TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

మయన్మార్‌లో బౌద్ధ మఠంపై వైమానిక దాడి.. 14 మంది మృతి..!

మయన్మార్‌లో సైనిక పాలకుల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. దేశంలో శాంతియుతంగా ధ్యానం చేసుకుంటున్న పౌరులపై మిలిటరీ జుంటా దారుణానికి ఒడిగట్టింది. బౌద్ధ మఠమే లక్ష్యంగా వైమానిక దాడులు జరపడంతో 14 మంది అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన సెంట్రల్ మయన్మార్‌లోని సగియాంగ్ ప్రాంతం, మ్యాంగ్ టౌన్‌షిప్‌లోని స్వెల్ లే ఓహ్ గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం స్థానిక సమయం ప్రకారం 9 గంటల ప్రాంతంలో ఈ భయానక దాడి జరిగింది. ఆ సమయంలో సదరు బౌద్ధ మఠంలో దాదాపు 100 మందికి పైగా భక్తులు వారం రోజుల ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉన్నట్టుండి విరుచుకుపడిన సైనిక యుద్ధ విమానం మఠం కాంపౌండ్‌పై బాంబులను జారవిడిచింది.15 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బాంబు దాడులు జరపడంతో ప్రార్థనా మందిరంతో పాటు పక్కనే ఉన్న భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడిలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే స్థానిక నివాసితులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం, తదుపరి దాడుల భయంతో గ్రామస్తులంతా సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సగియాంగ్ ప్రాంతం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడుతున్న ప్రతిఘటన దళాలకు పట్టున్న ప్రాంతం కావడంతోనే సైన్యం ఇక్కడ వరుస దాడులకు పాల్పడుతోందని స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 2021 ఫిబ్రవరిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆంగ్ సాన్ సూకీతో సహా పలువురు నేతలను జైలులో పెట్టిన నాటి నుంచి మయన్మార్ మిలిటరీ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికే పాఠశాలలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలపై దాడులు జరిపిన సైన్యం, ఇప్పుడు పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలపై కూడా బాంబుల వర్షం కురిపించడాన్ని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మిలిటరీ పాలనపై ప్రజల నుంచి తిరుగుబాటు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Myanmar Military Airstrike, Sagaing Monastery Attack, Myanmar News Telugu, Buddhist Monastery Strike,Myanmar Military Junta

Published on: Fri Aug 21, 2026 9:19PM

political-news-img

కెనడాలో ఘనంగా తెలుగు ఉగాది సంబరాలు

కెనడాలోని ఎటోబికోలో ఉన్న డాంటే అలిఘేరి అకాడమీ ఆడిటోరియంలో గ్రేటర్ టొరంటో ఏరియాలోని తెలుగు సంఘం 'ఉగాది' తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంది. టొరంటో, మార్కమ్, బ్రాంప్టన్, మిస్సిసాగా, ఓక్వల్, వాటర్ డౌన్, కిచెనర్, వాటర్లూ, కేంబ్రిడ్జ్, హామిల్టన్, మిల్టన్ మరియు ఇతర ప్రాంతాలతో సహా సమీప నగరాల నుండి వచ్చిన అనేక వందల తెలుగు కుటుంబాలు ఆరు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. సంగీతం, నృత్యం, యూత్ ఫ్యాషన్ షో, వంట పోటీ మరియు అనేక ఇతర ఉత్తేజకరమైన ఈవెంట్లు ఘనంగా జరిగాయి. తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో (TCAGT)తో తమ అనుభవాలను పంచుకున్న స్పాన్సర్లు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో కూడిన వీడియో ప్రదర్శనతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబ-స్నేహపూర్వక వినోదం మరియు రుచికరమైన పండుగ వంటకాలను కలిగి ఉన్న ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రేక్షకులు సానుకూలంగా స్పందించారు. తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో (TCAGT) అతిథులు, సభ్యులు, కుటుంబాలు మరియు స్నేహితులు వారు వచ్చినప్పుడు వేదికను అలంకరించి న అందమైన రంగోలి రూపకల్పనతో స్వాగతం పలికారు. వేడుకలు కెనడియన్ జాతీయ గీతం ఆలపించడంతో ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత TCAGT ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు వారి జీవిత భాగస్వాములు వేడుకలో భాగంగా భారతీయ సంప్రదాయ దీపాన్ని వెలిగించి 'దీపారాధన' ఆచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంఘం సెక్రటరీ ప్రవళిక కూన స్వాగతోపన్యాసం చేశారు. తన ప్రసంగంలో, ఆమె ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు ఈ గొప్ప ఉత్సవాలు సాధ్యమయ్యేలా చేయడంలో వారి అమూల్యమైన సహాయం మరియు మద్దతు కోసం స్పాన్సర్లు మరియు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పండిట్ శ్రీ మంజునాథ్ సిద్ధాంతి పంచాగ శ్రవణం అందించగా, వివిధ ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వీటిలో ప్రియాంక పహారిచే శాస్త్రీయ నృత్యాలు, ధృతిచే భక్తిగీతం, యువత అందించిన యూత్ ఫ్యాషన్ షో మరియు వంటల పోటీ ఉన్నాయి. గిరిధర్ నాయక్ బృందం అన్ని వయసుల వారిని అలరించే ఆకట్టుకునే నృత్య కార్యక్రమాలను కూడా ప్రదర్శించింది. అదనంగా, ప్రేక్షకులు మౌనిమ, సందీప్ కూరపాటి మరియు షర్మిలా గణేష్ వంటి ప్రముఖ గాయకులతో కూడిన నాన్-స్టాప్ టాలీవుడ్ మ్యూజికల్ నైట్ను ఆస్వాదించారు. TCAGT అధ్యక్షుడు శివ ప్రసాద్ యెల్లాల హాజరైన వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తన ప్రసంగంలో, అతను కొత్త సభ్యులను గుర్తించాడు మరియు ముప్ఫై-మూడు సంవత్సరాల సమాజ సేవలో TCAGT యొక్క కొన్ని ముఖ్యమైన విజయాలను హైలైట్ చేశారు. అనేక మంది నాయకులు, గాయకులు మరియు కళాకారులను ఎదగడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఒక వేదికను అందించడం ద్వారా వారిని పోషించడంలో అసోసియేషన్ యొక్క ప్రత్యేక బలాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు. TCAGT మాజీ ఛైర్మన్ మరియు ప్రధాన స్పాన్సర్ అయిన సూర్య బెజవాడ ఈ కార్యక్రమంలో తన ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు మరియు తక్కువ వ్యవధిలో ఈ సంవత్సరం భారీ ఉగాది. వేడుకలను విజయవంతంగా నిర్వహించినందుకు సహ-స్పాన్సర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు ట్రస్టీలకు తన అభినందనలు తెలిపారు. నిరంతర వర్షం మరియు చల్లటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యక్రమానికి హాజరైనందుకు పాల్గొనేవారికి మరియు హాజరైన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, సూర్య బెజవాడ సాయంత్రం ముఖ్య అతిథిగా, మిస్సిసాగా-మాల్టన్ ప్రావిన్షియల్ పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులైన దీపక్ ఆనందు పరిచయం చేశారు. ఆయన గౌరవనీయుల గురించి గొప్పగా మాట్లాడారు. దీపక్ ఆనంద్, తెలుగు కమ్యూనిటీకి విపరీతమైన మద్దతునిచ్చే శ్రద్ధగల, నిరాడంబరమైన మరియు సమాజ-ఆధారిత వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన దీపక్ ఆనంద్ ఉగాది శుభాకాంక్షలను తెలియజేసారు మరియు టొరంటోలోని సజీవ తెలుగు సమాజంతో నిమగ్నమవ్వడానికి హాజరైనందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కెనడాలో తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని, భాషను నిలబెట్టేందుకు కృషి చేస్తున్న వ్యవస్థాపక సభ్యులు, జీవితకాల సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్టీలను కొనియాడారు. TCAGT వ్యవస్థాపక సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బేరర్లు మరియు ట్రస్టీలు స్పాన్సర్ అయిన డాక్టర్ ఉదయ్ వడ్డే గారికి శాలువా మరియు పుష్పగుచ్చాన్ని అందించారు. అంతేకాకుండా, డాక్టర్ ఉదయ్ వడ్డే, TCAGT ఆఫీస్ బేరర్లు మరియు ట్రస్టీలతో కలిసిదీపక్ ఆనంద్ గారిని శాలువా మరియు పుష్పగుచ్చంతో సత్కరించారు. గౌరవనీయులు దీపక్ ఆనంద్ తెలుగు కమ్యూనిటీకి చేసిన విశేష సేవలకుగాను TCAGT ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రశంసా పత్రాన్ని కూడా అందించారు. ప్రధాన ఈవెంట్ స్పాన్సర్, LSP సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్, రాఫిల్ డ్రా నిర్వహించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల విజేతలను గౌరవనీయులైన దీపక్ ఆనంద్ మరియు సూర్య బెజవాడ ఎంపిక చేశారు. విజేతలకు LSP టీమ్, అషీష్ కుమార్ మరియు డ్రాజికా స్ట్రోజిమిరోవిక్ బహుమతులు అందజేశారు. బంజారా ఇండియా వంటకాలు తాజాగా తయారుచేయబడిన మరియు వడ్డించే ప్రామాణికమైన మరియు సాంప్రదాయ రుచికరమైన ఆహారాన్ని అందించారు. గత ముప్పై మూడు సంవత్సరాలుగా తెలుగు భాష మరియు సంస్కృతిని పరిరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో స్థిరమైన కృషికి టొరంటోలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు డైనమిక్ తెలుగు కమ్యూనిటీకి అతిథులు మరియు హాజరైన వారు తమ కృతజ్ఞతలు తెలిపారు. విశాల్ బెజవాడ, షర్మిలా గణేశన్లు ఈ వేడుకకు మాస్టర్స్గా వ్యవహరించారు. ఆకర్షణీయమైన మరియు వినోదభరితమైన ప్రదర్శన నాణ్యతను పెంచాయి. వారు ప్రేక్షకుల ఫలితంగా అనేక మంది యువతీ అందుకున్నారు. నైపుణ్యాలు ఈవెంట్ యొక్క మొత్తం కోసం ఇంటరాక్టివ్ క్విజ్లను కూడా నిర్వహించారు, దీని యువకులు గణనీయమైన నగదు బహుమతులు ట్రెజరర్ తేజ వఝా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భారత జాతీయ గీతాన్ని ఆలపించడంతో ఈవెంట్ ముగిసింది. దిగువ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈవెంట్ యొక్క అదనపు చిత్రాలను యాక్సెస్ చేయవచ్చు. Click here for Telugu Ugadi Grand Celebrations in Canada Photos

