TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిన్న అరవింద్ కుమార్... నేడు బిఎల్ ఎన్ రెడ్డి...ఎసిబి విచారణ కంటిన్యూ

Published on: Fri Jan 10, 2025 11:52AM

ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం గంటగంటకు మారుతుంది. నిన్న దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ ను    ఎసిబి విచారణ చేసింది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఎసిబి విచారించింది. మాజీమంత్రి కెటీఆర్ ఆదేశం మేరకు  విదేశీ సంస్థకు తాను నిధులు మళ్లించినట్టు ఆయన ఒప్పుకున్నారు. మళ్లీ మేమే అధికారంలో వస్తాం. అనుమతులు అవసరం లేదని కెటీఆర్ తనతో అన్నట్టు అరవింద్ కుమార్ వెల్లడించారు. తాజాగా శుక్రవారం ఈ కేసులో ఎ 3 గా ఉన్న చీప్ ఇంజినీర్ బిఎల్ ఎన్ రెడ్డి  ఎసిబి విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ , కెటీఆర్ స్టేట్ మెంట్ ఆధారంగా బిఎల్ ఎన్ రెడ్డి ని విచారిస్తున్నారు. ఎసిబి  అధికారుల ప్రశ్నలకు బిఎల్ ఎన్ రెడ్డి సహకరించడం లేదని తెలుస్తోంది.