TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేడే రెండవ ఎవడు విడుదల

Published on: Fri Jan 3, 2014 10:47AM

 

రాంచరణ్ నటించిన "ఎవడు" వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు సంక్రాంతి బరిలో పోటీ పడుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తుంది. తాజాగా "ఫ్రీడం.." అనే సాంగ్ ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న తరుణంలో ఈ చిత్ర రెండవ ట్రైలర్ ను అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ ను శుక్రవారం నగరంలో ఓ థియేటర్ లో విడుదల చేయనున్నారు. దీనికి చరణ్ రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శృతిహాసన్, ఎమిజాక్సన్ హీరోయిన్లు.