అన్నీ మాకే కావాలి

 

 

 

ఆశకు అంతుండాలి అంటారు. కానీ, బోలెడంత ఆశిస్తే కొంతయినా దక్కకుండా పోతుందా అన్నది వీరి థియరీ. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఎంపీటీసీ ఎన్నికలలో జగన్ పార్టీ నాయకులు చిత్ర విచిత్రాలు చూపిస్తున్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు వలవల రాజా బొబ్బిల్లంక ఎంపీటీసీ స్థానం నుంచి బరిలోకి దిగితే.. ఆయన భార్య లక్ష్మీ వాగ్దేవి ఇనుగంటివారి పేట స్థానంలో పోటీలో ఉన్నారు. అలాగే, రఘుదేవపురం మాజీ సర్పంచి పట్టపగలు విష్ణుప్రసాద్ రఘుదేవపురం-1 స్థానం నుంచి పోటీ చేస్తుంటే, ఆయన భార్య పద్మావతి రఘుదేవపురం-3 స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇంతకీ.. వీళ్లంతా పోటీ చేస్తున్నది ఏ పార్టీ నుంచో తెలుసా? ఇంకేది, జగన్ పార్టీ నుంచే.