కేసీఆర్ ని తిట్టిన షర్మిల...

వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల జోరు పెంచింది. మహిళా దినోత్సవం  సందర్బంగా కేసీయార్ ప్రభుత్వంలో మహిళకు అన్యాయం జరుగుతుందని తెలంగాణల రాష్ట్ర మంత్రి మండలిలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించిందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్ లో ఆమె వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు మనుగడ కరువైయిందని. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని అన్నారు. ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందని, కానీ, ప్రస్తుత తెలంగాణలో స్త్రీలకు ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అసమానతలు ఉన్నాయని... మహిళలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.వైయస్ రాజశేఖరెడ్డి హయాంలో ఎందరో మహిళలు మంత్రి పదవులను అలంకరించారని... కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే మంత్రులుగా ఉన్నారని చెప్పారు. ఆ ఇద్దరికీ కూడా ఐదేళ్ల తర్వాతే అవకాశం దొరికిందని అన్నారు. మహిళలు అన్నింటిలో సగం అయినప్పుడు... ఈ అన్యాయం ఎందుకని ప్రశ్నించారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని చెప్పారు. తాము చేయబోయే ప్రతి పనిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. 

దుర్గమ్మ సాక్షిగా మహిళాదినోత్సవం రోజున మహిళలపై వైసీపీ ప్రభుత్వం

విజయవాడ దుర్గమ్మ సాక్షిగా మహిళాదినోత్సవం రోజున మహిళలపై వైసీపీ ప్రభుత్వం. కానకదుర్గ దర్శనానికి వెళ్లిన మహిళా రైతులపై అమానుషంగా ప్రవర్తించిన సొంత అన్న ప్రభుత్వం ఒక వైపు మహిళపై స్వతహాగా దాడి చేస్తుంటే అన్నను వ్యతిరేకించలేని చెల్లి షర్మిల తెలంగాణలో మహిళలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడం హాస్యాస్పందంగాని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. షర్మిల అలా మాట్లాడాం వెనక రాజకీయ లాభం ఉందని చెప్పకనే చెపుతుంది.