జగన్ కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీళ్లే!!

 

ఈరోజు వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తన మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని జగన్ ప్రకటించారు. జగన్ సంచలన ప్రకటన చేసారో లేదో అప్పుడే రాజకీయ వర్గాల్లో మొదలైంది. కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు డిప్యూటీ సీఎంలుగా ఉంటారని జగన్ ప్రకటించగా.. వారు ఎవరన్న చర్చ జోరందుకుంది. ఇక సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మైనారిటీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎస్సీ వర్గం నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎస్టీ వర్గం నుంచి సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, బీసీ కులాల నుంచి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధిలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయట.