చంద్రబాబు చేసిన ఆ పనికి దేవుడు మొట్టికాయలు: జగన్

ఏపిలో హోరా హోరీగా జరిగిన ఎన్నికల సమరం ముగిసి, వైసిపి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన వైసిపి శాసన సభ్యుల సమవేశంలో ఎమ్మెల్యేలు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లడుతూ గత ఎన్నికల్లొ టిడిపి కూటమి కంటే కేవలం ఒక్క శాతం వోట్ల తేడాతొ ప్రతిపక్షానికి పరిమితమయ్యామని ఐతే ఈసారి టిడిపి కంటే పది శాతం వోట్లు అధికంగా సాధించి అధికారంలోకి వచ్చామని తెలిపారు. అలాగే గత ఎన్నికల్లొ నెగ్గిన వైసిపి కి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపిలను చంద్రబాబు ప్రలొభ పరిచి లాక్కున్నారని ఆరోపించిన జగన్.. ఇప్పుడు టిడిపిలో చంద్రబాబు తో కలిపి ప్రస్తుత ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలు మిగిలారని వ్యాఖ్యానించారు. అక్రమాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొట్టికాయలు వేస్తాడో చెప్పడానికి చంద్రబాబే నిదర్శనం అని దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడని అన్నారు.