ఆరు నెలల్లో జగన్ పార్టీ హుష్‌కాకి: జేసీ

 

మరో ఆరు నెలల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు మీద జగన్ పార్టీ నాయకుడు దాడి చేయడమే కాకుండా, తిరిగి ఆయన మీదే కేసు కేసు పెట్టడం విచిత్రంగా వుందని జేసీ అన్నారు. కుక్కునూరులో కలెక్టర్ పర్యటనను జగన్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకున్నాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ముంపు మండలాల విషయంలో టీఆర్ఎస్ పార్టీనే చప్పుడు చేయకుండా వుందని, అలాంటప్పుడు జగన్ పార్టీ ఎందుకు లేనిపోని హడావిడి చేస్తోందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎక్కువ లాభపడేది రాయలసీమ ప్రాంతమేనని ఎంపీ జేసీ దివాకరరెడ్డి వివరించారు.