వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

 

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో మే 23 న తేలనుంది. అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ.. ఎవరికివారు అధికారం మాదంటే మాదని చెప్తున్నాయి. అయితే వైసీపీ.. టీడీపీ కంటే చాలా బలంగా నమ్మకంగా చెబుతోంది. ఫలితాలు రావడం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడమే అన్నంత బలంగా చెబుతోంది. తాము అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ ఎంత బలంగా నమ్ముతుందో తెలియాలంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే అర్దమవుతుంది. వైఎస్ ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరలవుతోంది. దీంతో.. తమదే అధికారమని వైసీపీకి ఇంత నమ్మకం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం శ్రీవిద్యా సర్వమంగళాదేవీ పీఠానికి చెందిన జ్యోతిష్యులు మురపారక కాళిదాసు శర్మ.. జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ముహుర్తం పెట్టారు. ఏపీలో జగనే సీఎం అవుతారని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. మే 26 ఉదయం 9.29 గంటలకు దివ్యమైన ఘడియలు ఉన్నాయని.. ఆ సమయంలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే తిరుగుండదంటున్నారు. జగన్ జన్మనక్షత్రం రోహిణి అని. వైసీపీ ఆవిర్భావ దినం ఆరుద్ర నక్షత్రాల కలయికతో అద్భుతమైన ముహర్తం అని శర్మ చెబుతున్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ గెలుస్తారని తానే ముందు చెప్పానన్నారు. దేవనాడీ కాలచక్ర గ్రహ గ్రతుల్ని అనుసరించి కచ్చితమైన జ్యోతిష్యం చెప్పామని తెలిపారు శర్మ. అందుకే ఇప్పుడు ఏపీలో కూడా జగనే గెలుస్తారని అంటున్నారు.