandam serves as a special attraction, and noted that renowned sculptor Rajkumar Wadayar plays a key role in the film.  Mahesh Chandra also mentioned the positive audience response to the trailer and two songs released so far, adding that the film offers a realistic, "live-action" feel and that such concepts remain evergreen.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Kangana Ranaut has entered the ongoing controversy surrounding Trisha Krishnan and the remarks that dragged the actress into a political fight in Tamil Nadu. Without directly naming Trisha, Kangana questioned why women are so often made the target when rumours or alleged relationships involve two people. Speaking to reporters in Kullu, the actor-turned-politician pointed to the recent Tamil Nadu controversy and said that while a relationship involves both parties, abuse and character assassination are disproportionately directed at the woman.  She argued that this pattern is not restricted to India and is often used against successful women, actors, politicians and those in positions of power. The controversy gained momentum after DMK leader Udhayanidhi Stalin made a remark at a Cauvery protest that was widely interpreted as a double entendre involving Trisha.  Udhayanidhi later maintained that he had not named the actress, while the comment triggered political and public backlash. A case was registered against him following the controversy. The issue has also been addressed by Tamil Nadu Chief Minister Vijay, who recently warned against personal attacks and derogatory comments targeting women during a speech in the Assembly. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా గొప్ప బంధానికి దారి తీస్తుంది.  జీవితాంతం ఒకరికి ఒగరుగా ఉండటం కోసం వివాహం చేసుకుంటారు.  కానీ  కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తుంది.  చట్టబద్దంగా విడాకులు తీసుకుని విడిపోతుంటారు.  విడాకులు పొందిన తర్వాత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన నిర్ణయం. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, ఏర్పడిన మానసిక పరిపక్వత ఈ కొత్త ప్రయాణానికి పునాదిగా నిలుస్తాయి. అయితే కొందరు తొందరపడి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు.  కానీ ఇలా చేసే తొందరపాటు పని రెండవ వివాహం తర్వాత కూడా జీవితాన్ని విచ్చిన్నం చేస్తుంది.  రెండవ సారి వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు ఆలోచించడం,   కీలకమైన జాగ్రత్తలు పాటించడం , కొన్ని విషయాలలో ముందే స్పష్టత తెచ్చుకోవడం చాలా ముఖ్యం.  దీని వల్ల భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది. మళ్లీ పెళ్లి చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఏ ఏ విషయాల్లో స్పష్టత అవసరమో తెలుసుకుంటే.. గతం నుండి బయటపడటం.. విడాకుల తర్వాత మరో పెళ్లికి సిద్ధపడే ముందు, పాత బంధం కలిగించిన బాధలు, కోపాలు, అసంతృప్తుల నుంచి పూర్తిగా కోలుకోవాలి. మానసిక ప్రశాంతత లభించినప్పుడే కొత్త వ్యక్తికి మన జీవితంలో సరైన స్థానం ఇవ్వగలుగుతాం. పాత గాయాలు మానకుండా ఇంకొకరితో ప్రయాణం మొదలుపెడితే, చిన్న చిన్న విషయాలకే పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చి కొత్త బంధంలో అపార్థాలకు దారితీస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దని గ్రహించడం.. ఒంటరితనాన్ని జయించడానికో లేదా సమాజం ఏమనుకుంటుందో అనే భయంతోనో మరో పెళ్లి చేసుకోకూడదు.  