ఏపీ లో  కొత్తగా 17 కేసులు నమోదు: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష


రైతు భరోసాకేంద్రాల ఆధ్వర్యంలో జనతామార్కెట్‌ల ఏర్పాటుపై ఆలోచన చేయాలన్న సీఎం

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించే పనిలో ఏ పీ అధికారులు బిజీ అయ్యారు. రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను సేకరించామని తెలిపిన అధికారులు. జమాత్‌ నిర్వాహకులనుంచి, పోలీసులనుంచి, రైల్వే వారినుంచి..  ఇలా వివిధ రకాలుగా సమాకారాన్ని సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. వీరిపై ప్రధానంగా దృష్టిసారించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి.

ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందకు వచ్చి చికిత్స తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదు, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయనీ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలిసి వారి అందర్నీ గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్య సదుపాయాలు అందేలా చేయాలనీ సి ఎం సూచించారు. 

అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపైనా సర్వే జరుగుతుందా? లేదా? అని ఆరాతీసిన సీఎం. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరాయంగా కొనసాగాలని ,షెల్టర్లలో ఉన్నవారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్‌ చేయాలనీ సో ఎం సూచించారు. 
అర్బన్‌ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై సీఎం ఆరా తీశారు. సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లు ద్వారా డోర్‌ డెలివరీని ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు. ప్రతి దుకాణం ముందు ప్రకటించిన∙ధరలతో పట్టికను ప్రదర్శించాలని స్పష్టంచేసిన సీఎం. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని దుకాణాల ముందు పెట్టిస్తామన్న అధికారులు. దీనిపై మానిటరింగ్‌ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. 

గిట్టుబాటు ధరలు కల్పించడానికి  తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసిన సీఎం. తాత్కాలిక పరిష్కారంగా ప్రస్తుతానికి రైతులనుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయమన్న సీఎం. అరటి, టమోటా లాంటి రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం . నిల్వచేయలేని పంటల విషయంలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం ఆదేశం

తక్షణం సంబంధిత అధికారులు కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలంటూ గట్టిగా ఆదేశించిన సీఎం
లాక్‌డౌన్‌ సమయంలో అన్ని దుకాణాల వద్ద పండ్లు అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామన్న అధికారులు. దీనివల్ల రిటైల్‌ వ్యాపారం పెరుగుతుందన్న అధికారులు. దీనివల్ల రైతులకు కొంతైనా మేలు జరుగుతుందన్న అధికారులు
ఆమేరకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు
శాశ్వత పరిష్కారాలపైనా దృష్టిపెట్టాలని స్పష్టం చేసిన సీఎం. రైతు భరోసాకేంద్రాల ఆధ్వర్యంలో జనతామార్కెట్‌ల ఏర్పాటుపై ఆలోచన చేయాలన్న సీఎం. గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా డిమాండ్‌కు తగినట్టుగా ఈ మార్కెట్లు ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాలన్న సీఎం. ఆమేరకు డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను నెలకొల్పే దిశగా ఆలోచన చేయాలన్న సీఎం. ఏ ప్రభుత్వంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాటిని పరిశీలించి మంచి విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.