26న సమైక్య శంఖారావ౦

 

 YSRC Samaikya Sankharavam, jagan mohan reddy, ysr congress, telangana, Samaikya ndhra

 

 

ఈ నెల 26న హైదరాబాదులో సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి ఇచ్చారని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సమైక్యమంటే... తెలంగాణ..కోస్తాంధ్ర.. రాయలసీమ' అని చెప్పారు. తనకు మూడు ప్రాంతాలు సమానమేనని..ఆ మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా మైక్య శంఖారావ౦ ఉంటుందని తెలిపారు.

 

సమైక్యాంధ్ర కోసం తనతో పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తారని చెప్పారు. కోర్టు అడ్డంకుల వల్ల తనకు ఢిల్లీ వెళ్లే అవకాశం లేకుంటే తమ పార్టీ ఎంపీల ద్వారా తన రాజీనామా లేఖను పంపిస్తానని, రాజీనామా ఆమోదించాలని తాను స్పీకర్ మీరా కుమార్‌ను విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.