జీవితంలో నిజంగా ఒక తోడు కావాలని, కొత్త జీవితాన్ని పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనిపించినప్పుడు మాత్రమే ముందడుగు వేయాలి. సమయం తీసుకుని ఆలోచించడం ఎంతైనా మంచిది. స్వయం పరిశీలన చేసుకోవడం.. గత బంధంలో లోపాలు ఎక్కడ జరిగాయి, మీ వైపు నుంచి ఏవైనా పొరపాట్లు ఉన్నాయా అనే అంశాలపై నిజాయితీగా ఆలోచించుకోవాలి. గత తప్పులను గుర్తించడం వల్ల వాటిని రాబోయే కొత్త బంధంలో మళ్లీ చేయకుండా జాగ్రత్తపడవచ్చు. కొత్త భాగస్వామి విషయంలో ఉండాల్సిన స్పష్టత..  పారదర్శకత , నిజాయితీ.. గత విడాకులకు సంబంధించిన పూర్తి వివరాలను కొత్త భాగస్వామికి స్పష్టంగా చెప్పాలి. ఏ విషయాలనూ దాచకూడదు. చట్టపరంగా విడాకుల ప్రక్రియ పూర్తి అయిందో లేదో తెలియజేయడం చాలా ముఖ్యం.  గత జీవితం గురించి  ఎంత స్పష్టంగా ఉంటే, కొత్త బంధంలో నమ్మకం అంత త్వరగా బలపడుతుంది. ఆర్థిక విషయాలపై స్పష్టత.. ఆర్థిక సమస్యలు చాలా సంబంధాలలో విభేదాలకు కారణమవుతాయి. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అప్పులు, సంపాదన, అలాగే గత భాగస్వామికి ఇస్తున్న లేదా పొందుతున్న భరణం వంటి విషయాలను కొత్త భాగస్వామితో వివరంగా చర్చించాలి. ఇద్దరి ఆర్థిక బాధ్యతలను ఎలా పంచుకుంటారో ముందే ఒక అవగాహనకు రావడం మంచిది. పిల్లల బాధ్యతలు , పెంపకం.. ఒకవేళ మొదటి పెళ్లి ద్వారా పిల్లలు ఉంటే, వారి విషయంలో పూర్తి స్పష్టత ఉండాలి. పిల్లల పెంపకం, వారి చదువు, కస్టడీ హక్కులు,  సమయం కేటాయించడం వంటి విషయాలపై కొత్త భాగస్వామి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. కొత్త భాగస్వామి మీ పిల్లలను ఎలా స్వీకరిస్తారు, వారి పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చాలా కీలకం. అలాగే, రాబోయే రోజుల్లో కొత్తగా పిల్లలను కనాలా వద్దా అనే అంశంపై కూడా ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి. వ్యక్తిగత హద్దులు, ఆశించడాలు.. ప్రతి ఒక్కరికీ కొన్ని వ్యక్తిగత ప్రాధాన్యతలు, సరిహద్దులు ఉంటాయి. కెరీర్, కుటుంబ సభ్యులతో సంబంధాలు, లైఫ్ స్టైల్, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాలలో పరస్పరం ఏమేమి ఆశిస్తున్నారో స్పష్టంగా మాట్లాడుకోవాలి. మీ ఆలోచనలు, వారి ఆశయాలు సరిపోలుతున్నాయో లేదో గమనించాలి. సహనం ,  ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్.. మళ్లీ పెళ్లి చేసుకున్న కొత్తలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. చిన్న చిన్న విషయాలకు పాత భాగస్వామితో కొత్త వారిని పోల్చడం తప్పు. ప్రతి వ్యక్తి భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారని గుర్తుంచుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు దాచకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. విడాకులు జీవితానికి ముగింపు కాదు, అది ఒక కొత్త ఆలోచనకు, మార్పుకు ఆరంభం. ఆచితూచి అడుగులు వేస్తూ, పూర్తి మానసిక పరిపక్వతతో, స్పష్టమైన ఆలోచనలతో ముందడుగు వేస్తే రెండో పెళ్లి జీవితం మరింత సంతోషకరంగా, అర్ధవంతంగా మారుతుంది.                                     *రూపశ్రీ.  
  నేటి ఆధునిక కాలంలో యుక్తవయస్సు లేదా కౌమారదశ (Adolescence) లోకి అడుగుపెడుతున్న టీనేజర్ల మానసిక ఆరోగ్యం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకరమైన విషయంగా మారింది. అయితే, మానసిక సమస్యలు లేదా ప్రవర్తనా వైపరీత్యాలు కేవలం ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికో లేదా ఆర్థిక స్థాయికో పరిమితం కాలేదని, విభిన్న సామాజిక ఆర్థిక నేపథ్యాల (Socioeconomic Backgrounds) నుంచి వచ్చే టీనేజర్లలో ఇవి అత్యంత సాధారణంగా కనిపిస్తున్నాయని ఒక నూతన విస్తృత అధ్యయనం సంచలన నిజాలను బయటపెట్టింది. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి సామాజిక వర్గంలోని కౌమారదశ పిల్లలు తమ వయస్సుకు తగిన మానసిక ఒత్తిళ్లు, ఆందోళన (Anxiety), డిప్రెషన్ (Depression) మరియు ఇతర ప్రవర్తనా రుగ్మతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా తక్కువ సామాజిక ఆర్థిక స్థాయి లేదా పేదరికంలో పెరిగే పిల్లలు ఆర్థిక ఇబ్బందులు, సరైన వనరులు లేకపోవడం మరియు కుటుంబ ఒత్తిళ్ల వల్ల ఎక్కువ మానసిక సమస్యలకు గురవుతారని సమాజంలో బలమైన నమ్మకం ఉండేది. కానీ, తాజా పరిశోధనల ప్రకారం ఉన్నత సామాజిక ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన టీనేజర్లు సైతం సమాన స్థాయిలో లేదా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని స్పష్టమైంది. పేదరికంలో ఉన్న పిల్లలకు వనరుల కొరత మరియు భద్రతా లేమి ప్రధాన సమస్యలుగా మారితే, ఉన్నత వర్గాల పిల్లలకు తల్లిదండ్రుల నుండి వచ్చే విపరీతమైన విద్యా ప్రతిభ ఒత్తిడి (Academic Pressure), సామాజిక గుర్తింపు పోటీ మరియు విలాసవంతమైన జీవనశైలి తెచ్చిపెట్టే ఒంటరితనం మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయి. టీనేజర్లలో కనిపించే ఈ మానసిక సమస్యలకు కేవలం ఆర్థిక అంశాలే కాకుండా, డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వాడకం, కుటుంబ సంబంధాలలో క్షీణత, నాణ్యమైన నిద్ర లేకపోవడం మరియు తోటివారి ఒత్తిడి (Peer Pressure) ప్రధాన హేతువులుగా మారుతున్నాయి. నిరంతరం స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గడపడం వల్ల ప్రతీ సామాజిక వర్గానికి చెందిన టీనేజర్లు తమ జీవితాలను ఇతరులతో పోల్చుకుంటూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇది వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచి, డిప్రెషన్ మరియు మానసిక రుగ్మతలకు బీజం వేస్తోంది. అంతేకాకుండా, బడి మరియు కళాశాల వాతావరణంలో పోటీ తత్వాన్ని తట్టుకోలేకపోవడం కూడా వీరి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ భయానక పరిస్థితి నుంచి కౌమారదశ పిల్లలను కాపాడుకోవడానికి సమాజం మరియు తల్లిదండ్రులు తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని మానసిక వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పిల్లల ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా, వారు చెప్పే మాటలను వినడం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు వారి ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గమనించడం అత్యంత ముఖ్యం. పాఠశాలల్లో నాణ్యమైన కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయులకు టీనేజర్ల మానసిక ఆరోగ్య సం సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వడం ద్వారా మానసిక రుగ్మతలను ప్రారంభంలోనే నివారించవచ్చు. ప్రతి ఇంట్లోనూ సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు డిజిటల్ డిటాక్స్ అలవాటు చేయడం వల్ల టీనేజర్లు మానసికంగా దృఢంగా తయారవుతారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.         Adolescent mental health study facts, causes of teen depression and anxiety.
