వైకాపాలో ముదురుతున్న ఆదిపత్యపోరు
posted on Sep 5, 2013 8:04AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ విషయంలో పార్టీ వైఖరికి నిరసనగా పలువురు నేలు పార్టీకి దూరంగా కాగా మరికొందరు ఈ అధిపత్యపోరుతో దూరమయ్యేలా ఉన్నారు.
తాజా షర్మిల పాదయాత్ర విషయంలో ఈ వివాదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. షర్మిల త్వరలో కర్నూలు జిల్లాలో బస్సు యాత్రకు వస్తుండగా ఆమె తమ నియోజక వర్గంలోనే తిరిగేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు శోభనాగిరెడ్డి, భూమానాగిరెడ్డిలు.
చిత్తూరు, అనంతపురం లాంటి జిల్లాల్లో కూడా కేవలం రెండు నియోజక వర్గాల్లోనే బహిరంగ సభలు నిర్వహిస్తుండగా, కర్నూలులో మాత్రం నాలుగు బహిరంగ సభలకు షర్మిలను ఒప్పించారు భూమా దంపతులు. దీంతో ఆ జిల్లాలోని ఇతర నాయకులతో పాటు ఇతర జిల్లాల నాయకులు కూడా ఈ దంపతులపై గుర్రుగా ఉన్నారు. ఈ అధిపత్యం ఇలాగే కొనసాగితే మరింత మంది నాయకులు పార్టీని వీడే అవకాశం ఉందంటున్నారు.