Read more!

రాజకీయ నేతలపై ఉరీ ఉగ్రదాడి బాధితుల ఆగ్రహం.. విషమిచ్చి చంపండి

 

భారత సైన్యం చేసిన సర్జికల్ దాడుల నేపథ్యంలో పలువురు దానికి సంబంధించిన సాక్ష్యాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అలా అడుగుతున్న రాజకీయ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉరీ ఉగ్రదాడుల బాధితులు. సాక్ష్యాలు బయటపెట్టాలని అడుగుతున్న నాయకులు దేశ ద్రోహులు.. సర్జికల్ దాడులు చేయాల్సింది ఉగ్రవాదుల మీద కాదు, ఇలాంటి నాయకుల మీద.. అలాంటి నాయకులకు విషం ఇచ్చి చంపాలని అంటున్నారు. సర్జికల్ దాడులు నిజంగానే జరిగాయన్న విషయాన్ని వీళ్లు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని. ఇలాంటి నాయకుల వల్లే ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడుతున్నారని ఆరోపించారు. మన సైనికుల నిబద్ధతను ప్రశ్నించడం ఎంతో బాధను కలిగిస్తోందని అంటున్నారు.