మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. మంత్రి మేనల్లుడికి కూడా!!

ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఇటీవల, విజయనగరం జిల్లా ఎస్‌.కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విషయం తెలిసిన వెంటనే గన్ మెన్లను ఇళ్లకు పంపించేశారారు. ప్రస్తుతం ఎమ్మెల్యే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మరోవైపు, ఆయన ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లడంతో తోటి ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. అలాగే ఇటీవల ఆయన నియోజకవర్గంలో పర్యటన కూడా జరిపారని తెలుస్తోంది. దీంతో ఆయనను ఎవరెవరు కలిశారు ? ఆయనకు అసలు కరోనా ఎలా సోకింది? అనే విషయాల్ని అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఉత్తరాంధ్రలో కూడా ఓ వైసీపీ నేత కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సమాచారం.