Published on: Mon Apr 3, 2023 11:06AM

political-news-img

ఘనంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

అమెరికాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన వేడుకల్లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గ మండలి, అధ్యాపకులు, విద్యార్థులు, దాతలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతం, భరత నాట్యం, సంస్కృతం కోర్సులలో భారతదేశం, ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాలనుండి మొత్తం 38 మంది విద్యార్థులు డిగ్రీ, డిప్లమో పట్టాలను పొందారు. కుటుంబ సభ్యులతో వర్చువల్ సదస్సులో పాల్గొని వారంతా ఆనందోత్సవాల్ని పంచుకొన్నారు. 2021 సంవత్సరంలో పట్టభద్రులవుతున్న విద్యార్థులను ఈ సందర్భంగా పాలకమండలి అభినందించింది.. Class of 2021 విద్యార్థులు సాధించిన విజయాలను కీర్తిస్తూ.. విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందించిన తోడ్పాటును ప్రశంసిస్తూ.. భవిష్యత్తులో వారు మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని అభిలషించింది. స్నాతకోత్సవంలో ప్రసంగించిన విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ .. విద్యార్థులు తాము సాధించిన విజయాలను చూసి గర్వపడాలని చెప్పారు. భారతదేశ సంస్కృతి ఎంతో పురాతనమైనదని.. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం తొలినాళ్లలోనే ప్రపంచ ప్రఖ్యాతినొందిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు నెలకొన్నాయని తెలిపారు. ఎన్నో అడ్డంకులను, అవాంతరాలను ఎదుర్కొని 1916 సంవత్సరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని పండిత్ మదన్ మోహన్ మాలవీయ స్థాపించారని చెప్పారు కూచిభొట్ల. ఇలాంటి మహనీయులనుండి స్ఫూర్తి పొందుతూ, సమిష్టి కృషితో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుకొందామన్నారు. భవిష్యత్తు మనదే అన్న బలమైన నమ్మకంతో ముందుకు సాగుదామని పిలుపిచ్చారు కూచిభొట్ల ఆనంద్. అత్యంత విలువైన ప్రాచీన భారతీయ కళలు, సాహిత్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ప్రతి ఒక్కరికి పారదర్శంగా అందించడంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం విజయం సాధించిందని ట్రస్టీస్ బోర్డ్ చైర్మన్ డా. పప్పు వేణుగోపాల్ అన్నారు. స్నాతకోత్సవ ఉపన్యాసకుడు, యునైటెడ్ నేషన్స్ భారత రాయబారి, T.S తిరుమూర్తి విశ్వవిద్యాలయ పత్రిక 'శాస్త్ర' ను ఆవిష్కరించారు. పట్టభద్రులను అభినందిస్తూ ఆయన సందేశమిచ్చారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పట్టభద్రులుగా బయట ప్రపంచంలో అడుగిడుతున్న విద్యార్థులు.. భారతదేశపు చింతన, సంస్కృతి, సంప్రదాయ రాయబారులుగా ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. జ్ఞాన సముపార్జన, ఆత్మబోధనయే కేంద్రమైన భారతీయ సంస్కృతి మిగిలిన సంస్కృతులకంటే విభిన్నమైనదని తెలిపారు. భారతదేశపు విలువలకు అంతర్జాతీయ వేదికపై తగిన గుర్తింపు తేవడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి జరుగుతున్నదని T.S తిరుమూర్తి కొనియాడారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్నో మార్పులు జరిగినా.. తమ తపన మాత్రం చెక్కుచెదరలేదన్నారు విశ్వవిద్యాలయ ప్రొవోస్ట్ చమర్తి రాజు. 2020 సంత్సరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం (Candidacy)లభించిందన్నారు. త్వరలో గుర్తింపు హోదా (Accreditation) కూడా లభిస్తుందని ఆయన ఆశావహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వేతనం (Scholarships) ఇచ్చే దిశగా విశ్వవిద్యాలయం ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొండుభట్ల దీనబాబు. మీరందరు మీ మాతృవిద్యా సంస్థతో సంబంధాలు కొనసాగించాలని విద్యార్థులకు ఆయన సందేశమిచ్చారు. విశ్వవిద్యాలయ సామాజిక సంబంధాల సలహాదారుడు కొండిపర్తి దిలీప్ విద్యార్థులను అభినందిస్తూ వారు భవిష్యత్తులో ఎన్నో విజయాలను సాధించాలని ఆశించారు. మారేపల్లి వెంకటశాస్త్రి గారి వేదప్రవచనంతో ప్రారంభమైన సదస్సులో చమర్తి జాహ్నవి అమెరికా జాతీయ గీతం ఆలపించింది. విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్థుల సహకారంతో Dr. T.K సరోజ స్వరపరిచిన స్నాతకోత్సవ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Published on: Mon Feb 1, 2021 11:33AM

political-news-img

చంద్రబాబు తో మీట్ & గ్రీట్ లో సాయి దత్త పీఠం బృందం

న్యూ జెర్సీ NRI TDP నిర్వహించిన AP CM తో మీట్ & గ్రీట్ సమావేశానికి, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన స్థానిక సాయి దత్త పీఠం ( షిరిడీ ఇన్ అమెరికా) బృందం, చంద్రబాబు నాయుడు ను దుశ్శాలువాతో సత్కరించి, పూలమాలాలంకృతులను చేసి బాబా చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా, సాయి దత్త పీఠం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి మరలా మీరే ముఖ్యమంత్రి గా రావాలని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియచేసారు. 25 ఎకరాలలో నిర్మించ తలబెట్టిన షిరిడీ ఇన్ అమెరికా కు బాబు తన అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేసారు. CM ను కలిసే అవకాశం కల్పించిన నిర్వాహకులకు, ప్రత్యేకంగా మన్నవ మోహనకృష్ణ కు, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్, వెనిగళ్ల వంశీ కృష్ణ లకు రఘుశర్మ మరియు బృందం అభినందనలు తెలియచేసారు.

Published on: Tue Sep 25, 2018 2:26PM

political-news-img

అమెరికాలో తెలుగు హోర్డింగ్స్‌..!

