TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎవడు కోసం మరో పాట

Published on: Mon Dec 23, 2013 2:22PM

 

రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "ఎవడు". సినిమా విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటం వలన ప్రేక్షకుల్లో హుషారు పెంచడానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసమే ఒక స్పెషల్ పాటను తెరకెక్కించనున్నారు. దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఒక స్పెషల్ సాంగ్ ను కంపోస్ చేసాడు. త్వరలోనే ఈ పాటను చరణ్, బన్నీ, దేవిశ్రీప్రసాద్ లపై చిత్రీకరించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. చరణ్ సరసన శృతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. బన్నీ, కాజల్ ఓ ముఖ్య పాత్రలో నటించారు.