జనసేనలోకి వైసీపీ నేత

 

ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా జనసేనలో చేరికలు మొదలయ్యాయి.. సీనియర్ నేత మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్‌ తో కలిసి వైసీపీని వీడి జనసేనలో చేరారు.. టీడీపీలో మంత్రిగా, కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా పదవులు చేపట్టిన ముత్తా గోపాలకృష్ణకు కాకినాడలో బలమైన పట్టుంది.. అలాగే ఆయన తనయుడు శశిధర్‌ కూడా క్రియాశీల రాజకీయ నేతగా ఎదిగారు.. కాకినాడ సిటీ వైసీపీ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేసారు.. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ముత్తా వైసీపీని వీడి, తన అనుచరులతో తాజాగా జనసేనలో చేరారు.. ముత్తా చేరికతో కాకినాడ జనసేన కేడర్‌లో నూతనోత్సాహం వచ్చింది.. మరోవైపు ముత్తా వైసీపీని వీడటం ఆ పార్టీకి గట్టి దెబ్బ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.