  సిగరెట్ లేదా బీడీ కాల్చడం వల్ల కలిగే అనర్థాల గురించి నిరంతరం వింటూనే ఉంటాం. అయితే, మీరు పొగతాగకపోయినా సరే, పక్కన ఎవరైనా పొగ తాగుతుంటే ఆ పొగను పీల్చడం (Passive Smoking , Second hand Smoke) అంతకంటే తీవ్రమైన ప్రాణాంతక ముప్పుగా మారుతోందని ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య పత్రిక  లాన్సెట్  (The Lancet) ప్రచురించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. 1990 సంవత్సరం నుండి ఇప్పటివరకు భారతదేశంలో పరోక్ష ధూమపానం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిపోవడం ఆరోగ్య నిపుణులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ధూమపానం చేసేవారు విడుదల చేసే విషపూరితమైన పొగను తెలియకుండానే పీల్చడం వల్ల ఎందరో అమాయకులు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులు అకాల మరణాల బారిన పడుతుండటం కలవరపెడుతోంది. తాజా గణాంకాల ప్రకారం, ఒక్క 2023 సంవత్సరంలోనే భారతదేశంలో పరోక్ష పొగతాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య సమస్యలతో ఏకంగా 3,25,600 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, భారతదేశంలో ఇదే సంవత్సరంలో సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల 9.28 మిలియన్ల డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ (DALYs) నష్టం వాటిల్లింది. అంటే అనారోగ్యం, వైకల్యం లేదా అకాల మరణం కారణంగా ప్రజలు తమ జీవితంలో ఇన్ని మిలియన్ల ఆరోగ్యకరమైన సంవత్సరాలను కోల్పోయారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 2023 నాటికి ఏకంగా 2.71 బిలియన్ల మంది ప్రజలు పరోక్ష ధూమపానానికి గురవుతున్నారు. దీని ఫలితంగా ప్రపంచ స్థాయిలో ఏడాదికి 1.66 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతుండగా, 44.8 మిలియన్ల డాలీస్ నష్టం జరుగుతోంది. అంతర్జాతీయంగా చూస్తే చైనా, భారతదేశం మరియు ఇండోనేషియా దేశాల్లోనే అత్యధికంగా ప్రపంచ పరోక్ష ధూమపాన బాధితుల్లో సగం మంది ఉన్నారు. చైనాలో అత్యధికంగా 664 మిలియన్ల మంది ప్రజలు ఈ ప్రమాదకర పొగకు గురవుతుండడం గమనార్హం. పరోక్షంగా పీల్చే పొగ శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల ప్రధానంగా ఇస్కీమిక్ గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), రొమ్ము క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా మరియు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయని లాన్సెట్ అధ్యయనం తేల్చింది. ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులు తాగే పొగను పీల్చడం వల్ల చిన్న పిల్లల ఊపిరితిత్తుల ఎదుగుదల దెబ్బతిని, వారిలో తీవ్రమైన నిమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. మహిళలు కూడా ఈ పొగ బారిన పడి తీవ్ర గుండె సంబంధిత మరియు క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ భయానక పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి ప్రజల్లో తీవ్రమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొగతాగే అలవాటు ఉన్నవారు తమ ఇల్లు, ఆఫీస్ మరియు బహిరంగ ప్రదేశాల్లో కాకుండా కేవలం నిర్దేశించిన ఓపెన్ ఎయిర్ ప్రాంగణాల్లో మాత్రమే స్మోకింగ్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు ఉన్న ఇళ్లల్లో పొగతాగడం పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వాలు కూడా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు, పరోక్ష ధూమపానం తెచ్చే ముప్పుపై చైతన్యాన్ని విస్తృతంగా తీసుకెళ్లినప్పుడే లక్షలాది అమాయకుల ప్రాణాలను కాపాడుకోగలమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.       How secondhand smoke affects women and children, Lancet report on passive smoking deaths in India.
