సీబీఐ కోర్టు.. జగన్ కు ఊరట..
Published on: Fri Apr 28, 2017 1:23PM
.jpeg.jpg)
సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలన్న వాదనను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని..ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈరోజు దీనిపై విచారించిన కోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వెలువరచడం జగన్ తో పాటు పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ జూన్ 9కి వాయిదా వేశారు.


