వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్ !!

 

 

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఎమ్మెల్యేల కోటాలో 3 ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ చేయటం కోసం ఈ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీని కోసం సీఎం జగన్ వైసిపి తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. వీరిలో ఒకరు ప్రస్తుత మంత్రి మోపిదేవి వెంకటరమణ కాగా మిగిలిన ఇద్దరు, మహమ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణా రెడ్డి. వీరిలో మహమ్మద్ ఇక్బాల్ మొన్న మేలో జరిగిన ఎన్నికలలో హిందూపురం నుండి బాలకృష్ణ పై పోటీ చేసి ఓడి పోయారు. కాగా,చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికలకు కొద్దిరోజుల ముందే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ పదవి హామీ మేరకు ఆయన పార్టీలో చేరారు. ఈ నెల 14వ తేదీన నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను జగన్ ఖరారు చేశారు. అభ్యర్థులకు ఇప్పటికే సీఎం నుంచి కబురు అందినట్టుగా కూడా తెలుస్తోంది.