ఏర్పేడు లారీ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్

చిత్తూరు జిల్లా ఏర్పేడులో లారీ ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబసభ్యులను వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడి నుంచి మునగాలపాలెంకు వెళ్లారు. మునగాలపాలెంలో 13 మంది మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె ప్రాంతాలకు వెళతారు. మార్గమధ్యంలో స్వర్ణముఖి నదిలో ఇసుక గుంతలను ఆయన పరిశీలిస్తారు.