అమెరికాలో తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న సంస్థ సిలికానాంధ్ర. ఇప్పటి వరకు 6000 మందికి పైగా విద్యార్థులకు తెలుగు నేర్పిస్తున్న ఘనత సిలికానాంధ్ర సొంతం. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి వార్షిక పరీక్షలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అలాగే 2016-17 విద్యా సంవత్సరం మనబడి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మనబడి ప్రచార కార్యక్రమాలు మొదలెట్టింది. దీనిలో భాగంగా న్యూజెర్సీ-న్యూయార్క్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన 60 అడుగుల హోర్డింగ్ ఆకట్టుకుంటోంది. తెలుగుతనం ఉట్టిపడే బాపు బుడుగు, సీగాన పెసూనాంబల బొమ్మలు ముచ్చటగొలుపుతున్నాయని పలువురు తెలుగువారు అంటున్నారు. ప్రతీ రోజూ వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారి న్యూయార్క్ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండటం, అత్యంత భారీ సంఖ్యలో భారతీయులు ప్రయాణం చేసే మార్గం అవడం వల్ల-ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశామని మనబడి ఉపాధ్యక్షులు శరత్ వేట తెలిపారు.

Published on: Fri May 13, 2016 6:12PM

political-news-img

బ్లూమింగ్‌టన్ తెలుగు అసోసియేషన్ సేవానిరతి

అమెరికాలోని బ్లూమింగ్‌టన్ తెలుగు అసోసియేషన్ తన సేవా నిరతిని చాటుకుంటోంది. ఇద్దరు చిన్నారుల అరుదైన వ్యాధికి శస్త్రచికిత్స కోసం డిసెంబర్ 20వ తేదీన బ్లూమింగ్‌టన్‌లోని వైడబ్ల్యుసీఎలో ‘బ్రేక్‌ఫాస్ట్ సేల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమరా సెన్సర్ అనే వ్యక్తి ఇద్దరు కుమారులు మసోన్, ఆస్టిన్‌ అవయవ మార్పిడి చేయాల్సిన వ్యాధిని ఎదుర్కొంటున్నారు. అరుదైన ఈ వ్యాధికి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం వుంది. దీని కోసం బ్లూమింగ్టన్ తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘బ్రేక్‌ఫాస్ట్ సేల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్లూమింగ్టన్ తెలుగు అసోసియేషన్, చిల్డ్రన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

Published on: Thu Dec 18, 2014 3:57PM

political-news-img

సిరివెన్నెల ఆవిష్కరించిన సిలికానాంధ్ర మనబడి ప్రభంజన ప్రచార చిత్రం

ప్రస్తుత విద్యాసంవత్సరంలో సిలికానాంధ్ర మనబడిలో 3000 మంది పిల్లలు చక్కగాతెలుగు వ్రాయటం, చదవటం, మాట్లాడటం నేర్చుకున్నారు. మరింతమంది రేపటి తరం పిల్లలకి ప్రణాళికాబద్ధంగా తెలుగు నేర్పించాలని చేసే ప్రయత్నమే సిలికానాంధ్ర మనబడి ప్రభంజనం 2014. సిలికానాంధ్ర మనబడి ప్రభంజనంలో భాగంగా , వచ్చే విద్యాసంవత్సరంలో 5000 మంది పిల్లలకి తెలుగు నేర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా దేశమంతటా వందలాదిమంది తెలుగు భాషా ప్రేమికులు స్వచ్చందంగా మనబడి ప్రభంజనం ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రయోగాలకి పుట్టినిల్లయిన సిలికానాంధ్ర మనబడి ప్రచార చిత్రం ఒకటి రూప కల్పన చేసింది. తెలుగు భాషాభిమానాన్ని పెంచడానికి చరిత్రలో తొలిసారిగా ఆకాశంలొ 15000 అడుగుల ఎత్తులో ఒక ప్రచారచిత్రం చిత్రీకరణ చేయటం జరిగింది. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల ఇందులో స్వయంగా పాల్గొనడం విశేషం. మనబడి ద్వారా తెలుగు నేర్పించే కార్యక్రమానికి ప్రాచుర్యం కల్పించడానికి ఈ ప్రచార చిత్రం ఉపయోగించబడుతుంది. ప్రముఖ గీత రచయిత శ్రీ సిరివెన్నెల శాన్ హోసె నగరంలొ ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. ఆ సందర్భంగా సిరివెన్నెల మాట్లాడుతూ ‘‘మనబడిలొ తెలుగు నేర్పే విధానానికి మరేది సాటి రాదు. ఇన్ని వందలమంది ఉపాధ్యాయులు ఇలా అంకితభావంతో ఇన్ని వేలమంది పిల్లలకి తెలుగు నేర్పడం ఈ భూతలం మీద ఒక్క మనబడిలోనే చూశాను’’ అని అన్నారు. మనబడి కులపతి రాజు చమర్తి మాట్లాడుతూ ‘‘మనబడిలో పిల్లల్ని చేర్పించడానికి అంతర్జాలంలో పేర్లు నమోదు చేసుకొవచ్చు. సెప్టెంబర్ 6 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు ఆనంద్ కూచిభొట్ల , దిలీప్ కొండిపర్తి , దీన బబు కొండుభట్ల, నల్లమోతు ప్రసాద్ , శ్రీరాం కొట్ని , మహమ్మద్ ఇక్బాల్ , వెంకట్ కొండ తదితరులు పాల్గొన్నారు.