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారడమే కాకుండా నీరసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా దీని ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్ లేదా ఇతర మందులు వాడుతుంటారు, కానీ ఇవి ప్రతిసారీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఔషధాల ప్రమేయం లేకుండా, ఇంట్లోనే  రెండు  ప్రభావవంతమైన పద్ధతుల ద్వారా కొన్ని నిమిషాల్లోనే కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. వైద్యులు రికమెండ్ చేస్తున్న ఈ చిట్కాలు ఏమిటో తెలుసుకుంటే.. హెర్బల్ స్టీమ్.. సాధారణ నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాసనాళాలు కాసేపు రిలాక్స్ అవుతాయి కానీ.. గట్టిగా ఉన్న కఫం కరగదు. నీటిలో కొన్ని రకాల సహజ మూలికలను చేర్చి ఆవిరి పట్టినప్పుడు, ఆ ఆవిరి ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి కఫాన్ని సులభంగా కరిగిస్తుంది. కావాల్సిన పదార్థాలు.. పుదీనా ఆకులు.. 10 నుండి 12 తులసి ఆకులు..  10 నుండి 12 హిమాలయన్ పింక్ సాల్ట్..  1 టీస్పూన్ తురిమిన అల్లం..  అర అంగుళం నీరు.. ఆవిరి రావడానికి సరిపడా ఇందులోని పదార్థాల ప్రత్యేకత..  పుదీనాలో ఉండే మెంతోల్ శ్వాసనాళాలను తెరిచి కఫాన్ని పలుచన చేస్తుంది.  తులసిలోని యాంటీమైక్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను నశింపజేసి, వాపును తగ్గిస్తాయి.  హిమాలయన్ ఉప్పు కఫాన్ని కరిగించడానికి తోడ్పడతుంది.   అల్లం గొంతు మంటను తగ్గించి శ్వాసకోశాల్లోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తయారీ , ఉపయోగించే విధానం.. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. స్టవ్ ఆపివేసిన తర్వాత, ఆ వేడి నీటిలో పుదీనా, తులసి ఆకులు, హిమాలయన్ సాల్ట్ , తురిమిన అల్లం వేయాలి. వెంటనే పాత్రపై ఒక టవల్ మూసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఆ మూలికలలోని ఆరోమాటిక్ ఆయిల్స్ నీటిలోకి విడుదలవుతాయి. ఆ తర్వాత పాత్ర మూత తీసి, ముఖాన్ని   తగినంత దూరంలో ఉంచి, తలను టవల్‌తో లేదా దుప్పటితో  కప్పుకోవాలి. ముక్కు , నోటి ద్వారా లోతుగా శ్వాస తీసుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చాలి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫం త్వరగా కరిగిపోతుంది. డీప్ ఎక్స్‌పాన్షన్ బ్రీతింగ్ వ్యాయామం.. ఆవిరి పద్ధతితో పాటు డీప్  ఎక్స్‌పాన్షన్ ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని కలిపి చేసినప్పుడు ఫలితం మరింత వేగంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల లోపలి భాగాల్లో చిక్కుకున్న కఫాన్ని పైకి నెట్టి, సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది. చేసే విధానం.. మొదట ఒక కుర్చీలో నిటారుగా, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాసను ఎంత వీలైతే అంత లోతుగా లోపలికి తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత, దానిని 3 నుండి 4 సెకన్ల పాటు ఊపిరితిత్తుల్లోనే పట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి, నాళాలకు అతుక్కుపోయిన కఫం వదులవుతుంది. తరువాత పెదవులను కొవ్వొత్తిని ఊదుతున్నట్లుగా చిన్నగా చేసి, నోటి ద్వారా గాలిని బలంగా బయటకు వదలాలి. ఈ పద్ధతిని వరుసగా 5 నుండి 7 సార్లు పునరావృతం చేయాలి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. ముగింపు.. జలుబు, దగ్గు లేదా మొండి కఫంతో బాధపడుతున్నప్పుడు ఈ రెండు సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే ఊపిరితిత్తులు శుభ్రపడి, హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.                           *రూపశ్రీ.    
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అలాంటి వారికి శొంఠి పొడి (ఎండు అల్లం పొడి) ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదంలో చెబుతారు. అయితే శొంఠిని సరైన మోతాదులో, సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా అల్లంతో పోలిస్తే ఎండు అల్లం లేదా శొంఠికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు శొంఠి ఎలా సహాయపడుతుంది? మజ్జిగలో పావు టీస్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? పిల్లల నుంచి పెద్దల వరకు శొంఠిని ఎలా ఉపయోగించాలి? ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది? ఈ విషయాలపై ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. శొంఠి పొడి వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకునే సరైన విధానం, మోతాదు వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు శొంఠిని ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా ఇంటి చిట్కా లేదా ఆయుర్వేద పదార్థాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)