ఇండియా చేరుకున్న క్రికెటర్ యువరాజ్ సింగ్
Published on: Mon Apr 9, 2012 11:26AM
ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కాన్సర్ చికిత్స కోసం మూడుడ నెలల క్రితం అమెరికా వెళ్ళిన యువరాజ్ సింగ్ ఈ రోజు తిరిగి ఇండియా చేరుకున్నారు. అమెరికాలో జర్మ్ సెల్ కేన్సర్కు ట్రీట్ మెంట్ తీసుకుని, ఢిల్లీకి వచ్చిన యువికి అభిమానులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. త్వరలోనే బ్యాట్తో అలరించాలంటూ అభిమానులు నినాదాలు చేశారు. ట్విట్టర్లో అభిమానులకు ఎప్పటికప్పుడు తన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని యువరాజ్ పోస్ట్ చేస్తునే ఉన్నాడు. యువరాజ్ సింగ్ కి ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు యువరాజ్కు సూచించినట్టు తెలుస్తోంది.


