దేనికైనా సిద్దంగా ఉండండి: ఎంపిలతో జగన్

 

ఏపి ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందె. ఈ ఎన్నికల్లొ ఎవరూ ఊహించని విధంగా 23 లోక్ సభ స్థానాలను వైసిపి కైవసం చేసుకొంది. ఈ రోజు వైసిపి ఎంపీలతో జరిగిన తొలి సమావేశంలొ ప్రసంగించిన జగన్ ఏపికి ప్రత్యేక హోదా సాధించే ఎజెండాతోనే ప్రతి ఒక్క ఎంపి పనిచేయాలని జగన్ సూచించారు. జరిగిన ఎనికల్లో ఏపికి స్పెషల్ స్టేటస్ తీసుకువస్తామని చెపితే నమ్మి ప్రజలు వైసిపిని భారీ మెజారిటీతో గెలిపించారు, కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటానికి సిద్దంగా వుండాలని సూచించారు. అవసరమైతే ఎంపీలు రాజీనామాలకైనా సిద్ధంగా ఉండాలని జగన్ వారికి సూచించారు. రేపు ఉదయం ఎంపీలతో కలిసి జగన్ డిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో రెపు జరిగే భేటీలో స్పెషల్ స్టేటస్ గురించి జగన్ అండ్ టీం ప్రస్తావిస్తారని తెలుస్తోంది.