వైసీపీ ఎంపీల పని తీరు పై జగన్ వద్ద షాకింగ్ రిపోర్ట్!!

 

ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో 25 లోక్ సభ స్థానాలకు గాను 22  స్థానాలను గెలిచి వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా సీఎం జగన్ ఈ ఎంపీల పని తీరు పై రిపోర్టులు తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం. లోక్ సభలో చర్చలలో పాల్గొనటం దగ్గరి నుండి నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోవడం వరకు వేరు వేరు అంశాల ఆధారంగా ఈ రిపోర్టులు రెడీ అయినట్లు సమాచారం. ఐతే ఈ  రిపోర్టుల ప్రకారం 22 మంది ఎంపీలలోను కేవలం ఎనిమిది మందికే పాస్ మార్కులు పడినట్లుగా టాక్. మిగిలిన ఎంపీలు ఈ రెండు విషయాలలో ఫెయిల్ అవడమే కాకుండా తమ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ గిల్లి కజ్జాల  వ్యవహారాలు పరిష్కారం కోసం ఒకొక్కసారి పార్టీ అధిష్టానం వరకు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో ఎంపీలు తమ పనితీరు మార్చుకోవాలని సాక్షాత్తు పార్టీ అధినేత జగన్ నుండి ఆదేశాలు వెళుతున్నాయట.