జడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నికల హడావిడి....

 

జిల్లాలోని 39 ఎంపీపీ స్థానాలకు ఒక జడ్పీ చైర్ పర్సన్ స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాంతో జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కాయి. 6వ తేదీన ఎంపీపీ, ఏడో తేదీన జడ్పీ ఎన్నిక జరుగుతుంది. దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈఓ జయప్రకాశ్ నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. అలాగే ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలువురు నాయకులు శిబిరాలకు తెర తీశారు. ఎంపీపీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఆయా పార్టీల నాయకులు వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లా నుండి హైదరాబాద్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న ఎంపీటీసీ సభ్యులను మంగళవారం సాయంత్రమే ఆయా మండలాల్లోని రహస్య శిబిరాలకు తరలించినట్టు సమాచారం అందుతోంది. క్షేత్రస్థాయిలో కీలకమైన ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు విప్ జారీ చేశాయి.