చలో అసెంబ్లీ... కిందపడిపోయిన వైసీపీ నేతలు...
posted on Nov 20, 2017 12:19PM
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... వైసీపీ నేతలు చలో అసెంబ్లీ నిరసన యాత్ర ప్రారంభించారు. అయితే ఈ యాతలో అపశ్రుతి చోటు చేసుకుంది. యాత్రలో పాల్గొన్న వైసీపీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో కొంతమంది నేతలు వాహనం నుండి పడిపోయారు. దీంతో వారికి గాయాలయ్యాయి. పోలీసు వాహనానికి సడన్ బ్రేకు వేయడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో.. వైకాపా నేతలు పార్థసారధి, మల్లాది విష్ణు, జోగి రమేష్, ఉదయభాను తదితరులు ఉన్నారు. అరెస్ట్ చేసిన నేతలను పోలీసులు మాచవరం స్టేషన్ కు తరలించారు. వీరందరినీ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారని ప్రజా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. నేతలకు తగిలిన గాయాలపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.