Published on: Sat Jul 12, 2014 5:41PM

political-news-img

YSR Vardhanthi Observed in Detroit, USA

The great Telugu leader and visionary, late chief minister of Andhra Pradesh, Dr. Y. S. Rajasekhara Reddy’s vardhanthi was observed on September 7th, 2012 in Farmington, MI. The attendees paid homage by lighting jyothi and offering floral tributes to Dr. YSR followed by a moment of silence. YSR Congress Party supporters in Detroit who gathered at the ceremony remembered the golden regime of their beloved leader Dr YSR and recalled the popular welfare and developmental programs introduced by him.They recalled the activities that were organized by the YSR Congress Party in the past one year to fight for the welfare of the people. They reiterated that YSR Congress Party belongs to the people of Andhra Pradesh and it is established to fulfill the welfare schemes for poor and to complete the popular long term projects set by their beloved leader Dr. YS Rajasekhara Reddy. Several local YSR congress party leaders and members expressed their grievance and emphasized the need to support JAGAN for the welfare of the state. Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi;}

Published on: Fri Sep 21, 2012 7:15PM

political-news-img

NRI's prepare for Lok Satta Party Internal Elections

Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi;} A decision to participate in Lok Satta party internal elections is taken by its overseas supporters. People For LokSatta, a political non profit based in USA, organized a global conference call to promote internal elections of LSP Andhra Pradesh state unit. Prasanna Meda, from Bay Area, lauded Lok Satta party for standing for real internal democracy and also for becoming the first party to give voting rights to NRIs. Raghava Solipuram, from Houston, explained the benefits of membership and emphasized the importance of membership for electing strong leaders. Setting its eyes on 2014 elections, Lok satta party decided to start with internal elections and kicked off state wide membership drive last month. NRIs from bay area, Chicago, Houston, New Jersey, Washington and other places participated and aimed to enroll one lakh voters in Andhra Pradesh including 2000 NRI voters. Attendees also appreciated three successful NRIs, Hyma Sagi, Dilip Sankarreddy and Padma Bhupatiraju, who returned to India to work for Lok Satta party.

Published on: Fri Sep 21, 2012 7:13PM

political-news-img

Dallas Area Telanganites Celebrate Telangana Banquet & Cultural Night

Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi;} Dallas Area Telangana Association (DATA) hosted Telangana Cultural and Banquet Night on Saturday, September 15th at Colleyville Center, Colleyville TX on a grand note, with over 600 Dallas area NRIs attending the event. Colleyville center was decorated for the night with Telangana backdrop all over the center and main attraction being photo exhibition of Telangana’s ten district unique culture. Banquet started with Mohan Padigala welcoming the hall filled gathering and then inviting Mr. Sridhar Reddy, former AP sports council president, a staunch Telangana supporter on to the stage. Speaking on the occasion. Mr. Sridhar Reddy conveyed the importance of celebrating Sep17th as ‘Telangana Vimochan Dinotsavam’ to the attendees and said, he is honored to be with Dallas area Telanganites for the occasion. Banquet night ended with Vote of Thanks by Mahendar Ganapuram thanking presenting sponsors Akula & Associates, Yuva Café, Mayuri & Dream Home mortgage for their generous support for the event. Mahender also thanked remaining sponsors, donors, attendees, supporters, volunteers, media partners for making the event a grand success. Mayuri Indian restaurant served the delicious and authentic Telangana flavored dinner for the evening.

Published on: Fri Sep 21, 2012 7:07PM