TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అడుగడుగునా ఉల్లంఘన... పోలీసులపై ఆగ్రహం

Published on: Wed Jul 9, 2025 4:00PM

 

 

మామిడి రైతుల పరామర్శ కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగడుగునా ఉల్లంఘన చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి పోలీసులు అనుమతిస్తే వైసీపీ భారీగా జనసమీకరణ చేసింది. ఉదయం 11 నుంచి మధ్యా 1.40 వరకు సైతం మార్కెట్ యార్డు కు చేరుకోలేదు. పోలీసుల భారీ భద్రతా కల్పించిన అనుమతి ఇచ్చిన 500 మంది కంటే 5వేల వరకు జనసమీకరణ చేశారు. రోడ్డు షో వద్దని పోలీసులు వారించినా వినకుండా వైఎస్ జగన్ పర్యటన రోడ్డు షో గా మారింది. నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై మామిడి కాయలు పోసి ట్రాక్టర్లతో తొక్కించిన నానా హడావిడి చేశారు. వైఎస్ జగన్ వాహనం వెంట వచ్చిన నాయకులు వల్ల స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది.