కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ మూడు ఒకటే

 

కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ మూడు ఒకటే.. ఈ మూడు పార్టీలు ఒకటెలా అవుతాయి.. కాంగ్రెస్,బీజేపీ అసలు ఎప్పటికీ ఒక్కటయ్యే ప్రసక్తే లేదు.. టీడీపీ ఏమో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. ఇక టీడీపీ,బీజేపీ గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసాయి కానీ ఇప్పడున్న పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కలిసే అవకాశమే లేదు.. మరి ఈ మూడు పార్టీలు ఒకటెలా అవుతాయి అంటారా.. ఒకటే అంటే మూడు పార్టీలు కలిసిపోయాయని కాదు.. మూడు ఒకే తప్పు చేశాయని.. తాజాగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ బీజేపీ, వైసీపీల మధ్య రహస్య పొత్తు ఉందని వస్తున్న ఆరోపణలపై స్పందించారు.. బీజేపీ, వైసీపీల మధ్య పొత్తు అని వస్తున్న వార్తలు అవాస్తవమని.. అసలు కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ మూడు ఒకటే.. ఈ మూడు పార్టీల వల్లే ఏపీ నాశనం అయిపోయింది.. అలాంటి పార్టీలతో వైసీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బొత్స స్పష్టం చేసారు.