జగన్ గెలిచింది బీజేపీ ఓట్లతోనే, ఎనీ డౌట్స్ .. బీజేపీ ముఖ్య నేత
posted on Jul 23, 2019 7:10PM
ఏపీలో గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐతే ఈ ఎన్నికలలో ఇవిఎం లను టాంపర్ చేసి జగన్ గెలవటానికి బీజేపీ సహకరించిందని టీడీపీ నాయకులు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఐతే తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎపి బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ నిన్న తెనాలి లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మొన్న జరిగిన ఎన్నికలలో బీజేపీ కి చెందిన 20 శాతం ఓట్లు వైసిపి కి పడటంతోనే అంత భారీ విజయం సాధ్యమైందని అన్నారు. 2014 లో జరిగిన ఎన్నికలలో తమతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవటంతో ఆ పార్టీ అధికారం లోకి వచ్చిందని చెప్పారు. ఐతే టీడీపీ అధికారం లోకి వచ్చిన తరువాత చంద్రబాబు రాష్ట్రం లో మోడీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసారని అలాగే గత ఎన్నికలలో మోడీ పై లేని పోనీ ఆరోపణలు చేయటంతో బీజేపీ ఓటు బ్యాంకు ఎక్కువగా వైసిపి కి చేరిందని తెలిపారు. ఐతే 2019 లో జరిగిన ఎపి ఎన్నికలలో బీజేపీ ఓటు షేరు ౦.84 శాతం ఉండటం గమనార్హం.