జగన్ ఆమరణ నిరాహార దీక్ష
posted on Aug 24, 2013 8:59PM
విజయమ్మ దీక్షను భగ్నం చేయటంతో ఇప్పుడు ఆపార్టీ తరుపున ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులోనే దీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ ఓ ప్రకటన చేశారు. విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.
శనివారం చంచల్గూడ జైల్లో జగన్ను కలిసిన కొణతాల రామకృష్ణ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ టిడిపి మౌనంపై నిరసనగా జగన్ నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టుగా ప్రకటించారు. జగన్ను అణగ దొక్కాలనే కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ విభజనకు సిద్దమయ్యిందన్నారు.
జగన్ దీక్షతో పాటు ప్రజల్లో ధైర్యం నింపేందుకు షర్మిల త్వరలో బస్సుయాత్ర కూడా చేపడతారని ప్రకటించారు. జగన్ నిరాహార దీక్షతో రాష్ట్రంలో ఎదురయ్యే సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.